ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ NTR30 షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి చాలా నెలలవుతుంది కానీ ఇంత వరకు షూటింగ్ మొదలు కాలేదు. ‘ఆచార్య’ రిజల్ట్ తర్వాత కొరటాల లెక్కలు మారాయి. ఆ డిజాస్టర్ ను మర్చిపోయేలా ఓ అదిరిపోయే కంటెంట్ ఇవ్వాలనే ప్లానింగ్ లో ఉన్నాడు కొరటాల. అందుకే స్క్రిప్ట్ రిపేర్ల కోసమే చాలా టైమ్ తీసుకున్నాడు. ఇక తారక్ , కళ్యాణ్ రామ్ కూడా ఎప్పటికప్పుడు వారికి అనిపించిన సజీషన్స్ ఇస్తూనే ఉన్నారు. తప్పదు కొరటాల ఇప్పుడు ఎవరు సలహా ఇచ్చిన తీసుకోవాల్సిందే.
ముఖ్యంగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. RRR తర్వాత చేయబోతున్న పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ కొరటాలకు ఎప్పటికప్పుడు తనకి తోచిన మార్పులు చెప్తూనే ఉన్నాడట. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలు కానుందని వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది మేకర్స్ ప్రకటించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇంకా స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయట. ఎన్టిఆర్ కూడా లేటయినా పర్లేదు కానీ సాలిడ్ కంటెంట్ తోనే వెళ్దాం అంటూ టీంతో చెప్తూనే ఉన్నాడని అంటున్నారు. ఇక ఫిబ్రవరి మిస్ అయితే ఈ సినిమా షూటింగ్ మార్చ్ లేదా ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి మేకర్స్ ఘాట్ పై క్లారిటీ ఇస్తూ అప్ డేట్ వదిలేది ఎప్పుడో ? అంటూ తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This post was last modified on January 28, 2023 11:01 pm
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…
ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…