Movie News

మాస్ కథలా … మజాకా !

అబ్బే రొటీన్ మాస్ సినిమాలను ఇకపై ప్రేక్షకులు చూడారు. ఇక నుండి విజువల్ వందర్స్ కే ప్రేక్షకులు పట్టం కడతారు. ఇవన్నీ కోవిడ్ తర్వాత వింటూనే ఉన్నాం. మొన్నటి వరకు కూడా ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మాస్ కంటెంట్ ను ప్రాపర్ మీటర్ లో సెట్ చేసి కమర్షియల్ సినిమా తీస్తే ఎలాంటి ఢోకా ఉండదని తాజాగా వచ్చిన చాలా సినిమాలు నిరూపించాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ క్రాక్ , ధమాకా,అఖండ,వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య.

అవును ‘అఖండ’ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ రొటీన్ కథలతో వచ్చిన మాస్ సినిమాలే. ‘అఖండ’ కోసం బోయపాటి కూడా మాస్ కంటెంట్ తీసుకున్నప్పటికీ డెవోషనల్ టచ్ ఇవ్వడంతో భారీ వసూళ్లు అందుకుంది. ఇక క్రాక్ , ధమాకా , వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలన్నీ పరమ రొటీన్ కథలతో వచ్చిన మాస్ బొమ్మలే.

కానీ కమర్షియల్ మీటర్ సెట్ చేసుకొని దర్శకులు ఈ సినిమాలతో బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. ఏ మాటకామాటే ఇప్పుడున్న పరిస్థితిల్లో రొటీన్ కథలతో మాస్ ఆడియన్స్ ను మెప్పించడం గొప్ప విషయమే. మొబైల్ చేతిలో కొచ్చేశాక సగటు మాస్ ప్రేక్షకుడు చాలా కంటెంట్ చూస్తున్నాడు. కానీ పర్ఫెక్ట్ మీటర్ లో ఫ్యాన్స్ ను మాస్ ను మెప్పించగలిగితే మాస్ కంటెంట్ సినిమాలకు ఎప్పుడూ ఢోకా ఉండదని ఈ సినిమాలన్నీ కోట్ల వసూళ్లతో నిరూపించాయి.

ఈ మాస్ సినిమాలు ముఖ్యంగా ధమాకా , వీర సింహా రెడ్డి వాల్తేరు వీరయ్య ఇచ్చిన కోట్ల భరోసాతో చాలా మండి మేకర్స్ కమర్షియల్ మాస్ సినిమాల వైపే అడుగులేస్తున్నారు. కానీ మీటర్ సరిగ్గా కుదరకపోతే మాత్రం మేజిక్ రిపీట్ అవ్వదు అది గమనించుకుంటే మంచిది.

This post was last modified on January 28, 2023 11:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా…

28 minutes ago

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

40 minutes ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

1 hour ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

2 hours ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

2 hours ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

5 hours ago