సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ, అప్పుడప్పుడూ తన టెంపర్ చూపించే టాలీవుడ్ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. స్వయంగా పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన హరీష్.. తన అభిమాన హీరోతో చేయబోయే రెండో సినిమాకు సంబంధించి ఇంతకుముందు ఫ్యాన్స్కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుండేవాడు.
కానీ ఈ మధ్య అలా చేయడం లేదు. కొన్నాళ్ల నుంచి పవన్ అభిమానులను పెద్ద ఎత్తున ఆయన ట్విట్టర్లో బ్లాక్ చేస్తూ వస్తున్నారు కూడా. ఇదంతా ఫ్యాన్స్ చేసిన అతి వల్లే అంటున్నాడు హరీష్. తాను కూడా పవన్ అభిమానుల్లో ఒకడిని కావడం వల్ల.. తన ఎగ్జైట్మెంట్ను ఇంతకుముందు ఫ్యాన్స్తో పంచుకునేవాడినని.. పవన్ను కలిసినా, ఒక మంచి డైలాగ్ రాసినా, ఇంకేదైనా అప్డేట్ ఉన్నా.. వారితో షేర్ చేసుకునేవాడినని హరీష్ చెప్పాడు. కానీ ఈ మధ్య ఫ్యాన్స్ చేసిన అతి వల్ల తాను హర్టయినట్లుగా హరీష్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హరీష్ వ్యాఖ్యానించాడు.
పవన్తో హరీష్ చేయబోతున్న ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’ ప్రారంభోత్సవానికి ముందు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నెగెటివ్ ట్రెండ్ చేశారు. ఇది తమిళ హిట్ ‘తెరి’కి రీమేక్ అన్న అంచనాతో ఈ సినిమా వద్దే వద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద గొడవే చేశారు. ఇది హరీష్ను హర్ట్ చేసినట్లుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేకా కాదా.. రీమేకే అయితే దాన్ని ఎలా చేశాం.. అన్నది తాను ఇప్పుడు మాట్లాడనని.. తెరపైనే చూడాలని హరీష్ వ్యాఖ్యానించాడు. ఐతే తాను మిగతా దర్శకుల్లా కాకుండా చాలా ఓపెన్గా ఉంటానని, ఇంతకుముందు అభిమానులతో ప్రతి విషయాన్నీ తాను పంచుకునేవాడినని.. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో వాళ్లు చేసిన అతి చూసి ఇకపై వాళ్లకు ఏమీ చెప్పకూడదని ఫిక్సయినట్లు వ్యాఖ్యానించాడు.
ఈ సందర్భంగా నెగెటివ్ ట్రెండ్ చేసిన వాళ్లను ‘సోషల్ మీడియా మేధావులు’ అని వ్యంగ్యంగా అన్నాడు హరీష్. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటో చెబుతూ.. పవన్ డేట్లు ఇస్తే వేగంగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నామని.. కచ్చితంగా ఈ ఏడాదే షూటింగ్ ఆరంభమవుతుందని.. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్రణాళికతో ఉన్నామని హరీష్ వెల్లడించాడు.
This post was last modified on January 30, 2023 6:30 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…