సమంతా టైటిల్ రోల్ పోషిస్తూ గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో దిల్ రాజు భాగస్వామిగా రూపొందిస్తున్న శాకుంతలం ఫిబ్రవరి 17 నుంచి తప్పుకున్నట్టు ఫిలింనగర్ టాక్. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ వాయిదా మినహా మరో మార్గం లేనట్టుగా టీమ్ భావిస్తున్నట్టు వినికిడి. కారణాలు ఏంటా అని తరిచి చూస్తే చేతిలో ఉన్నది కేవలం పదహారు రోజులు. ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేయాలి. అంటే హైదరాబాద్ లో ఒకటే ఈవెంట్లు ఇంటర్వ్యూలు చేస్తే సరిపోదు. చెన్నై బెంగళూరు ముంబై అంటూ పలుచోట్ల తిరిగి రీచ్ పెంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ టైం చాలా తక్కువ.
అసలు సామ్ ముంబై నుంచి ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకైనా మంచిదని గుణశేఖర్ మీడియా ఇంటరాక్షన్లు మొదలుపెట్టారు కానీ ఈలోగా నిర్ణయం మారిపోయిందని వినికిడి. ఇది ముందే పసిగట్టడం వల్లే కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథని పోస్ట్ పోన్ చేయకుండా జాగ్రత్త పడ్డారనే కామెంట్ నిజమే అనిపిస్తుంది. అఫీషియల్ అయ్యేదాకా శాకుంతలంకు సంబంధించి ఇదంతా గాసిప్ గానే తీసుకోవాలి కానీ జరుగుతున్న పరిణామాలు పైన చెప్పిన అంశాలు చూస్తే పూర్తిగా కొట్టిపారేయలేం. వాస్తవమైతే మటుకు సమంతా ఫ్యాన్స్ కు షాకే.
యశోద సక్సెస్ తర్వాత మరో బ్రేక్ దక్కుతుందని ఆశపడిన సామ్ ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్ లో ఉన్నట్టు తెలిసింది. నిజానికి తనెక్కడ ఉందో స్పష్టంగా తెలియనంత గుట్టుని మైంటైన్ చేస్తోంది. శాకుంతలం పెట్టిన బడ్జెట్ కి వీలైనంత వరకు మంచి సీజన్ లో సోలోగా ప్రమోషన్లకు పుష్కలమైన సమయం ఉంచుకుని రావాలి తప్పించి హడావిడి చేస్తే ఓపెనింగ్స్ ఇబ్బందుల్లో పడతాయి. పైగా పఠాన్ దూకుడు కనీసం నెలరోజులు ఉంటుందన్న బాలీవుడ్ విశ్లేషకుల అంచనా. 17నే షెహజాదా రిలీజ్ నేపథ్యంలో శాకుంతలం వేసే ఏ అడుగైనా ఆలోచించి వేస్తే బెటర్. చూడాలి మరి ఏం జరగనుందో.
This post was last modified on January 31, 2023 10:05 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…