బాలీవుడ్లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో కార్తీక్ ఆర్యన్. కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలే చేసినా.. ఆ తర్వాత అతడి రేంజ్ కాస్త పెరిగింది. ఐతే మధ్యలో కరణ్ జోహార్ అతణ్ని ఓ సినిమా నుంచి తీసేయడం.. ఇంకో సినిమా కూడా అతడి చేజారడం చూసి ఇక అతను పైకెదగడం కష్టమే అని చాలామంది తేలిగ్గా తీసిపారేశారు. కానీ ‘భూల్ భూలయియా-2’తో అతను బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఓవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా చతికిలపడుతున్న టైంలో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హార్రర్ కామెడీ బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీకి గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఆ సినిమాతో అతడి రేంజే మారిపోయింది. డిమాండ్ అమాంతం పెరిగింది. మిడ్ రేంజ్ స్టార్గా ఎదిగిన కార్తిక్.. తాజాగా ఒక సినిమాకు రోజుకు రెండు కోట్ల చొప్పున పారితోషకం అందుకున్నాడట.
ఈ విషయాన్ని కార్తీకే స్వయంగా వెల్లడించడం విశేషం. తొలి సినిమా ‘ప్యార్ కా పంచనామా’కు కేవలం రూ.1.25 లక్షల రూపాయల పారితోషకం తీసుకున్న కార్తీక్.. తాజాగా ఓ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దీని గురించి ఒక టీవీ షోలో కార్తీక్ స్పందిస్తూ.. “నేను కరోనా టైంలో ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో నా పాత్ర చిత్రీకరణ 10 రోజుల్లోనే పూర్తయింది. తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు రెట్టింపు లాభం దక్కింది. అందుకే నాకు ఆ పారితోషకం దక్కింది. అందుకు నేను అర్హుడినే అనుకుంటున్నా” అని కార్తీక్ అన్నాడు. ఆ సినిమాకు రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్న కార్తీక్.. పని చేసింది పది రోజులే కాబట్టి రోజుకు రూ.2 కోట్లు పుచ్చుకున్నట్లు అయింది. కార్తీక్కు ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం, వేరే హీరోలు అందుకుంటున్న దాంతో పోలిస్తే ఇదేమీ ఎక్కువగా అనిపించదు.
This post was last modified on January 23, 2023 6:44 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…