వెంకటేష్ 75 వ సినిమాను కుర్ర దర్శకుడు శైలేష్ కొలను చేతిలో పెట్టాడు వెంకీ. సురేష్ బాబు, వెంకీ ఇద్దరు కలిసి 75 వ సినిమాకు కొందరు దర్శకులను అనుకోని ఫైనల్ గా శైలేష్ చెప్పిన కథకి ఓటేశారు. అయితే నిజానికి వెంకటేష్ 75 వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అప్పుడెప్పుడో వెంకటేష్ కి త్రివిక్రమ్ ఓ లైన్ చెప్పి ఫిక్స్ చేసుకొని ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
ఇక త్రివిక్రమ్ వరుస బడా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోవడంతో మధ్యలో వెంకీ సినిమా వైపు చూడలేదు. దీంతో చాలా రోజులు త్రివిక్రమ్ కోసం చూసి కొందరు దర్శకులను లాక్ చేసుకున్నాడు వెంకీ. అందులో శైలేష్ కి 75 వ సినిమా తగిలింది. ఇక వెంకీ ఫ్యాన్స్ కూడా రెండు మూడేళ్ళ క్రితం వెంకటేష్ ల్యాండ్ మార్క్ సినిమా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడని ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పుడు శైలేష్ వదిలిన గ్లిమ్స్ తో వెంకీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు , కానీ ఎప్పటి నుండో వెంకీ , త్రివిక్రమ్ కాంబో కోసం చూస్తున్న వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఏదేమైనా వెంకీ తన ప్రెస్టీజియస్ ల్యాండ్ మార్క్ మూవీ ను కుర్ర దర్శకుడి చేతిలో పెట్టడం గొప్ప విషయమే. మరి శైలేష్ మీద వెంకీ కి ఎందుకంత నమ్మకమో ? బహుశా ఈ దర్శకుడు తీసిన హిట్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కావచ్చు.
This post was last modified on January 25, 2023 6:47 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…