సమంతా టైటిల్ రోల్ పోషిస్తూ గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో దిల్ రాజు భాగస్వామిగా రూపొందిస్తున్న శాకుంతలం ఫిబ్రవరి 17 నుంచి తప్పుకున్నట్టు ఫిలింనగర్ టాక్. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ వాయిదా మినహా మరో మార్గం లేనట్టుగా టీమ్ భావిస్తున్నట్టు వినికిడి. కారణాలు ఏంటా అని తరిచి చూస్తే చేతిలో ఉన్నది కేవలం పదహారు రోజులు. ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేయాలి. అంటే హైదరాబాద్ లో ఒకటే ఈవెంట్లు ఇంటర్వ్యూలు చేస్తే సరిపోదు. చెన్నై బెంగళూరు ముంబై అంటూ పలుచోట్ల తిరిగి రీచ్ పెంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ టైం చాలా తక్కువ.
అసలు సామ్ ముంబై నుంచి ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకైనా మంచిదని గుణశేఖర్ మీడియా ఇంటరాక్షన్లు మొదలుపెట్టారు కానీ ఈలోగా నిర్ణయం మారిపోయిందని వినికిడి. ఇది ముందే పసిగట్టడం వల్లే కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథని పోస్ట్ పోన్ చేయకుండా జాగ్రత్త పడ్డారనే కామెంట్ నిజమే అనిపిస్తుంది. అఫీషియల్ అయ్యేదాకా శాకుంతలంకు సంబంధించి ఇదంతా గాసిప్ గానే తీసుకోవాలి కానీ జరుగుతున్న పరిణామాలు పైన చెప్పిన అంశాలు చూస్తే పూర్తిగా కొట్టిపారేయలేం. వాస్తవమైతే మటుకు సమంతా ఫ్యాన్స్ కు షాకే.
యశోద సక్సెస్ తర్వాత మరో బ్రేక్ దక్కుతుందని ఆశపడిన సామ్ ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్ లో ఉన్నట్టు తెలిసింది. నిజానికి తనెక్కడ ఉందో స్పష్టంగా తెలియనంత గుట్టుని మైంటైన్ చేస్తోంది. శాకుంతలం పెట్టిన బడ్జెట్ కి వీలైనంత వరకు మంచి సీజన్ లో సోలోగా ప్రమోషన్లకు పుష్కలమైన సమయం ఉంచుకుని రావాలి తప్పించి హడావిడి చేస్తే ఓపెనింగ్స్ ఇబ్బందుల్లో పడతాయి. పైగా పఠాన్ దూకుడు కనీసం నెలరోజులు ఉంటుందన్న బాలీవుడ్ విశ్లేషకుల అంచనా. 17నే షెహజాదా రిలీజ్ నేపథ్యంలో శాకుంతలం వేసే ఏ అడుగైనా ఆలోచించి వేస్తే బెటర్. చూడాలి మరి ఏం జరగనుందో.
This post was last modified on January 31, 2023 10:05 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…