Movie News

చేతులు మారిన శర్వా సినిమా?

‘ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్ ఓకే చేసిన ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఇప్పుడు విశ్వక్ సేన్ చేతిలో పడిందని తెలుస్తుంది. ‘చల్ మోహన్ రంగ’ దర్శకుడు కృష్ణ చైతన్య ఆ సినిమా తర్వాత నితిన్ హీరోగా ‘పవర్ పేట’ అనే సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో కృష్ణ చైతన్య శర్వానంద్ ను అప్రోచ్ అవ్వడం మరో కథతో సినిమా సెట్ అవ్వడం జరిగింది.

శర్వానంద్ తో కృష్ణ చైతన్య సినిమా ఓపెనింగ్ కూడా అయిపోయింది. రాశి ఖన్నా ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఉన్నపళంగా ఏమైందో, ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ ను కృష్ణ చైతన్య విశ్వక్ సేన్ తో చేయబోతున్నాడని తెలుస్తుంది. నిర్మాణ సంస్థ కూడా మారనుందని సమాచారం. ముందుగా లాంచ్ అయిన పీపుల్ మీడియాలో కాకుండా సితార ఎంటర్టైన్ మెంట్స్ లో ఈ సినిమా చేయబోతున్నాడట కృష్ణ చైతన్య.

తాజాగా ‘బుట్ట బొమ్మ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ తను సితార బేనర్ లో నాగ వంశీ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాని వచ్చే పది రోజుల్లో ఎనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించాడు. మరి విశ్వక్ తో నాగ వంశీ ప్లాన్ చేస్తున్న సినిమా కృష్ణ చైతన్య దే అని టాక్.

This post was last modified on January 28, 2023 10:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

37 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

5 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago