మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మామూలు ఉత్సాహంలో లేడు. సంక్రాంతికి విడుదలైన ఆయన కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లింది. గత ఏడాది ‘ఆచార్య’ షాక్, ‘గాడ్ ఫాదర్’ అసంతృప్తి తర్వాత చిరుకు ‘వాల్తేరు వీరయ్య’ గొప్ప ఉపశమనం అనడంలో సందేహం లేదు. ఈ ఊపులో ‘భోళా శంకర్’ను చకచకా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు చిరు. దీని తర్వాత చిరు చేయబోయే సినిమా గురించి క్లారిటీ లేదు.
ముందు అనుకున్న ప్రకారం అయితే వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరంజీవి నటించాల్సింది. కానీ స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు చిరు. ఇప్పుడు కొత్త ఆప్షన్ల కోసం చూస్తున్నాడు మెగాస్టార్. ఆయన పరిశీలనలోకి త్రినాథరావు నక్కిన పేరు వచ్చినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.
‘స్టార్ డైరెక్టర్’ అనిపించుకోలేదన్న మాటే కానీ.. త్రినాథరావుకు టాలీవుడ్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. తొలి ప్రయత్నంగా చేసిన ‘మేం వయసుకు వచ్చాం’ అనే చిన్న సినిమా అంతగా ప్రేక్షకుల దృష్టిలో పడలేదు కానీ.. ఆ తర్వాత త్రినాథరావు చేసిన సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా వరుసగా పెద్ద హిట్లే అయ్యాయి. తాజాగా ‘ధమాకా’తో వంద కోట్ల గ్రాస్ సినిమాను అందించి తన పేరు మార్మోగేలా చేశాడు త్రినాథరావు. ఆ సినిమాలో రవితేజను మాస్ మెచ్చేలా ప్రెజెంట్ చేయడం చూసి త్రినాథరావుకు చిరు సినిమా ఆఫర్ చేశాడంటున్నారు. త్రినాథరావు కూడా ప్రాథమికంగా ఒక లైన్ చెప్పి చిరును ఇంప్రెస్ చేశాడట.
ఐతే చిరు ఆషామాషీగా ఏ స్క్రిప్టునూ ఓకే చేయడు. పూరి జగన్నాథ్ లాంటి పెద్ద దర్శకుడే ‘ఆటోజానీ’ కథతో చిరును ఇంప్రెస్ చేయలేక మధ్యలో కాడి వదిలేశాడు. ఇక యువ దర్శకుడు వెంకీకి ఇలాగే ముందు ఓకే చెప్పడం.. పూర్తి స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందక ఆ సినిమాను పక్కన పెట్టేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడిగా మారుతున్న తన ఆస్థాన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ సహకారం కూడా లేకుండా త్రినాథరావు చిరును పూర్తి స్క్రిప్టుతో మెప్పించి సినిమాను ముందుకు తీసుకెళ్లగలడా అన్నది ప్రశ్న.
This post was last modified on January 31, 2023 4:19 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…