వెంకటేష్ 75 వ సినిమాను కుర్ర దర్శకుడు శైలేష్ కొలను చేతిలో పెట్టాడు వెంకీ. సురేష్ బాబు, వెంకీ ఇద్దరు కలిసి 75 వ సినిమాకు కొందరు దర్శకులను అనుకోని ఫైనల్ గా శైలేష్ చెప్పిన కథకి ఓటేశారు. అయితే నిజానికి వెంకటేష్ 75 వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. అప్పుడెప్పుడో వెంకటేష్ కి త్రివిక్రమ్ ఓ లైన్ చెప్పి ఫిక్స్ చేసుకొని ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.
ఇక త్రివిక్రమ్ వరుస బడా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోవడంతో మధ్యలో వెంకీ సినిమా వైపు చూడలేదు. దీంతో చాలా రోజులు త్రివిక్రమ్ కోసం చూసి కొందరు దర్శకులను లాక్ చేసుకున్నాడు వెంకీ. అందులో శైలేష్ కి 75 వ సినిమా తగిలింది. ఇక వెంకీ ఫ్యాన్స్ కూడా రెండు మూడేళ్ళ క్రితం వెంకటేష్ ల్యాండ్ మార్క్ సినిమా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడని ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పుడు శైలేష్ వదిలిన గ్లిమ్స్ తో వెంకీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు , కానీ ఎప్పటి నుండో వెంకీ , త్రివిక్రమ్ కాంబో కోసం చూస్తున్న వారి కోరిక మాత్రం తీరడం లేదు. ఏదేమైనా వెంకీ తన ప్రెస్టీజియస్ ల్యాండ్ మార్క్ మూవీ ను కుర్ర దర్శకుడి చేతిలో పెట్టడం గొప్ప విషయమే. మరి శైలేష్ మీద వెంకీ కి ఎందుకంత నమ్మకమో ? బహుశా ఈ దర్శకుడు తీసిన హిట్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ కావచ్చు.
This post was last modified on January 25, 2023 6:47 pm
కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు…
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…