బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన కథానాయిక కంగనా రనౌత్. కెరీర్లో కొన్నేళ్లు రెగ్యులర్ గ్లామర్ రోల్సే చేసిన ఆమె.. క్వీన్ దగ్గర్నుంచి రూటు మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెరగడంతో ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం అయింది. మణికర్ణిక లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ను మరింత పెంచాయి. కానీ ఆ తర్వాత కంగనాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
గత ఏడాది కంగనా ప్రధాన పాత్ర పోషించిన ధకడ్ పెద్ద డిజాస్టర్ అయింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల నుంచి పదో వంతు కూడా వసూలు చేయలేకపోయింది. అయినా సరే.. కంగనా తగ్గట్లేదు. మళ్లీ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని లైన్లో పెట్టింది. అదే.. ఎమర్జెన్సీ. ఈ చిత్రానికి దర్శకురాలు, నిర్మాత కూడా కంగనానే. ఈ సినిమా కోసం తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టినట్లుగా కంగనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
అనేక కష్ట నష్టాలకు ఓర్చి తాను ఎమర్జెన్సీ సినిమా తీసినట్లు కంగనా తెలిపింది. ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు ఎమర్జెన్సీ షూట్ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుత ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం నేను ఏ కష్టం పడలేదని అందరూ అనుకుంటున్నారు. కానీ వాస్తవం వేరు. నాకు సంబంధించిన ఆస్తులన్నీ ఈ సినిమా కోసం తాకట్టు పెట్టాను.
ఇక ఆరోగ్య పరంగా ఈ సినిమా చేస్తూ చాలా ఇబ్బంది పడ్డాను. డెంగీ బారిన పడి రక్త కణాల సంఖ్య భారీగా పడిపోయింది. అయినా తట్టుకుని నిలబడ్డాను. షూటింగ్కు హాజరయ్యాను. ఈ సమస్యను అధిగమించడం చాలా కష్టమైంది. ఇది నాకు పునర్జన్మ అని కంగనా పేర్కొంది. ఐతే ఈ సినిమాకు కంగనా పేరు నిర్మాతగా పడ్డప్పటికీ ఎమర్జెన్సీ కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబట్టి ఈ సినిమాకు బీజేపీ ఫండింగ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు.
This post was last modified on January 21, 2023 10:17 pm
2009 ఐపీఎల్ సీజన్కు సంబంధించిన విదేశీ మార్పిడి నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి…
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈసారి ఏకంగా జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.…
భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా…
బాలయ్య నిన్న జరిగిన NBK 111 షూటింగ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రమైన గాయం కాకపోవడంతో అభిమానులు…
ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో…
‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన…