కరోనా తర్వాత జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోవడం, అదే సమయంలో టికెట్ల ధరలు పెరిగిపోవడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఒక దశలో థియేటర్ల మనుగడే ప్రమాదంలో పడింది. అసలే టికెట్ల రేట్లు పెరిగిపోగా.. పెద్ద సినిమాలకు అదనంగా వడ్డించడం చేటు చేసింది.
ఒక దశలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారి ఇండస్ట్రీ జనాలు బెంబేలెత్తిపోయారు. దీంతో నెమ్మదిగా రేట్లు తగ్గించి సినిమాలు రిలీజ్ చేయడం.. తమ చిత్రాలకు ధరలు తగ్గించామని ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకోవడం చూశాం. ఇలా నిర్మాతలు దిగి వచ్చాకే సినిమాలకు మళ్లీ ఆక్యుపెన్సీ పెరిగింది. కానీ పరిస్థితి కొంచెం మెరుగుపడేసరికి మళ్లీ నిర్మాతల్లో అత్యాశ వచ్చినట్లు కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలకు ఈ అత్యాశే లాంగ్ రన్ లేకుండా చేసిందన్నది ట్రేడ్ వర్గాల మాట.
‘వాల్తేరు వీరయ్య’ రెండో వీకెండ్ వరకు చాలా బాగా ఆడింది. ‘వీరసింహారెడ్డి’ తొలి వీకెండ్ వరకు సత్తా చాటింది. తెలంగాణ వరకు ఈ రెండు చిత్రాలను మల్టీప్లెక్సుల్లో రూ.295, సింగిల్ స్క్రీన్లలో రూ.175 రేట్లతో రిలీజ్ చేశారు. ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ల రేటు దాదాపు ఇదే స్థాయిలో ఉండగా, మల్టీప్లెక్సుల్లో కొంచెం రేటు తక్కువ. ఐతే సంక్రాంతి టైంలో మంచి డిమాండ్ ఉంది కాబట్టి రెండో వీకెండ్ వరకు ఈ రేటు పెట్టడం ఓకే. కానీ రెండో సోమవారం తర్వాత కూడా అవే రేట్లు కొనసాగించడం చేటు చేసింది.
రేట్లు తగ్గితే సినిమా చూద్దామని చాలామంది ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ డిమాండ్ లేని టైంలో, వీక్ డేస్లో కూడా రేట్లు తగ్గించలేదు. దీంతో గత సోమవారం నుంచి రెండు సినిమాలూ పడుకున్నాయి. నిజానికి ఈ వారం ప్రేక్షకులకు సరైన ఆప్షన్ లేదు. ‘హంట్’కు బజ్ లేదు. ‘పఠాన్’ ఏమో డబ్బింగ్ సినిమా. సంక్రాంతి సినిమాలను సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో రూ.200తో ఆడించి ఉంటే రిపబ్లిక్ డేతో పాటు వీకెండ్ను బాగా ఉపయోగించుకునేవి. కానీ పాత రేట్లనే కొనసాగిస్తుండడంతో సరైన ఆక్యుపెన్సీ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…