క్లాస్ సినిమాలతో ఎన్నేళ్ళు ముందుకు సాగుతాం ? మాస్ సినిమాలే మనకి ఫ్యాన్ బేస్ పెంచుతాయని భావిస్తున్నట్టున్నారు కుర్ర హీరోలు. అందుకే వరుసగా మాస్ కథలతో , ఊర మాస్ పాత్రలను వెతుక్కుంటూ ముందుకెళ్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాని గురించి. మొదటి సినిమా ‘అష్టాచెమ్మా’ నుండి అంటే సుందరనికీ వరకు నాని క్లాస్ కథలు , స్టైలిష్ పాత్రలతోనే మెప్పించాడు. ఇప్పుడు ఉన్నపళంగా కొత్త దారి వెతుక్కున్నాడు. దసరా తో తనలో ఉన్న మాస్ ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. నాని మాస్ హీరోగా క్లిక్ అయితే ఇకపై కూడా దసరా లాంటి రా సినిమాల కౌంట్ పెంచే అవకాశం ఉంది.
ఇస్మార్ట్ శంకర్ తో ఇప్పటికే మాస్ బ్లాక్ బస్టర్ టేస్ట్ చేసి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రామ్ ఇక నుండి మాస్ సినిమాలే చేయాలని భావిస్తూ అదే రూట్లో వెళ్తున్నాడు. రెడ్ , వారియర్ రెండూ మాస్ సినిమాలే. కానీ వర్కవుట్ అవ్వలేదు. అందుకే మాస్ కి పెట్టింది పేరు అయిన బోయపాటి శ్రీను తో ఇప్పుడు మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు. ఇందులో సరికొత్త రామ్ కనిపిస్తాడని, మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ ఇస్తాడని అంటున్నారు.
నితిన్ కూడా మాస్ దారిలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ‘మాచర్ల నియోజవర్గం’ సినిమాతో మాస్ కంటెంట్ ప్లాన్ చేసుకున్న నితిన్ ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ మాస్ కథను ఎంచుకున్నాడు. ఈ సినిమాలో మాస్ లుక్ లో లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ఈసారి మాస్ ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ప్లాన్ చేసుకున్నాడు. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ కూడా మాస్ అవతారమెత్తనున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే దర్శకుడితో మాస్ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్. ఇలా కుర్ర హీరోలంతా మాస్ కథలు , మాస్ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఆ కంటెంట్ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
This post was last modified on January 31, 2023 3:55 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…