పఠాన్ బాలీవుడ్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టరని ముంబై మీడియా చేస్తున్న హడావిడి మాములుగా లేదు. ఫస్ట్ డే కంటే రెండో రోజు ఎక్కువ వచ్చినట్టు చెబుతున్న లెక్కలు షాకింగ్ గా ఉన్నాయి. వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటిదాకా 200 కోట్ల గ్రాస్ దాటేసింది. అందులో షేర్ 125 కోట్ల పైమాటే. ఈ వీకెండ్ అయ్యేలోగా ట్రిపుల్ సెంచరీ దాటడం ఖాయమని ట్రేడ్ పండితులు బల్లలు గుద్ది మరీ చెబుతున్నారు. ఈ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే దేశం మొత్తంలో ఏ థియేటర్లోనూ ఒక్క టికెట్ కూడా మిగలకూడదు. మొత్తం హౌస్ ఫుల్సే పడుండాలి. ప్రధాన నగరాల్లోని స్క్రీన్లన్నీ కిక్కిరిసిపోవాలి.
కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరే కనిపిస్తోంది. దాని సాక్ష్యం కావాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. పేటిఎం, బుక్ మై షో యాప్స్ ఓపెన్ చేసి ముంబై, పూణే, అహ్మదాబాద్ తదితర నగరాల్లోని బుకింగ్ స్టేటస్ చూస్తే విషయం అర్థమైపోతుంది. మరీ ఖాళీగా లేవు కానీ ట్విట్టర్ కనిపించినంత రేంజ్ లో ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే లేదు. కౌంటర్ సేల్స్ ఎక్కువగా ఉండొచ్చు కానీ ప్రతి చోటా అలాగే ఉంటుందని నమ్మకంగా చెప్పలేం. ముఖ్యంగా కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ లను దాటించాలనే తాపత్రయం పఠాన్ ట్రెండ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని వచ్చినంత యునానిమస్ టాక్ దీనికి ఇండియా వైడ్ రాలేదన్నది వాస్తవం.
ఫైనల్ గా ఈ అంకెల పందెం ఎక్కడ దాకా ఆగుతుందో చెప్పలేం కానీ యాక్షన్ డోస్ విపరీతంగా దట్టించేసిన పఠాన్ లో షారుఖ్ మాస్ అవతారానికి మాత్రం ఫ్యాన్స్ బాగా ఫిదా అయిపోయారు. సుమారు పదేళ్ల తర్వాత దక్కిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. నగరాల్లో షారుఖ్ దూకుడు భీభత్సంగా ఉన్న మాట నిజమే కానీ బిసి సెంటర్లలో యాక్షన్ తప్ప ఎమోషన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ తక్కువగా ఉన్న ఈ మసాలా మూవీకి ఆదివారం తర్వాత కఠిన పరీక్షే ఎదురు కానుంది. అప్పుడు నమోదయ్యే డ్రాప్ శాతాన్ని బట్టి పఠాన్ నిజంగా ఎంతటి మొనగాడో తేలిపోతుంది.
This post was last modified on January 27, 2023 1:11 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…