కరోనా తర్వాత జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోవడం, అదే సమయంలో టికెట్ల ధరలు పెరిగిపోవడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఒక దశలో థియేటర్ల మనుగడే ప్రమాదంలో పడింది. అసలే టికెట్ల రేట్లు పెరిగిపోగా.. పెద్ద సినిమాలకు అదనంగా వడ్డించడం చేటు చేసింది.
ఒక దశలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారి ఇండస్ట్రీ జనాలు బెంబేలెత్తిపోయారు. దీంతో నెమ్మదిగా రేట్లు తగ్గించి సినిమాలు రిలీజ్ చేయడం.. తమ చిత్రాలకు ధరలు తగ్గించామని ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకోవడం చూశాం. ఇలా నిర్మాతలు దిగి వచ్చాకే సినిమాలకు మళ్లీ ఆక్యుపెన్సీ పెరిగింది. కానీ పరిస్థితి కొంచెం మెరుగుపడేసరికి మళ్లీ నిర్మాతల్లో అత్యాశ వచ్చినట్లు కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలకు ఈ అత్యాశే లాంగ్ రన్ లేకుండా చేసిందన్నది ట్రేడ్ వర్గాల మాట.
‘వాల్తేరు వీరయ్య’ రెండో వీకెండ్ వరకు చాలా బాగా ఆడింది. ‘వీరసింహారెడ్డి’ తొలి వీకెండ్ వరకు సత్తా చాటింది. తెలంగాణ వరకు ఈ రెండు చిత్రాలను మల్టీప్లెక్సుల్లో రూ.295, సింగిల్ స్క్రీన్లలో రూ.175 రేట్లతో రిలీజ్ చేశారు. ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ల రేటు దాదాపు ఇదే స్థాయిలో ఉండగా, మల్టీప్లెక్సుల్లో కొంచెం రేటు తక్కువ. ఐతే సంక్రాంతి టైంలో మంచి డిమాండ్ ఉంది కాబట్టి రెండో వీకెండ్ వరకు ఈ రేటు పెట్టడం ఓకే. కానీ రెండో సోమవారం తర్వాత కూడా అవే రేట్లు కొనసాగించడం చేటు చేసింది.
రేట్లు తగ్గితే సినిమా చూద్దామని చాలామంది ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ డిమాండ్ లేని టైంలో, వీక్ డేస్లో కూడా రేట్లు తగ్గించలేదు. దీంతో గత సోమవారం నుంచి రెండు సినిమాలూ పడుకున్నాయి. నిజానికి ఈ వారం ప్రేక్షకులకు సరైన ఆప్షన్ లేదు. ‘హంట్’కు బజ్ లేదు. ‘పఠాన్’ ఏమో డబ్బింగ్ సినిమా. సంక్రాంతి సినిమాలను సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో రూ.200తో ఆడించి ఉంటే రిపబ్లిక్ డేతో పాటు వీకెండ్ను బాగా ఉపయోగించుకునేవి. కానీ పాత రేట్లనే కొనసాగిస్తుండడంతో సరైన ఆక్యుపెన్సీ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి.
This post was last modified on January 27, 2023 6:24 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…