వెంకటేష్ 75 వ సినిమాను కుర్ర దర్శకుడు శైలేష్ కొలను చేతిలో పెట్టాడు వెంకీ. సురేష్ బాబు, వెంకీ ఇద్దరు కలిసి 75 వ సినిమాకు కొందరు దర్శకులను అనుకోని ఫైనల్ గా శైలేష్ చెప్పిన కథకి ఓటేశారు. అయితే నిజానికి వెంకటేష్ 75 వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అప్పుడెప్పుడో వెంకటేష్ కి త్రివిక్రమ్ ఓ లైన్ చెప్పి ఫిక్స్ చేసుకొని ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
ఇక త్రివిక్రమ్ వరుస బడా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోవడంతో మధ్యలో వెంకీ సినిమా వైపు చూడలేదు. దీంతో చాలా రోజులు త్రివిక్రమ్ కోసం చూసి కొందరు దర్శకులను లాక్ చేసుకున్నాడు వెంకీ. అందులో శైలేష్ కి 75 వ సినిమా తగిలింది. ఇక వెంకీ ఫ్యాన్స్ కూడా రెండు మూడేళ్ళ క్రితం వెంకటేష్ ల్యాండ్ మార్క్ సినిమా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడని ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పుడు శైలేష్ వదిలిన గ్లిమ్స్ తో వెంకీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు , కానీ ఎప్పటి నుండో వెంకీ , త్రివిక్రమ్ కాంబో కోసం చూస్తున్న వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఏదేమైనా వెంకీ తన ప్రెస్టీజియస్ ల్యాండ్ మార్క్ మూవీ ను కుర్ర దర్శకుడి చేతిలో పెట్టడం గొప్ప విషయమే. మరి శైలేష్ మీద వెంకీ కి ఎందుకంత నమ్మకమో ? బహుశా ఈ దర్శకుడు తీసిన హిట్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కావచ్చు.
This post was last modified on January 25, 2023 6:47 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…