Movie News

సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు-షారుఖ్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు మామూలు ఆనందంలో లేడు. నాలుగేళ్లకు పైగా గ్యాప్ తర్వాత రిలీజైన ఆయన కొత్త సినిమా ‘పఠాన్’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే మూడొందల కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం రేపిందా సినిమా. శని, ఆదివారాల్లో కూడా భారీ వసూళ్లు గ్యారెంటీ అని స్పష్టమవుతోంది.

వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల క్లబ్బులో కూడా అడుగు పెట్టేయడం పక్కా. ఇంతటి సంచలనం రేపుతున్న సినిమాను షారుఖ్ అసలు ఆఫ్ లైన్లో అసలు ప్రమోట్ చేయలేదు. ఆన్ లైన్లో కూడా అభిమానులతో ఒకసారి చిట్ చాట్ చేశాడే తప్ప.. పెద్దగా చేసిందేమీ లేదు. ఎప్పట్లా సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లాంటివి అస్సలు చేయలేదు షారుఖ్.

రిలీజ్ ముందు చేసినట్లే.. రిలీజ్ తర్వాత షారుఖ్ మరోసారి ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేసిన సందర్భంగా ఒక అభిమాని ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మీరెందుకు సినిమాను ప్రమోట్ చేయలేదు.. బయటికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు. దీనికి షారుఖ్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘‘సింహాలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవు కాబట్టి నేను కూడా ఈసారి ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా’’ షారుఖ్ చమత్కరించాడు. నిజానికి ఈసారి తన సినిమాను షారుఖ్ ప్రమోట్ చేయకపోవడానికి కారణం ఉంది.

‘పఠాన్’ చుట్టూ ముసురుకున్న వివాదాల సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్లు ఈ మధ్య ఏం మాట్లాడినా.. దాని చుట్టూ కాంట్రవర్శీలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ‘పఠాన్’ చుట్టూ ఉన్న వివాదాలకు తోడు.. తాను ఇంటర్వ్యూల్లో ఏదైనా మాట్లాడితే ఇంకా గొడవ చేసి సినిమాను దెబ్బ తీస్తారేమో అని షారుఖ్ సైలెంటైపోయాడు. సినిమాకు ఆల్రెడీ కావాల్సినంత హైప్ ఉండడంతో ప్రమోషన్లు అవసరం లేదని ఊరుకున్నాడు. ఈ వ్యూహం బాగానే పని చేసింది.

This post was last modified on January 29, 2023 4:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

46 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago