నాలుగేళ్ల గ్యాప్ తో వచ్చిన షారుఖ్ ఖాన్ మహా అయితే ఓ హిట్టు కొడతాడేమో అనుకుంటే ఏకంగా బాక్సాఫీస్ దద్దరిల్లిపోయేలా ఇండస్ట్రీ రికార్డులు జేబులో వేసుకోవడంతో నార్త్ డిస్ట్రిబ్యూటర్ల ఆనందం మాములుగా లేదు. నాలుగు రోజులుగా హౌస్ ఫుల్స్ తో థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. నెంబర్ల గురించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ పది ఇరవై ఎక్స్ ట్రా కలపడం అందరూ చేసేదే కాబట్టి అదేమంత సీరియస్ ఇష్యూ కాదు. రోజుకు కనీసం వంద కోట్లు తీసుకోనిదే పఠాన్ షోలు పూర్తవ్వడం లేదు. ముంబై, జైపూర్, పూణే లాంటి నగరాల్లో జనసందోహాన్ని తట్టుకోలేక అదనపు షోలు ఎన్ని వేస్తున్నా తక్కువ పడుతున్నాయి.
ఇదంతా నెక్స్ట్ కింగ్ ఖాన్ చేస్తున్న జవాన్ కు అనూహ్య వరంగా మారింది. ఇంకా షూటింగ్ పూర్తవ్వకుండానే హక్కుల కోసం పంపిణీదారులు, శాటిలైట్ ఛానళ్లు భారీ ధరలను కోట్ చేస్తున్నాయి. ఓటిటి ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఒత్తిడేమీ లేదు కానీ ఓవర్సీస్ రైట్స్ కోసం వస్తున్న డిమాండ్ చూసి స్వయానా జవాన్ కు నిర్మాతైన షారుఖ్ కు నోట మాట రావడం లేదట. ముందు వేసుకున్న లాభాల లెక్కలకు ఇప్పుడు వస్తున్న ఆఫర్లను పోల్చి చూసుకుంటే కనీసం ముప్పై నుంచి యాభై శాతం దాకా అదనంగా రాబడి పెరగనున్నట్టు ముంబై మీడియా టాక్.
తమిళ దర్శకుడు ఆట్లీ తీస్తున్న జవాన్ లో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నయనతార మొదటిసారి జట్టు కడుతోంది. విజయ్ సేతుపతి విలన్ గా ఆల్రెడీ జాయినయ్యాడు. విజయ్ చిన్న క్యామియో చేయడం దాని షూట్ పూర్తవ్వడం కూడా జరిగిపోయింది. అనిరుద్ రవిచందర్ ట్యూన్స్ ఓ రేంజ్ లో వస్తన్నాయట. ఇన్ని స్పెషల్స్ ఉన్నప్పుడు బయ్యర్లు ఎగబడటంలో ఆశ్చర్యం ఏముంది. జవాన్ కూడా పఠాన్ లాగే మల్టీ లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేస్తున్నారు. జూన్ 2 విడుదల తేదీని ఆల్రెడీ అఫీషియల్ గా చెప్పేశారు కాబట్టి కేవలం ఆరు నెలల గ్యాప్ లోనే బాద్షా డబుల్ ధమాకాని ఎంజాయ్ చేయొచ్చు.
This post was last modified on January 30, 2023 6:24 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…