‘ఒకే ఒక జీవితం’ తర్వాత శర్వానంద్ ఓకే చేసిన ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఇప్పుడు విశ్వక్ సేన్ చేతిలో పడిందని తెలుస్తుంది. ‘చల్ మోహన్ రంగ’ దర్శకుడు కృష్ణ చైతన్య ఆ సినిమా తర్వాత నితిన్ హీరోగా ‘పవర్ పేట’ అనే సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో కృష్ణ చైతన్య శర్వానంద్ ను అప్రోచ్ అవ్వడం మరో కథతో సినిమా సెట్ అవ్వడం జరిగింది.
శర్వానంద్ తో కృష్ణ చైతన్య సినిమా ఓపెనింగ్ కూడా అయిపోయింది. రాశి ఖన్నా ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఉన్నపళంగా ఏమైందో, ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ ను కృష్ణ చైతన్య విశ్వక్ సేన్ తో చేయబోతున్నాడని తెలుస్తుంది. నిర్మాణ సంస్థ కూడా మారనుందని సమాచారం. ముందుగా లాంచ్ అయిన పీపుల్ మీడియాలో కాకుండా సితార ఎంటర్టైన్ మెంట్స్ లో ఈ సినిమా చేయబోతున్నాడట కృష్ణ చైతన్య.
తాజాగా ‘బుట్ట బొమ్మ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ తను సితార బేనర్ లో నాగ వంశీ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాని వచ్చే పది రోజుల్లో ఎనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించాడు. మరి విశ్వక్ తో నాగ వంశీ ప్లాన్ చేస్తున్న సినిమా కృష్ణ చైతన్య దే అని టాక్.
This post was last modified on January 28, 2023 10:39 pm
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…