గత ఏడాది కాలంలో బాలీవుడ్ భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా బోల్తా కొడుతూ వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి టాప్ స్టార్ల సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదురైంది. దీంతో బాలీవుడ్ పనైపోయిందని.. ఇక రికవరీ కష్టమని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు.
షారుఖ్ ఖాన్ రీఎంట్రీ మూవీ పఠాన్ పరిస్థితి కూడా ఇంతకంటే భిన్నంగా ఉండదన్న అంచనాలు కూడా కలిగాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆ స్థాయిలో క్యాంపైనింగ్ నడిచింది. కానీ లాల్ సింగ్ చడ్డాకు జరిగినట్లు పఠాన్కు ఈ నెగెటివ్ ప్రచారం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. దీని ట్రైలర్ షారుఖ్ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులకు నచ్చింది. వేరే కారణాల వల్ల కూడా సినిమాకు మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తేనే సినిమా వసూళ్ల మోత మోగించబోతుందని అర్థమైంది.
ఆ అంచనాలకు తగ్గట్లే రిలీజ్ రోజు నుంచి పఠాన్ వసూళ్ల సునామీ అంటే ఏంటో చూపిస్తోంది. తొలి రోజు వరల్డ్ వైడ్ పఠాన్ గ్రాస్ వంద కోట్లు దాటిపోగా.. తర్వాతి రెండు రోజుల్లో కూడా సినిమా ఏమాత్రం తగ్గలేదు. మూడు రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టేసిందీ సినిమా.
ఇండియా వరకే పఠాన్ రూ.200 కోట్ల దాకా వసూలు చేయగా.. ఓవర్సీస్ వసూళ్లు రూ.110 కోట్లను దాటిపోయాయి. శుక్రవారానికే సినిమా ఇంత దూకుడు చూపించగా.. ఇక శని, ఆదివారాల్లో పఠాన్కు ఎదురే ఉండకపోవచ్చు. రెండు రోజుల్లో తలో వంద కోట్ల వసూళ్లు పక్కా అన్నట్లే ఉంది పరిస్థితి.
అంటే ఐదు రోజుల్లో షారుఖ్ సినిమా రూ.500 కోట్ల మార్కును టచ్ చేయబోతోందన్నమాట. పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు ఫుల్ రన్లో వంద కోట్లు వసూలు చేయడం గగనం అయిన పరిస్థితుల్లో దశాబ్దానికి పైగా హిట్టు లేని, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేసిన షారుఖ్ ఇలాంటి విధ్వంసం సాగించడం అనూహ్యం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…