బాలీవుడ్లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో కార్తీక్ ఆర్యన్. కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలే చేసినా.. ఆ తర్వాత అతడి రేంజ్ కాస్త పెరిగింది. ఐతే మధ్యలో కరణ్ జోహార్ అతణ్ని ఓ సినిమా నుంచి తీసేయడం.. ఇంకో సినిమా కూడా అతడి చేజారడం చూసి ఇక అతను పైకెదగడం కష్టమే అని చాలామంది తేలిగ్గా తీసిపారేశారు. కానీ ‘భూల్ భూలయియా-2’తో అతను బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఓవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా చతికిలపడుతున్న టైంలో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హార్రర్ కామెడీ బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీకి గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఆ సినిమాతో అతడి రేంజే మారిపోయింది. డిమాండ్ అమాంతం పెరిగింది. మిడ్ రేంజ్ స్టార్గా ఎదిగిన కార్తిక్.. తాజాగా ఒక సినిమాకు రోజుకు రెండు కోట్ల చొప్పున పారితోషకం అందుకున్నాడట.
ఈ విషయాన్ని కార్తీకే స్వయంగా వెల్లడించడం విశేషం. తొలి సినిమా ‘ప్యార్ కా పంచనామా’కు కేవలం రూ.1.25 లక్షల రూపాయల పారితోషకం తీసుకున్న కార్తీక్.. తాజాగా ఓ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దీని గురించి ఒక టీవీ షోలో కార్తీక్ స్పందిస్తూ.. “నేను కరోనా టైంలో ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో నా పాత్ర చిత్రీకరణ 10 రోజుల్లోనే పూర్తయింది. తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు రెట్టింపు లాభం దక్కింది. అందుకే నాకు ఆ పారితోషకం దక్కింది. అందుకు నేను అర్హుడినే అనుకుంటున్నా” అని కార్తీక్ అన్నాడు. ఆ సినిమాకు రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్న కార్తీక్.. పని చేసింది పది రోజులే కాబట్టి రోజుకు రూ.2 కోట్లు పుచ్చుకున్నట్లు అయింది. కార్తీక్కు ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం, వేరే హీరోలు అందుకుంటున్న దాంతో పోలిస్తే ఇదేమీ ఎక్కువగా అనిపించదు.
This post was last modified on January 23, 2023 6:44 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…