ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ NTR30 షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి చాలా నెలలవుతుంది కానీ ఇంత వరకు షూటింగ్ మొదలు కాలేదు. ‘ఆచార్య’ రిజల్ట్ తర్వాత కొరటాల లెక్కలు మారాయి. ఆ డిజాస్టర్ ను మర్చిపోయేలా ఓ అదిరిపోయే కంటెంట్ ఇవ్వాలనే ప్లానింగ్ లో ఉన్నాడు కొరటాల. అందుకే స్క్రిప్ట్ రిపేర్ల కోసమే చాలా టైమ్ తీసుకున్నాడు. ఇక తారక్ , కళ్యాణ్ రామ్ కూడా ఎప్పటికప్పుడు వారికి అనిపించిన సజీషన్స్ ఇస్తూనే ఉన్నారు. తప్పదు కొరటాల ఇప్పుడు ఎవరు సలహా ఇచ్చిన తీసుకోవాల్సిందే.
ముఖ్యంగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. RRR తర్వాత చేయబోతున్న పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ కొరటాలకు ఎప్పటికప్పుడు తనకి తోచిన మార్పులు చెప్తూనే ఉన్నాడట. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలు కానుందని వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది మేకర్స్ ప్రకటించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇంకా స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయట. ఎన్టిఆర్ కూడా లేటయినా పర్లేదు కానీ సాలిడ్ కంటెంట్ తోనే వెళ్దాం అంటూ టీంతో చెప్తూనే ఉన్నాడని అంటున్నారు. ఇక ఫిబ్రవరి మిస్ అయితే ఈ సినిమా షూటింగ్ మార్చ్ లేదా ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి మేకర్స్ ఘాట్ పై క్లారిటీ ఇస్తూ అప్ డేట్ వదిలేది ఎప్పుడో ? అంటూ తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This post was last modified on January 28, 2023 11:01 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…