Movie News

పార్టీకి సై తెలుగు ప్రమోషన్లకు నై

కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రమోషన్స్ కి వీలైనంత దూరంగా ఉంటాడనే సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందు ఒకే ఒక సారి ప్రమోషన్ కి వస్తానని ముందే అగ్రిమెంట్ ద్వారా క్లియర్ గా చెప్పేస్తాడు. తమిళ దర్శక నిర్మాతలకు ఇదంతా తెలిసిందే. అందుకే విజయ్ వచ్చే ఒకే ఒక్క ఈవెంట్ ను భారీ ఎత్తున చేసి సినిమాకు గ్రాండియర్ లుక్ తీసుకొచ్చే ప్లాన్ చేసుకుంటారు. తెలుగులో రిలీజ్ అయినా విజయ్ హైదరాబాద్ వచ్చి ప్రమోషన్ చేయడు. ఓవరాల్ గా ఒకే ఒక్క ఈవెంట్ తో విజయ్ హీరోగా చేతులు దులిపేసుకొని మరో సినిమాకి షిఫ్ట్ అయిపోతాడు.

‘వారిసు’ విషయంలోనూ అదే జరిగింది. కానీ ఈసారి దిల్ రాజు నిర్మాత, పైగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ కాబట్టి తెలుగులో విజయ్ వచ్చి ప్రమోషన్ చేస్తాడని, ఓ ఈవెంట్ లో పాల్గొంటాడని అందరూ అనుకున్నారు. దిల్ రాజు కూడా రిలీజ్ డేట్ మారింది కాబట్టి విజయ్ గారిని తీసుకొస్తా అంటూ మీడియా అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. దీంతో తెలుగులో విజయ్ ను ఇష్టపడే కొందరు ఫ్యాన్స్ ఫైనల్ గా విజయ్ ప్రమోషన్స్ కి హైదరాబాద్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని మురిసిపోయారు.

కానీ విజయ్ మాత్రం వారసుడు సినిమాను కూడా ప్రతీ సినిమాలానే ట్రీట్ చేశాడు. తెలుగు దర్శక నిర్మాతలు సినిమా తీసినప్పటికీ తెలుగులో విజయ్ ఈ సినిమాకు ప్రమోషన్ చేయలేదు. తాజాగా దిల్ రాజు హైదరాబాద్ లో టీంకు ఓ సక్సెస్ పార్టీ ఇచ్చాడు. అక్కడ అనుకోకుండా విజయ్ ప్రత్యక్ష మయ్యాడు. దీంతో విజయ్ తెలుగులో ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టి పార్టీకి రావడం కొందరు తెలుగు ఫ్యాన్ కి బాధ కలిగిస్తుంది. తమ జేబులో నుండి ఈ తమిళ హీరోకి పెరిగిన టికెట్టు ధర పట్టించుకోకుండా కలెక్షన్స్ ఇస్తే కనీసం ప్రేక్షకుడి కోసమైనా రాకుండా పార్టీకేలా వచ్చాడని కొందరు నెటిజన్లు విజయ్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఏదేమైనా ఇవన్నీ కోలీవుడ్ స్టార్ కి రీచ్ అవుతాయా ? అయినా విజయ్ ఇవన్నీ పట్టించుకుంటాడా ? ఏదేమైనా దిల్ రాజు మాట విజయ్ విషయంలో నెగ్గలేదనేది మాత్రం క్లియర్ గా తెలుస్తోంది.

This post was last modified on January 23, 2023 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

49 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago