నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కథలన్నీ కూడా ఎక్కువగా ఆంధ్రా, రాయలసీమ, అ ప్రాంతాల చుట్టూ తిరుగుతుంటాయి. కొంచెం హైదరాబాద్ టచ్ ఉంటుందే తప్ప.. పక్కా తెలంగాణ నేపథ్యంలో, ఇక్కడి యాసతో బాలయ్య తెరకెక్కిన బాలయ్య సినిమాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఈ ప్రాంత నేపథ్యంలో కొన్ని కథలు తెరకెక్కి ఉండొచ్చేమో కానీ.. బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం.. పూర్తిగా ఈ ప్రాంతంలోనే కథ నడవడం జరగలేదనే చెప్పాలి. కానీ తొలిసారిగా అనిల్ రావిపూడి బాలయ్యతో ఈ ప్రయోగం చేస్తున్నాడని వెల్లడైంది.
బాలయ్య లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో అనిల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య రాయలసీమ నేపథ్యంలో విశ్వరూపం చూపించాడని.. తన సినిమాలో తెలంగాణలో దూకుడు చూపించబోతున్నాడని అనిల్ చెప్పాడు.
“బాలకృష్ణ గారితో నేను చేస్తున్న సినిమా ఒక షెడ్యూల్ పూర్తయింది. ఆ సినిమా కథా చర్చల్లో కానీ.. షూటింగ్ టైంలో కానీ ఆయనతో మాట్లాడుతుంటే అభిమానులను ఎంతగా దృష్టిలో పెట్టుకుంటారో అర్థమైంది. ఒక సినిమా చేస్తున్నపుడు మామూలు ప్రేక్షకులతో పాటు అభిమానులకు కూడా అది నచ్చాలని ఎంతో కేర్ తీసుకుంటారు. అందుకే ప్రతి సినిమాలోనూ ‘ఎన్.బీ.కే’ టచ్ యాడ్ చేస్తారు. ఆ ‘ఎన్.బీ.కే’ టచ్తోనే ‘వీరసింహారెడ్డి’ వచ్చింది. నేను తీస్తున్న 108వ సినిమా కూడా ఆ టచ్తోనే రాబోతోంది. కాకపోతే ఈసారి అన్న రాయలసీమలో కాదు తెలంగాణలో దిగుతుండు. బాక్సాఫీస్ ఊచకోత షురూ చేస్తడు. కలెక్షన్లతో కుర్బానీ పెడతడు” అంటూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఈ సినిమా బ్యాక్డ్రాప్ గురించి వివరించాడు అనిల్ రావిపూడి.
నేపథ్యం వరకు తెలంగాణ అయితే ఓకే కానీ.. బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెబుతాడంటేనే ఏదోలా అనిపిస్తోంది. నిజంగా ఆ యాస బాలయ్యకు సెట్ అవుతుందా?
This post was last modified on January 23, 2023 12:23 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…