Movie News

వీరసింహారెడ్డి దర్శకుడి షాకింగ్ కబుర్లు

తన చిన్ననాటి అభిమాన హీరో బాలకృష్ణను దర్శకత్వం చేయాలనే కలను వీరసింహారెడ్డి ద్వారా గోపీచంద్ మలినేని తీర్చేసుకున్నాడు. పోటీలో ఉన్న సినిమాను దాటలేదనే విషయం పక్కనపెడితే రెండు వారాల లోపే అఖండ ఫుల్ రన్ ని దాటించడం ద్వారా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని కానుకగా ఇచ్చాడు. ముఖ్యంగా ఎలివేషన్ల విషయంలో ఫస్ట్ హాఫ్ ని డీల్ చేసిన విధానం అభిమానులకు బాగా నచ్చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సిస్టర్ సెంటిమెంట్, వయొలెన్స్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే వంద కోట్ల మార్కుని తేలికగా అందుకునే ఛాన్స్ ఉందని ఫాన్స్ ఫీలవుతున్నారు.

ఇదంతా ఎలా ఉన్నా మూవీ సక్సెస్ అయ్యింది కాబట్టి ఆ ఆనందం ఇచ్చే కిక్ ముందు ఇలాంటివి చిన్నవిగానే కనిపిస్తున్నాయి. దీని ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో మలినేని పలు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నాడు. అందులో మొదటిది భీమ్లా నాయక్ ఆఫర్. మళయాలం సూపర్ హిట్ అయ్యప్పనుం కోశియుమ్ ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు డైరెక్షన్ కోసం మొదటి పిలుపు వెళ్ళింది గోపీచంద్ మలినేనికే. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సరైన అవకాశం ఎదురు చూస్తున్న ఇతనికి అదెందుకో ముందుకు వెళ్లలేకపోయింది. ఈలోగా వీరసింహారెడ్డి ఆఫర్ తలుపు తట్టింది.

మలినేనికి తెలియని ఏవో కారణాల వల్ల భీమ్లా నాయక్ సాగర్ కె చంద్రకు వెళ్లిపోయింది. ఇదే కాదు మరికొన్ని విశేషాలు పంచుకున్న గోపీచంద్ క్రాక్ విడుదల రోజు ఆర్థిక కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమైతే తనకు రావాల్సిన డెబ్భై అయిదు లక్షల బాకీని అడగకుండా ముందు ల్యాబ్ నుంచి బయటికి వచ్చేందుకు కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఆ మొత్తం పూర్తిగా అందకపోయినా మరో రూపంలో దేవుడు ఇస్తాడనే నమ్మకంతో అంత రిస్క్ చేసినట్టు వివరించాడు. సక్సెస్ ఉన్న డైరెక్టర్లకు అసలెలాంటి సమస్యలు ఉండవనుకుంటాం కానీ ఈ ఉదాహరణ చూస్తే అర్థమైపోదు తెరవెనుక ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయో.

This post was last modified on January 22, 2023 2:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

2 hours ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

3 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

5 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

5 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

6 hours ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

6 hours ago