ఇప్పుడు స్టార్ హీరోలందరూ కూడా ‘ఫ్యాన్స్’ మోడ్లోకి వెళ్లిపోతున్నారు. తమ అభిమానులకు ఏం నచ్చుతుందో అదే చేస్తున్నారు. ఫ్యాన్స్ అన్నాక ఆటోమేటిగ్గా తమ అభిమానుల హీరోల వీరత్వాన్ని తెరపై చూడాలనుకుంటారు. యాక్షన్ దండిగా ఉండి.. ఎలివేషన్ సీన్లకు లోటు ఉండొద్దని.. తమ హీరోలు రఫ్ అండ్ రగ్డ్ లుక్లో కనిపిస్తూ చెలరేగిపోవాలని.. సినిమాలూ పక్కా మాస్గా ఉండాలని కోరుకుంటారు.
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కూడా ఇటీవల తమ అభిమానులను అలరించే సినిమాలే చేశారు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరు, ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య పూర్తిగా అభిమానులను అలరించే వింటేజ్ అవతారాల్లో కనిపించారు. వారిని ఆద్యంతం ఉర్రూతలూగించారు. మరోవైపు తమిళంలో కమల్ హాసన్ సైతం ‘విక్రమ్’లో అభిమానులను అలరించే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా ఆ మార్గంలోనే నడవడబోతున్నట్లు స్పష్టమవుతోంది.
వరుసగా ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చిన వెంకీ.. ఇప్పుడు పూర్తిగా యాక్షన్ మోడ్లోకి మారిపోతున్నాడు. తన 75వ సినిమా కోసం ఆయన యాక్షన్ అవతారంలోకి మారిపోయాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమా టీజర్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది. వెంకీ లుక్, ఆయన బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఇది కదా మాకు కావాల్సింది అంటున్నారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లుగా వెంకీ కూడా ఫ్యాన్స్ను దృష్టిలో ఉంచుకుని తన మైల్ స్టోన్ మూవీ చేయాలని ఫిక్సయినట్లున్నారు. ‘హిట్’ సిరీస్లో ఇప్పటికే ఎంతో ఆకట్టుకున్న శైలేష్.. వెంకీతో ఒక అదిరిపోయే సినిమా అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
This post was last modified on January 25, 2023 4:36 pm
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…