Rashmika సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉండే కథానాయికల్లో రష్మిక మందన్నా ఒకరు. ఆమె కొన్నిసార్లు పాజిటివ్ న్యూస్లతో వార్తల్లో ఉంటే.. కొన్నిసార్లు నెగెటివ్ న్యూస్లతో మీడియాకు ఎక్కుతుంటుంది.
సోషల్ మీడియాలో ఆమె గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తుంటుంది. నెటిజన్లు ఆమె మీద హేట్ కామెంట్లతో రెచ్చిపోతుంటారు. ఐతే తనతో ఎవరికి ఏ సమస్య ఉందో అర్థం కాదని.. తాను ఏం చేసినా ఏదో ఒక నెగెటివ్ కామెంట్ చేస్తూనే ఉంటారంటూ ఒక ఇంటర్వ్యూలో రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
తాను గాలి పీల్చినా కూడా కొందరికి సమస్యే అని ఆమె కామెంట్ చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో తన మీద ఉన్నంత నెగెటివిటీ ఇంకెవరి మీదా ఉండదన్నట్లు ఆమె మాట్లాడింది.
‘‘నేను బాగా వర్కవుట్ చేసి ఫిట్గా ఉందామని ప్రయత్నిస్తే.. మగాడిలా ఉన్నావు అంటారు. వర్కవుట్ చేయకుంటే కొవ్వు ఎక్కువైందని అంటారు. దేని గురించైనా మాట్లాడితే చెత్తగా మాట్లాడానని అంటారు. ఏం మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే యాటిట్యూడ్ అంటారు. అసలుం నేనేం చేసినా తప్పే అంటే ఎలా? చివరికి నేను గాలి పీల్చినా కూడా అందులో కూడా తప్పు వెతుకుతారేమో. అసలు వీళ్ల సమస్య ఏంటో అర్థం కాదు. నేను ఇండస్ట్రీలో ఉండాలా.. వెళ్లిపోవాలా.. ఆ విషయం అయినా సూటిగా చెబితే అలా చేయడానికి నేను రెడీ. ఎందుకు ఇంత నెగెటివిటీ చూపిస్తారో నాకు అర్థం కాదు’’ అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
‘కాంతార’ సినిమాకు సంబంధించి తాను చేసిన కామెంట్ను పట్టుకుని వివాదం రాజేశారని.. నిజానికి ఆ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి మీద తనకు ఎంతో గౌరవం ఉందంటూ.. రిషబ్, రక్షిత్ కలిసి తనకు ‘కిరిక్’ పార్టీలో తొలి అవకాశం ఎలా ఇచ్చారో గుర్తు చేసుకుంది రష్మిక. ఈ సందర్భ:గా రిషబ్, రక్షిత్లను ఆమె సర్ అంటూ సంబోధించింది.
This post was last modified on January 22, 2023 9:16 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…