Movie News

ఫ్యాన్స్ అతి చేశారు.. అందుకే చెప్పట్లా-హరీష్

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, అప్పుడప్పుడూ తన టెంపర్ చూపించే టాలీవుడ్ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. స్వయంగా పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన హరీష్.. తన అభిమాన హీరోతో చేయబోయే రెండో సినిమాకు సంబంధించి ఇంతకుముందు ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తుండేవాడు.

కానీ ఈ మధ్య అలా చేయడం లేదు. కొన్నాళ్ల నుంచి పవన్ అభిమానులను పెద్ద ఎత్తున ఆయన ట్విట్టర్లో బ్లాక్ చేస్తూ వస్తున్నారు కూడా. ఇదంతా ఫ్యాన్స్ చేసిన అతి వల్లే అంటున్నాడు హరీష్. తాను కూడా పవన్ అభిమానుల్లో ఒకడిని కావడం వల్ల.. తన ఎగ్జైట్మెంట్‌ను ఇంతకుముందు ఫ్యాన్స్‌తో పంచుకునేవాడినని.. పవన్‌ను కలిసినా, ఒక మంచి డైలాగ్ రాసినా, ఇంకేదైనా అప్‌డేట్ ఉన్నా.. వారితో షేర్ చేసుకునేవాడినని హరీష్ చెప్పాడు. కానీ ఈ మధ్య ఫ్యాన్స్ చేసిన అతి వల్ల తాను హర్టయినట్లుగా హరీష్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హరీష్ వ్యాఖ్యానించాడు.

పవన్‌తో హరీష్ చేయబోతున్న ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’ ప్రారంభోత్సవానికి ముందు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నెగెటివ్ ట్రెండ్ చేశారు. ఇది తమిళ హిట్ ‘తెరి’కి రీమేక్ అన్న అంచనాతో ఈ సినిమా వద్దే వద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద గొడవే చేశారు. ఇది హరీష్‌ను హర్ట్ చేసినట్లుంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేకా కాదా.. రీమేకే అయితే దాన్ని ఎలా చేశాం.. అన్నది తాను ఇప్పుడు మాట్లాడనని.. తెరపైనే చూడాలని హరీష్ వ్యాఖ్యానించాడు. ఐతే తాను మిగతా దర్శకుల్లా కాకుండా చాలా ఓపెన్‌గా ఉంటానని, ఇంతకుముందు అభిమానులతో ప్రతి విషయాన్నీ తాను పంచుకునేవాడినని.. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో వాళ్లు చేసిన అతి చూసి ఇకపై వాళ్లకు ఏమీ చెప్పకూడదని ఫిక్సయినట్లు వ్యాఖ్యానించాడు.

ఈ సందర్భంగా నెగెటివ్ ట్రెండ్ చేసిన వాళ్లను ‘సోషల్ మీడియా మేధావులు’ అని వ్యంగ్యంగా అన్నాడు హరీష్. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటో చెబుతూ.. పవన్ డేట్లు ఇస్తే వేగంగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నామని.. కచ్చితంగా ఈ ఏడాదే షూటింగ్ ఆరంభమవుతుందని.. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్రణాళికతో ఉన్నామని హరీష్ వెల్లడించాడు.

Satya

Recent Posts

గీతాంజలి… ఇలాంటివి కదా చూడాలి

గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…

47 minutes ago

పవన్ మాటంటే మాటే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…

3 hours ago

దృశ్యం 3 తెలుగు అభిమానులకు షాక్

రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…

3 hours ago

ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…

4 hours ago

కన్నప్ప పునఃదర్శనం ఇంత త్వరగానా

మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…

4 hours ago

సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…

5 hours ago