ఎన్టీఆర్, కొరటాల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ NTR30 షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి చాలా నెలలవుతుంది కానీ ఇంత వరకు షూటింగ్ మొదలు కాలేదు. ‘ఆచార్య’ రిజల్ట్ తర్వాత కొరటాల లెక్కలు మారాయి. ఆ డిజాస్టర్ ను మర్చిపోయేలా ఓ అదిరిపోయే కంటెంట్ ఇవ్వాలనే ప్లానింగ్ లో ఉన్నాడు కొరటాల. అందుకే స్క్రిప్ట్ రిపేర్ల కోసమే చాలా టైమ్ తీసుకున్నాడు. ఇక తారక్ , కళ్యాణ్ రామ్ కూడా ఎప్పటికప్పుడు వారికి అనిపించిన సజీషన్స్ ఇస్తూనే ఉన్నారు. తప్పదు కొరటాల ఇప్పుడు ఎవరు సలహా ఇచ్చిన తీసుకోవాల్సిందే.
ముఖ్యంగా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. RRR తర్వాత చేయబోతున్న పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ కొరటాలకు ఎప్పటికప్పుడు తనకి తోచిన మార్పులు చెప్తూనే ఉన్నాడట. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలు కానుందని వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది మేకర్స్ ప్రకటించారు.
కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇంకా స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయట. ఎన్టిఆర్ కూడా లేటయినా పర్లేదు కానీ సాలిడ్ కంటెంట్ తోనే వెళ్దాం అంటూ టీంతో చెప్తూనే ఉన్నాడని అంటున్నారు. ఇక ఫిబ్రవరి మిస్ అయితే ఈ సినిమా షూటింగ్ మార్చ్ లేదా ఏప్రిల్ లో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి మేకర్స్ ఘాట్ పై క్లారిటీ ఇస్తూ అప్ డేట్ వదిలేది ఎప్పుడో ? అంటూ తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…