బాలీవుడ్లోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో కార్తీక్ ఆర్యన్. కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలే చేసినా.. ఆ తర్వాత అతడి రేంజ్ కాస్త పెరిగింది. ఐతే మధ్యలో కరణ్ జోహార్ అతణ్ని ఓ సినిమా నుంచి తీసేయడం.. ఇంకో సినిమా కూడా అతడి చేజారడం చూసి ఇక అతను పైకెదగడం కష్టమే అని చాలామంది తేలిగ్గా తీసిపారేశారు. కానీ ‘భూల్ భూలయియా-2’తో అతను బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
ఓవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా చతికిలపడుతున్న టైంలో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హార్రర్ కామెడీ బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీకి గొప్ప ఉపశమనాన్ని అందించింది. ఆ సినిమాతో అతడి రేంజే మారిపోయింది. డిమాండ్ అమాంతం పెరిగింది. మిడ్ రేంజ్ స్టార్గా ఎదిగిన కార్తిక్.. తాజాగా ఒక సినిమాకు రోజుకు రెండు కోట్ల చొప్పున పారితోషకం అందుకున్నాడట.
ఈ విషయాన్ని కార్తీకే స్వయంగా వెల్లడించడం విశేషం. తొలి సినిమా ‘ప్యార్ కా పంచనామా’కు కేవలం రూ.1.25 లక్షల రూపాయల పారితోషకం తీసుకున్న కార్తీక్.. తాజాగా ఓ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దీని గురించి ఒక టీవీ షోలో కార్తీక్ స్పందిస్తూ.. “నేను కరోనా టైంలో ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో నా పాత్ర చిత్రీకరణ 10 రోజుల్లోనే పూర్తయింది. తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు రెట్టింపు లాభం దక్కింది. అందుకే నాకు ఆ పారితోషకం దక్కింది. అందుకు నేను అర్హుడినే అనుకుంటున్నా” అని కార్తీక్ అన్నాడు. ఆ సినిమాకు రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్న కార్తీక్.. పని చేసింది పది రోజులే కాబట్టి రోజుకు రూ.2 కోట్లు పుచ్చుకున్నట్లు అయింది. కార్తీక్కు ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం, వేరే హీరోలు అందుకుంటున్న దాంతో పోలిస్తే ఇదేమీ ఎక్కువగా అనిపించదు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…