‘’ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎంపీ బాలశౌరి గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితుమైన దాసరి కిరణ్ కుమార్ కి ఆత్మీయ సన్మాన కార్యక్రమం తెనాలిలో జరిగింది. మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపి నందిగామ సురేశ్, సినీ దర్శకులు బాబి కొల్లి, త్రినాధరావు, మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో దాసరి కిరణ్ మాట్లాడుతూ .. ఇది ఒక పదవి లా కాదు.. శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం శ్రీ జగన్ మోహన్ రెడ్డి రూపంలో దేవుడు నాకు ఇచ్చాడని భావిస్తున్నాను. శివన్నది చాలా మంచి మనసు. నాకు ఎంతో ఆప్తులు. ఆయన అద్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంత్రి నాగార్జున అన్న ఈ వేడుకకు రావడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. అలాగే రమణ గారు, నందిగామ సురేష్ గారితో పాటు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
This post was last modified on February 1, 2023 12:45 pm
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…