నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కథలన్నీ కూడా ఎక్కువగా ఆంధ్రా, రాయలసీమ, అ ప్రాంతాల చుట్టూ తిరుగుతుంటాయి. కొంచెం హైదరాబాద్ టచ్ ఉంటుందే తప్ప.. పక్కా తెలంగాణ నేపథ్యంలో, ఇక్కడి యాసతో బాలయ్య తెరకెక్కిన బాలయ్య సినిమాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఈ ప్రాంత నేపథ్యంలో కొన్ని కథలు తెరకెక్కి ఉండొచ్చేమో కానీ.. బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం.. పూర్తిగా ఈ ప్రాంతంలోనే కథ నడవడం జరగలేదనే చెప్పాలి. కానీ తొలిసారిగా అనిల్ రావిపూడి బాలయ్యతో ఈ ప్రయోగం చేస్తున్నాడని వెల్లడైంది.
బాలయ్య లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ వేడుకలో అనిల్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య రాయలసీమ నేపథ్యంలో విశ్వరూపం చూపించాడని.. తన సినిమాలో తెలంగాణలో దూకుడు చూపించబోతున్నాడని అనిల్ చెప్పాడు.
“బాలకృష్ణ గారితో నేను చేస్తున్న సినిమా ఒక షెడ్యూల్ పూర్తయింది. ఆ సినిమా కథా చర్చల్లో కానీ.. షూటింగ్ టైంలో కానీ ఆయనతో మాట్లాడుతుంటే అభిమానులను ఎంతగా దృష్టిలో పెట్టుకుంటారో అర్థమైంది. ఒక సినిమా చేస్తున్నపుడు మామూలు ప్రేక్షకులతో పాటు అభిమానులకు కూడా అది నచ్చాలని ఎంతో కేర్ తీసుకుంటారు. అందుకే ప్రతి సినిమాలోనూ ‘ఎన్.బీ.కే’ టచ్ యాడ్ చేస్తారు. ఆ ‘ఎన్.బీ.కే’ టచ్తోనే ‘వీరసింహారెడ్డి’ వచ్చింది. నేను తీస్తున్న 108వ సినిమా కూడా ఆ టచ్తోనే రాబోతోంది. కాకపోతే ఈసారి అన్న రాయలసీమలో కాదు తెలంగాణలో దిగుతుండు. బాక్సాఫీస్ ఊచకోత షురూ చేస్తడు. కలెక్షన్లతో కుర్బానీ పెడతడు” అంటూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఈ సినిమా బ్యాక్డ్రాప్ గురించి వివరించాడు అనిల్ రావిపూడి.
నేపథ్యం వరకు తెలంగాణ అయితే ఓకే కానీ.. బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెబుతాడంటేనే ఏదోలా అనిపిస్తోంది. నిజంగా ఆ యాస బాలయ్యకు సెట్ అవుతుందా?
This post was last modified on January 23, 2023 12:23 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…