Movie News

పాపం గాంధీ గాడ్సేని పట్టించుకోలేదు

దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీకి పోటీకి వెళ్ళేటప్పుడు ప్రాక్టికల్ గా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతే తప్ప ఏదో సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకునో దేశభక్తిని క్యాష్ చేసుకుందామనో రిస్క్ చేస్తే దెబ్బ పడుతుంది. మొన్న శుక్రవారం రిలీజైన సినిమాలు ఏవంటే ఠక్కున గుర్తొచ్చే ఒకే ఒక పేరు పఠాన్. తెలుగులో సుధీర్ బాబు హంట్ లాంటివి వచ్చినా మన ఆడియన్స్ సైతం షారుఖ్ ఖాన్ ని చూసేందుకే ఇష్టపడటంతో తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లు దక్కుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో పఠాన్ ఆల్ టైం హిందీ నెంబర్ వన్ దిశగా పరుగులు పెడుతోంది.

అదే రోజు గాంధీ గాడ్సే ఏక్ యుధ్ కూడా రిలీజయ్యింది. పట్టించుకున్న నాథుడు లేకుండా పోయాడు. పోనీ తీసింది ఆషామాషీ దర్శకుడా అంటే కాదు. రెగ్యులర్ బాలీవుడ్ ఫాలోయర్స్ కి రాజ్ కుమార్ సంతోషి పేరుని కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఘాయల్, దామిని, అందాజ్ అప్నా అప్నా, బర్సాత్, ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్, ఖాకీ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన 90ల నాటి డైరెక్టర్. ఈయన ఆఖరి హిట్ 2009లో వచ్చిన అజబ్ ప్రేమ్ కి ఖజబ్ కహాని. 2013 ఫటా పోస్టర్ నిక్లా హీరో పెద్దగా ఆడలేదు. కట్ చేస్తే పదేళ్ల గ్యాప్ తీసుకుని ప్రత్యేకమైన రీసెర్చ్ చేసి మరీ గాంధీ గాడ్సే తో పలికరించారు.

గాంధీని హత్య చేసిన గాడ్సేతో పాటు ఇద్దరి మనస్తత్వాలను విభిన్న కోణంలో పరిచయం చేస్తూ అప్పటి సామజిక రాజకీయ వాతావరణాన్ని కొత్తగా చూపించే ప్రయత్నంలో రాజ్ కుమార్ సంతోష్ ఓ మోస్తరుగా ఓకే అనిపించారు కానీ పఠాన్ చూసే మూడ్ లో ఉన్న ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేయడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో కంటెంట్ ఓ మోస్తరుగా ఉన్నా గాంధీ గాడ్సే జనానికి చేరలేదు. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అవ్వడంతో పాటు కొన్ని సెంటర్లలో దీన్ని తీసేసి పఠాన్ కి ఇచ్చారు. అయినా బాద్షా మేనియా ముందు ఎవరైనా ఆగడం కష్టమే. పైగా ఎవరికీ ఆసక్తి లేని కాన్సెప్ట్ తో.

This post was last modified on January 30, 2023 4:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago