బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కథానాయిక కంగనా రనౌత్. కెరీర్లో కొన్నేళ్లు రెగ్యులర్ గ్లామర్ రోల్సే చేసిన ఆమె.. క్వీన్ దగ్గర్నుంచి రూటు మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెరగడంతో ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం అయింది. మణికర్ణిక లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ను మరింత పెంచాయి. కానీ ఆ తర్వాత కంగనాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
గత ఏడాది కంగనా ప్రధాన పాత్ర పోషించిన ధకడ్ పెద్ద డిజాస్టర్ అయింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల నుంచి పదో వంతు కూడా వసూలు చేయలేకపోయింది. అయినా సరే.. కంగనా తగ్గట్లేదు. మళ్లీ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని లైన్లో పెట్టింది. అదే.. ఎమర్జెన్సీ. ఈ చిత్రానికి దర్శకురాలు, నిర్మాత కూడా కంగనానే. ఈ సినిమా కోసం తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టినట్లుగా కంగనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
అనేక కష్ట నష్టాలకు ఓర్చి తాను ఎమర్జెన్సీ సినిమా తీసినట్లు కంగనా తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు ఎమర్జెన్సీ షూట్ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుత ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం నేను ఏ కష్టం పడలేదని అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవం వేరు. నాకు సంబంధించిన ఆస్తులన్నీ ఈ సినిమా కోసం తాకట్టు పెట్టాను.
ఇక ఆరోగ్య పరంగా ఈ సినిమా చేస్తూ చాలా ఇబ్బంది పడ్డాను. డెంగీ బారిన పడి రక్త కణాల సంఖ్య భారీగా పడిపోయింది. అయినా తట్టుకుని నిలబడ్డాను. షూటింగ్కు హాజరయ్యాను. ఈ సమస్యను అధిగమించడం చాలా కష్టమైంది. ఇది నాకు పునర్జన్మ అని కంగనా పేర్కొంది. ఐతే ఈ సినిమాకు కంగనా పేరు నిర్మాతగా పడ్డప్పటికీ ఎమర్జెన్సీ కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబట్టి ఈ సినిమాకు బీజేపీ ఫండింగ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు.
This post was last modified on January 21, 2023 10:17 pm
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…