Rashmika సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉండే కథానాయికల్లో రష్మిక మందన్నా ఒకరు. ఆమె కొన్నిసార్లు పాజిటివ్ న్యూస్లతో వార్తల్లో ఉంటే.. కొన్నిసార్లు నెగెటివ్ న్యూస్లతో మీడియాకు ఎక్కుతుంటుంది.
సోషల్ మీడియాలో ఆమె గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తుంటుంది. నెటిజన్లు ఆమె మీద హేట్ కామెంట్లతో రెచ్చిపోతుంటారు. ఐతే తనతో ఎవరికి ఏ సమస్య ఉందో అర్థం కాదని.. తాను ఏం చేసినా ఏదో ఒక నెగెటివ్ కామెంట్ చేస్తూనే ఉంటారంటూ ఒక ఇంటర్వ్యూలో రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
తాను గాలి పీల్చినా కూడా కొందరికి సమస్యే అని ఆమె కామెంట్ చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో తన మీద ఉన్నంత నెగెటివిటీ ఇంకెవరి మీదా ఉండదన్నట్లు ఆమె మాట్లాడింది.
‘‘నేను బాగా వర్కవుట్ చేసి ఫిట్గా ఉందామని ప్రయత్నిస్తే.. మగాడిలా ఉన్నావు అంటారు. వర్కవుట్ చేయకుంటే కొవ్వు ఎక్కువైందని అంటారు. దేని గురించైనా మాట్లాడితే చెత్తగా మాట్లాడానని అంటారు. ఏం మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే యాటిట్యూడ్ అంటారు. అసలుం నేనేం చేసినా తప్పే అంటే ఎలా? చివరికి నేను గాలి పీల్చినా కూడా అందులో కూడా తప్పు వెతుకుతారేమో. అసలు వీళ్ల సమస్య ఏంటో అర్థం కాదు. నేను ఇండస్ట్రీలో ఉండాలా.. వెళ్లిపోవాలా.. ఆ విషయం అయినా సూటిగా చెబితే అలా చేయడానికి నేను రెడీ. ఎందుకు ఇంత నెగెటివిటీ చూపిస్తారో నాకు అర్థం కాదు’’ అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
‘కాంతార’ సినిమాకు సంబంధించి తాను చేసిన కామెంట్ను పట్టుకుని వివాదం రాజేశారని.. నిజానికి ఆ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి మీద తనకు ఎంతో గౌరవం ఉందంటూ.. రిషబ్, రక్షిత్ కలిసి తనకు ‘కిరిక్’ పార్టీలో తొలి అవకాశం ఎలా ఇచ్చారో గుర్తు చేసుకుంది రష్మిక. ఈ సందర్భ:గా రిషబ్, రక్షిత్లను ఆమె సర్ అంటూ సంబోధించింది.
This post was last modified on January 22, 2023 9:16 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…