బాలీవుడ్లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో కార్తీక్ ఆర్యన్. కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలే చేసినా.. ఆ తర్వాత అతడి రేంజ్ కాస్త పెరిగింది. ఐతే మధ్యలో కరణ్ జోహార్ అతణ్ని ఓ సినిమా నుంచి తీసేయడం.. ఇంకో సినిమా కూడా అతడి చేజారడం చూసి ఇక అతను పైకెదగడం కష్టమే అని చాలామంది తేలిగ్గా తీసిపారేశారు. కానీ ‘భూల్ భూలయియా-2’తో అతను బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఓవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా చతికిలపడుతున్న టైంలో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హార్రర్ కామెడీ బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీకి గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఆ సినిమాతో అతడి రేంజే మారిపోయింది. డిమాండ్ అమాంతం పెరిగింది. మిడ్ రేంజ్ స్టార్గా ఎదిగిన కార్తిక్.. తాజాగా ఒక సినిమాకు రోజుకు రెండు కోట్ల చొప్పున పారితోషకం అందుకున్నాడట.
ఈ విషయాన్ని కార్తీకే స్వయంగా వెల్లడించడం విశేషం. తొలి సినిమా ‘ప్యార్ కా పంచనామా’కు కేవలం రూ.1.25 లక్షల రూపాయల పారితోషకం తీసుకున్న కార్తీక్.. తాజాగా ఓ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దీని గురించి ఒక టీవీ షోలో కార్తీక్ స్పందిస్తూ.. “నేను కరోనా టైంలో ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో నా పాత్ర చిత్రీకరణ 10 రోజుల్లోనే పూర్తయింది. తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు రెట్టింపు లాభం దక్కింది. అందుకే నాకు ఆ పారితోషకం దక్కింది. అందుకు నేను అర్హుడినే అనుకుంటున్నా” అని కార్తీక్ అన్నాడు. ఆ సినిమాకు రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్న కార్తీక్.. పని చేసింది పది రోజులే కాబట్టి రోజుకు రూ.2 కోట్లు పుచ్చుకున్నట్లు అయింది. కార్తీక్కు ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం, వేరే హీరోలు అందుకుంటున్న దాంతో పోలిస్తే ఇదేమీ ఎక్కువగా అనిపించదు.
This post was last modified on January 23, 2023 6:44 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…