ప్రేమమ్.. అంత సులువుగా మరిచిపోయే సినిమా కాదిది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప ప్రేమకథా చిత్రాల్లో ఒకటిగా.. ఆల్ టైం క్లాసిక్గా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ సినిమా.. మలయాళీలనే కాక అన్ని భాషల వాళ్లనూ అమితంగా ఆకట్టుకుంది. భాష తెలియకపోయినా.. సబ్ టైటిల్స్ లేకపోయినా కూడా ఈ సినిమా చూసి మైమరిచిపోయి.. ప్రేమమ్ జ్ఞాపకాల్ని మనసుల్లో పదిలంగా దాచుకున్న ప్రేక్షకులు ఎంతమందో. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడా మంచి విజయం సాధించింది. ఇలాంటి దృశ్యకావ్యాన్ని అందించిన దర్శకుడు.. అల్ఫాన్సో పుతెరిన్.
ఐతే ఇలాంటి క్లాసిక్ అందించాక అల్ఫాన్సో ఆరేళ్లకు పైగా సినిమా చేయకపోవడం ఆశ్చర్యకరం. చాలా గ్యాప్ తర్వాత అతను గోల్డ్ అనే సినిమా తీశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్, నయనతార లాంటి పేరున్న నటీనటులు ఇందులో లీడ్ రోల్స్ చేశారు. ఐతే గత నెలలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
ఇక అప్పట్నుంచి అల్ఫాన్సోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటు ట్విట్టర్, అటు ఫేస్ బుక్లో హేట్ మెసేజ్లతో అతణ్ని వేదనకు గురి చేస్తున్నారు. దీంతో కలత చెందిన అల్ఫాన్సో ఫేస్బుక్లో తన డీపీని తీసేసి నిరసన వ్యక్తం చేశాడు. ఇలాగే ట్రోల్స్ కొనసాగితే తాను సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతానని అతను అన్నాడు.
“మీ సంతృప్తి కోసం నన్ను ట్రోల్ చేస్తున్నారు. దూషిస్తున్నారు. నా సినిమా గోల్డ్ గురించి చెత్తగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా చేయడం మీకు బాగా అనిపిస్తుంది. కానీ, నాకు ఎంత మాత్రం కాదు. నా చిత్రం నచ్చితే చూడండి. కోపాన్ని చూపడానికి మాత్రం నా పేజికి రాకండి. మీరు ఆ విధంగా చేస్తే నేను సోషల్ మీడియా అకౌంట్స్ను తొలగిస్తాను. గతంలో మాదిరిగా నేను లేను. నేను అపజయాలు ఎదుర్కొనప్పుడల్లా నా భార్య, పిల్లలు, కొంత మంది వ్యక్తులు నాకు అండగా నిలిచారు. పరాజయాలు ఎదురు కావాలని ఎవరు కొరుకోరు. సహజసిద్ధంగా అది జరుగుతుంది” అని అల్ఫోన్సో తన పోస్టులో పేర్కొన్నాడు.
This post was last modified on January 24, 2023 6:15 am
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…