అబ్బే రొటీన్ మాస్ సినిమాలను ఇకపై ప్రేక్షకులు చూడారు. ఇక నుండి విజువల్ వందర్స్ కే ప్రేక్షకులు పట్టం కడతారు. ఇవన్నీ కోవిడ్ తర్వాత వింటూనే ఉన్నాం. మొన్నటి వరకు కూడా ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మాస్ కంటెంట్ ను ప్రాపర్ మీటర్ లో సెట్ చేసి కమర్షియల్ సినిమా తీస్తే ఎలాంటి ఢోకా ఉండదని తాజాగా వచ్చిన చాలా సినిమాలు నిరూపించాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ క్రాక్ , ధమాకా,అఖండ,వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య.
అవును ‘అఖండ’ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ రొటీన్ కథలతో వచ్చిన మాస్ సినిమాలే. ‘అఖండ’ కోసం బోయపాటి కూడా మాస్ కంటెంట్ తీసుకున్నప్పటికీ డెవోషనల్ టచ్ ఇవ్వడంతో భారీ వసూళ్లు అందుకుంది. ఇక క్రాక్ , ధమాకా , వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలన్నీ పరమ రొటీన్ కథలతో వచ్చిన మాస్ బొమ్మలే.
కానీ కమర్షియల్ మీటర్ సెట్ చేసుకొని దర్శకులు ఈ సినిమాలతో బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. ఏ మాటకామాటే ఇప్పుడున్న పరిస్థితిల్లో రొటీన్ కథలతో మాస్ ఆడియన్స్ ను మెప్పించడం గొప్ప విషయమే. మొబైల్ చేతిలో కొచ్చేశాక సగటు మాస్ ప్రేక్షకుడు చాలా కంటెంట్ చూస్తున్నాడు. కానీ పర్ఫెక్ట్ మీటర్ లో ఫ్యాన్స్ ను మాస్ ను మెప్పించగలిగితే మాస్ కంటెంట్ సినిమాలకు ఎప్పుడూ ఢోకా ఉండదని ఈ సినిమాలన్నీ కోట్ల వసూళ్లతో నిరూపించాయి.
ఈ మాస్ సినిమాలు ముఖ్యంగా ధమాకా , వీర సింహా రెడ్డి వాల్తేరు వీరయ్య ఇచ్చిన కోట్ల భరోసాతో చాలా మండి మేకర్స్ కమర్షియల్ మాస్ సినిమాల వైపే అడుగులేస్తున్నారు. కానీ మీటర్ సరిగ్గా కుదరకపోతే మాత్రం మేజిక్ రిపీట్ అవ్వదు అది గమనించుకుంటే మంచిది.
This post was last modified on January 28, 2023 11:06 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…