Rashmika సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో ఉండే కథానాయికల్లో రష్మిక మందన్నా ఒకరు. ఆమె కొన్నిసార్లు పాజిటివ్ న్యూస్లతో వార్తల్లో ఉంటే.. కొన్నిసార్లు నెగెటివ్ న్యూస్లతో మీడియాకు ఎక్కుతుంటుంది.
సోషల్ మీడియాలో ఆమె గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తుంటుంది. నెటిజన్లు ఆమె మీద హేట్ కామెంట్లతో రెచ్చిపోతుంటారు. ఐతే తనతో ఎవరికి ఏ సమస్య ఉందో అర్థం కాదని.. తాను ఏం చేసినా ఏదో ఒక నెగెటివ్ కామెంట్ చేస్తూనే ఉంటారంటూ ఒక ఇంటర్వ్యూలో రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
తాను గాలి పీల్చినా కూడా కొందరికి సమస్యే అని ఆమె కామెంట్ చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో తన మీద ఉన్నంత నెగెటివిటీ ఇంకెవరి మీదా ఉండదన్నట్లు ఆమె మాట్లాడింది.
‘‘నేను బాగా వర్కవుట్ చేసి ఫిట్గా ఉందామని ప్రయత్నిస్తే.. మగాడిలా ఉన్నావు అంటారు. వర్కవుట్ చేయకుంటే కొవ్వు ఎక్కువైందని అంటారు. దేని గురించైనా మాట్లాడితే చెత్తగా మాట్లాడానని అంటారు. ఏం మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే యాటిట్యూడ్ అంటారు. అసలుం నేనేం చేసినా తప్పే అంటే ఎలా? చివరికి నేను గాలి పీల్చినా కూడా అందులో కూడా తప్పు వెతుకుతారేమో. అసలు వీళ్ల సమస్య ఏంటో అర్థం కాదు. నేను ఇండస్ట్రీలో ఉండాలా.. వెళ్లిపోవాలా.. ఆ విషయం అయినా సూటిగా చెబితే అలా చేయడానికి నేను రెడీ. ఎందుకు ఇంత నెగెటివిటీ చూపిస్తారో నాకు అర్థం కాదు’’ అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.
‘కాంతార’ సినిమాకు సంబంధించి తాను చేసిన కామెంట్ను పట్టుకుని వివాదం రాజేశారని.. నిజానికి ఆ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి మీద తనకు ఎంతో గౌరవం ఉందంటూ.. రిషబ్, రక్షిత్ కలిసి తనకు ‘కిరిక్’ పార్టీలో తొలి అవకాశం ఎలా ఇచ్చారో గుర్తు చేసుకుంది రష్మిక. ఈ సందర్భ:గా రిషబ్, రక్షిత్లను ఆమె సర్ అంటూ సంబోధించింది.
This post was last modified on January 22, 2023 9:16 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…