సమంతా టైటిల్ రోల్ పోషిస్తూ గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో దిల్ రాజు భాగస్వామిగా రూపొందిస్తున్న శాకుంతలం ఫిబ్రవరి 17 నుంచి తప్పుకున్నట్టు ఫిలింనగర్ టాక్. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ వాయిదా మినహా మరో మార్గం లేనట్టుగా టీమ్ భావిస్తున్నట్టు వినికిడి. కారణాలు ఏంటా అని తరిచి చూస్తే చేతిలో ఉన్నది కేవలం పదహారు రోజులు. ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేయాలి. అంటే హైదరాబాద్ లో ఒకటే ఈవెంట్లు ఇంటర్వ్యూలు చేస్తే సరిపోదు. చెన్నై బెంగళూరు ముంబై అంటూ పలుచోట్ల తిరిగి రీచ్ పెంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ టైం చాలా తక్కువ.
అసలు సామ్ ముంబై నుంచి ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకైనా మంచిదని గుణశేఖర్ మీడియా ఇంటరాక్షన్లు మొదలుపెట్టారు కానీ ఈలోగా నిర్ణయం మారిపోయిందని వినికిడి. ఇది ముందే పసిగట్టడం వల్లే కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథని పోస్ట్ పోన్ చేయకుండా జాగ్రత్త పడ్డారనే కామెంట్ నిజమే అనిపిస్తుంది. అఫీషియల్ అయ్యేదాకా శాకుంతలంకు సంబంధించి ఇదంతా గాసిప్ గానే తీసుకోవాలి కానీ జరుగుతున్న పరిణామాలు పైన చెప్పిన అంశాలు చూస్తే పూర్తిగా కొట్టిపారేయలేం. వాస్తవమైతే మటుకు సమంతా ఫ్యాన్స్ కు షాకే.
యశోద సక్సెస్ తర్వాత మరో బ్రేక్ దక్కుతుందని ఆశపడిన సామ్ ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్ లో ఉన్నట్టు తెలిసింది. నిజానికి తనెక్కడ ఉందో స్పష్టంగా తెలియనంత గుట్టుని మైంటైన్ చేస్తోంది. శాకుంతలం పెట్టిన బడ్జెట్ కి వీలైనంత వరకు మంచి సీజన్ లో సోలోగా ప్రమోషన్లకు పుష్కలమైన సమయం ఉంచుకుని రావాలి తప్పించి హడావిడి చేస్తే ఓపెనింగ్స్ ఇబ్బందుల్లో పడతాయి. పైగా పఠాన్ దూకుడు కనీసం నెలరోజులు ఉంటుందన్న బాలీవుడ్ విశ్లేషకుల అంచనా. 17నే షెహజాదా రిలీజ్ నేపథ్యంలో శాకుంతలం వేసే ఏ అడుగైనా ఆలోచించి వేస్తే బెటర్. చూడాలి మరి ఏం జరగనుందో.
This post was last modified on January 31, 2023 10:05 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…