అబ్బే రొటీన్ మాస్ సినిమాలను ఇకపై ప్రేక్షకులు చూడారు. ఇక నుండి విజువల్ వందర్స్ కే ప్రేక్షకులు పట్టం కడతారు. ఇవన్నీ కోవిడ్ తర్వాత వింటూనే ఉన్నాం. మొన్నటి వరకు కూడా ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మాస్ కంటెంట్ ను ప్రాపర్ మీటర్ లో సెట్ చేసి కమర్షియల్ సినిమా తీస్తే ఎలాంటి ఢోకా ఉండదని తాజాగా వచ్చిన చాలా సినిమాలు నిరూపించాయి. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ క్రాక్ , ధమాకా,అఖండ,వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య.
అవును ‘అఖండ’ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ రొటీన్ కథలతో వచ్చిన మాస్ సినిమాలే. ‘అఖండ’ కోసం బోయపాటి కూడా మాస్ కంటెంట్ తీసుకున్నప్పటికీ డెవోషనల్ టచ్ ఇవ్వడంతో భారీ వసూళ్లు అందుకుంది. ఇక క్రాక్ , ధమాకా , వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలన్నీ పరమ రొటీన్ కథలతో వచ్చిన మాస్ బొమ్మలే.
కానీ కమర్షియల్ మీటర్ సెట్ చేసుకొని దర్శకులు ఈ సినిమాలతో బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. ఏ మాటకామాటే ఇప్పుడున్న పరిస్థితిల్లో రొటీన్ కథలతో మాస్ ఆడియన్స్ ను మెప్పించడం గొప్ప విషయమే. మొబైల్ చేతిలో కొచ్చేశాక సగటు మాస్ ప్రేక్షకుడు చాలా కంటెంట్ చూస్తున్నాడు. కానీ పర్ఫెక్ట్ మీటర్ లో ఫ్యాన్స్ ను మాస్ ను మెప్పించగలిగితే మాస్ కంటెంట్ సినిమాలకు ఎప్పుడూ ఢోకా ఉండదని ఈ సినిమాలన్నీ కోట్ల వసూళ్లతో నిరూపించాయి.
ఈ మాస్ సినిమాలు ముఖ్యంగా ధమాకా , వీర సింహా రెడ్డి వాల్తేరు వీరయ్య ఇచ్చిన కోట్ల భరోసాతో చాలా మండి మేకర్స్ కమర్షియల్ మాస్ సినిమాల వైపే అడుగులేస్తున్నారు. కానీ మీటర్ సరిగ్గా కుదరకపోతే మాత్రం మేజిక్ రిపీట్ అవ్వదు అది గమనించుకుంటే మంచిది.
This post was last modified on January 28, 2023 11:06 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…