Movie News

వెంకీ 75.. రేంజే మారిపోయింది

25.. 50.. 75.. 100.. స్టార్ హీరోల కెరీర్లలో సినిమాల పరంగా ఇలాంటి మైలురాళ్ల దగ్గరికి వచ్చినపుడు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఐతే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ సినిమా గురించి మొన్నటిదాకా అసలే చర్చా లేదు. మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ లాగా వెంకీ అభిమానులు పెద్ద హడావుడి చేసే రకం కాదు.

వెంకీ సైతం తన గురించి తాను డబ్బా కొట్టుకోవడం, పెయిడ్ ప్రమోషన్లు చేసుకోవడం, మైల్ స్టోన్ మూవీ టైం వచ్చినపుడు హడావుడి చేయడం లాంటి వాటికి దూరంగా ఉంటాడు. అందుకే ఆయన 75వ సినిమా గురించి వారం ముందు వరకు కూడా ఏ డిస్కషన్ లేదు. అసలు వెంకీ ఈ మైలురాయి ముంగిట ఉన్నాడన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఈ సినిమా ఎవరో ఉంటుందో క్లారిటీ కూడా లేదు.

కానీ సడెన్‌గా ‘హిట్’ ఫ్రాంఛైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో వెంకీ 75వ సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి ‘సైంధవ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీంతో పాటే ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ కూడా లాంచ్ చేశారు. ఆ టీజర్ చూడగానే ఒక్కసారిగా జనాలకు సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. వెంకీ బెస్ట్ లుక్‌లో కనిపించడం.. ఆయన పాత్ర, కథ అన్నీ ఆసక్తికరంగా అనిపించడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఇక ఈ చిత్రంలో విలన్ పాత్రకు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఖరారవడంతో ఇంకో మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో సినిమా చేయడానికి అంగీకరించాడంటేనే క్యారెక్టర్ ఒక రేంజిలో ఉంటుందని అంచనా వేయొచ్చు. వెంకీ-నవాజ్ కాంబినేషన్ అమితాసక్తిని రేకెత్తించేదే. ఇందులో ఒక హీరో కీలక పాత్ర చేస్తాడని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే ‘వెంకీ 75’ చాలా స్పెషల్‌గా ఉండబోతోందని, దాని రేంజే వేరని స్పష్టంగా తెలుస్తోంది.

Satya

Recent Posts

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

55 minutes ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

1 hour ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

1 hour ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

2 hours ago