గత ఏడాది కాలంలో బాలీవుడ్ భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా బోల్తా కొడుతూ వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్ల సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదురైంది. దీంతో బాలీవుడ్ పనైపోయిందని.. ఇక రికవరీ కష్టమని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు.
షారుఖ్ ఖాన్ రీఎంట్రీ మూవీ పఠాన్ పరిస్థితి కూడా ఇంతకంటే భిన్నంగా ఉండదన్న అంచనాలు కూడా కలిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆ స్థాయిలో క్యాంపైనింగ్ నడిచింది. కానీ లాల్ సింగ్ చడ్డాకు జరిగినట్లు పఠాన్కు ఈ నెగెటివ్ ప్రచారం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. దీని ట్రైలర్ షారుఖ్ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులకు నచ్చింది. వేరే కారణాల వల్ల కూడా సినిమాకు మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తేనే సినిమా వసూళ్ల మోత మోగించబోతుందని అర్థమైంది.
ఆ అంచనాలకు తగ్గట్లే రిలీజ్ రోజు నుంచి పఠాన్ వసూళ్ల సునామీ అంటే ఏంటో చూపిస్తోంది. తొలి రోజు వరల్డ్ వైడ్ పఠాన్ గ్రాస్ వంద కోట్లు దాటిపోగా.. తర్వాతి రెండు రోజుల్లో కూడా సినిమా ఏమాత్రం తగ్గలేదు. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసిందీ సినిమా.
ఇండియా వరకే పఠాన్ రూ.200 కోట్ల దాకా వసూలు చేయగా.. ఓవర్సీస్ వసూళ్లు రూ.110 కోట్లను దాటిపోయాయి. శుక్రవారానికే సినిమా ఇంత దూకుడు చూపించగా.. ఇక శని, ఆదివారాల్లో పఠాన్కు ఎదురే ఉండకపోవచ్చు. రెండు రోజుల్లో తలో వంద కోట్ల వసూళ్లు పక్కా అన్నట్లే ఉంది పరిస్థితి.
అంటే ఐదు రోజుల్లో షారుఖ్ సినిమా రూ.500 కోట్ల మార్కును టచ్ చేయబోతోందన్నమాట. పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు ఫుల్ రన్లో వంద కోట్లు వసూలు చేయడం గగనం అయిన పరిస్థితుల్లో దశాబ్దానికి పైగా హిట్టు లేని, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేసిన షారుఖ్ ఇలాంటి విధ్వంసం సాగించడం అనూహ్యం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…