ఇప్పుడు స్టార్ హీరోలందరూ కూడా ‘ఫ్యాన్స్’ మోడ్లోకి వెళ్లిపోతున్నారు. తమ అభిమానులకు ఏం నచ్చుతుందో అదే చేస్తున్నారు. ఫ్యాన్స్ అన్నాక ఆటోమేటిగ్గా తమ అభిమానుల హీరోల వీరత్వాన్ని తెరపై చూడాలనుకుంటారు. యాక్షన్ దండిగా ఉండి.. ఎలివేషన్ సీన్లకు లోటు ఉండొద్దని.. తమ హీరోలు రఫ్ అండ్ రగ్డ్ లుక్లో కనిపిస్తూ చెలరేగిపోవాలని.. సినిమాలూ పక్కా మాస్గా ఉండాలని కోరుకుంటారు.
చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కూడా ఇటీవల తమ అభిమానులను అలరించే సినిమాలే చేశారు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరు, ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య పూర్తిగా అభిమానులను అలరించే వింటేజ్ అవతారాల్లో కనిపించారు. వారిని ఆద్యంతం ఉర్రూతలూగించారు. మరోవైపు తమిళంలో కమల్ హాసన్ సైతం ‘విక్రమ్’లో అభిమానులను అలరించే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా ఆ మార్గంలోనే నడవడబోతున్నట్లు స్పష్టమవుతోంది.
వరుసగా ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలు చేస్తూ వచ్చిన వెంకీ.. ఇప్పుడు పూర్తిగా యాక్షన్ మోడ్లోకి మారిపోతున్నాడు. తన 75వ సినిమా కోసం ఆయన యాక్షన్ అవతారంలోకి మారిపోయాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమా టీజర్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ అని అర్థమవుతోంది. వెంకీ లుక్, ఆయన బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా ఇది కదా మాకు కావాల్సింది అంటున్నారు. ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లుగా వెంకీ కూడా ఫ్యాన్స్ను దృష్టిలో ఉంచుకుని తన మైల్ స్టోన్ మూవీ చేయాలని ఫిక్సయినట్లున్నారు. ‘హిట్’ సిరీస్లో ఇప్పటికే ఎంతో ఆకట్టుకున్న శైలేష్.. వెంకీతో ఒక అదిరిపోయే సినిమా అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
This post was last modified on January 25, 2023 4:36 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…