సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ, అప్పుడప్పుడూ తన టెంపర్ చూపించే టాలీవుడ్ దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. స్వయంగా పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన హరీష్.. తన అభిమాన హీరోతో చేయబోయే రెండో సినిమాకు సంబంధించి ఇంతకుముందు ఫ్యాన్స్కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుండేవాడు.
కానీ ఈ మధ్య అలా చేయడం లేదు. కొన్నాళ్ల నుంచి పవన్ అభిమానులను పెద్ద ఎత్తున ఆయన ట్విట్టర్లో బ్లాక్ చేస్తూ వస్తున్నారు కూడా. ఇదంతా ఫ్యాన్స్ చేసిన అతి వల్లే అంటున్నాడు హరీష్. తాను కూడా పవన్ అభిమానుల్లో ఒకడిని కావడం వల్ల.. తన ఎగ్జైట్మెంట్ను ఇంతకుముందు ఫ్యాన్స్తో పంచుకునేవాడినని.. పవన్ను కలిసినా, ఒక మంచి డైలాగ్ రాసినా, ఇంకేదైనా అప్డేట్ ఉన్నా.. వారితో షేర్ చేసుకునేవాడినని హరీష్ చెప్పాడు. కానీ ఈ మధ్య ఫ్యాన్స్ చేసిన అతి వల్ల తాను హర్టయినట్లుగా హరీష్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో హరీష్ వ్యాఖ్యానించాడు.
పవన్తో హరీష్ చేయబోతున్న ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’ ప్రారంభోత్సవానికి ముందు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నెగెటివ్ ట్రెండ్ చేశారు. ఇది తమిళ హిట్ ‘తెరి’కి రీమేక్ అన్న అంచనాతో ఈ సినిమా వద్దే వద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద గొడవే చేశారు. ఇది హరీష్ను హర్ట్ చేసినట్లుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేకా కాదా.. రీమేకే అయితే దాన్ని ఎలా చేశాం.. అన్నది తాను ఇప్పుడు మాట్లాడనని.. తెరపైనే చూడాలని హరీష్ వ్యాఖ్యానించాడు. ఐతే తాను మిగతా దర్శకుల్లా కాకుండా చాలా ఓపెన్గా ఉంటానని, ఇంతకుముందు అభిమానులతో ప్రతి విషయాన్నీ తాను పంచుకునేవాడినని.. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో వాళ్లు చేసిన అతి చూసి ఇకపై వాళ్లకు ఏమీ చెప్పకూడదని ఫిక్సయినట్లు వ్యాఖ్యానించాడు.
ఈ సందర్భంగా నెగెటివ్ ట్రెండ్ చేసిన వాళ్లను ‘సోషల్ మీడియా మేధావులు’ అని వ్యంగ్యంగా అన్నాడు హరీష్. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటో చెబుతూ.. పవన్ డేట్లు ఇస్తే వేగంగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నామని.. కచ్చితంగా ఈ ఏడాదే షూటింగ్ ఆరంభమవుతుందని.. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్రణాళికతో ఉన్నామని హరీష్ వెల్లడించాడు.
This post was last modified on January 30, 2023 6:30 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…