Movie News

రేట్లు తగ్గించలేదు.. థియేటర్లు వెలవెల

కరోనా తర్వాత జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోవడం, అదే సమయంలో టికెట్ల ధరలు పెరిగిపోవడం వల్ల థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి ఒక దశలో థియేటర్ల మనుగడే ప్రమాదంలో పడింది. అసలే టికెట్ల రేట్లు పెరిగిపోగా.. పెద్ద సినిమాలకు అదనంగా వడ్డించడం చేటు చేసింది.

ఒక దశలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారి ఇండస్ట్రీ జనాలు బెంబేలెత్తిపోయారు. దీంతో నెమ్మదిగా రేట్లు తగ్గించి సినిమాలు రిలీజ్ చేయడం.. తమ చిత్రాలకు ధరలు తగ్గించామని ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకోవడం చూశాం. ఇలా నిర్మాతలు దిగి వచ్చాకే సినిమాలకు మళ్లీ ఆక్యుపెన్సీ పెరిగింది. కానీ పరిస్థితి కొంచెం మెరుగుపడేసరికి మళ్లీ నిర్మాతల్లో అత్యాశ వచ్చినట్లు కనిపిస్తోంది. సంక్రాంతి సినిమాలకు ఈ అత్యాశే లాంగ్ రన్ లేకుండా చేసిందన్నది ట్రేడ్ వర్గాల మాట.

‘వాల్తేరు వీరయ్య’ రెండో వీకెండ్ వరకు చాలా బాగా ఆడింది. ‘వీరసింహారెడ్డి’ తొలి వీకెండ్ వరకు సత్తా చాటింది. తెలంగాణ వరకు ఈ రెండు చిత్రాలను మల్టీప్లెక్సుల్లో రూ.295, సింగిల్ స్క్రీన్లలో రూ.175 రేట్లతో రిలీజ్ చేశారు. ఆంధ్రాలో సింగిల్ స్క్రీన్ల రేటు దాదాపు ఇదే స్థాయిలో ఉండగా, మల్టీప్లెక్సుల్లో కొంచెం రేటు తక్కువ. ఐతే సంక్రాంతి టైంలో మంచి డిమాండ్ ఉంది కాబట్టి రెండో వీకెండ్ వరకు ఈ రేటు పెట్టడం ఓకే. కానీ రెండో సోమవారం తర్వాత కూడా అవే రేట్లు కొనసాగించడం చేటు చేసింది.

రేట్లు తగ్గితే సినిమా చూద్దామని చాలామంది ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ డిమాండ్ లేని టైంలో, వీక్ డేస్‌లో కూడా రేట్లు తగ్గించలేదు. దీంతో గత సోమవారం నుంచి రెండు సినిమాలూ పడుకున్నాయి. నిజానికి ఈ వారం ప్రేక్షకులకు సరైన ఆప్షన్ లేదు. ‘హంట్’కు బజ్ లేదు. ‘పఠాన్’ ఏమో డబ్బింగ్ సినిమా. సంక్రాంతి సినిమాలను సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో రూ.200తో ఆడించి ఉంటే రిపబ్లిక్ డేతో పాటు వీకెండ్‌ను బాగా ఉపయోగించుకునేవి. కానీ పాత రేట్లనే కొనసాగిస్తుండడంతో సరైన ఆక్యుపెన్సీ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి.

This post was last modified on January 27, 2023 6:24 am

Share
Show comments

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

49 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago