Movie News

సినిమా కోసం కంగ‌నా ఆస్తుల తాక‌ట్టు

బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన క‌థానాయిక కంగ‌నా ర‌నౌత్. కెరీర్లో కొన్నేళ్లు రెగ్యుల‌ర్ గ్లామ‌ర్ రోల్సే చేసిన ఆమె.. క్వీన్ ద‌గ్గ‌ర్నుంచి రూటు మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పెర‌గ‌డంతో ఆ త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కే ప‌రిమితం అయింది. మ‌ణిక‌ర్ణిక లాంటి సినిమాలు ఆమె ఇమేజ్‌ను మ‌రింత పెంచాయి. కానీ ఆ త‌ర్వాత కంగ‌నాకు వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి.

గ‌త ఏడాది కంగ‌నా ప్ర‌ధాన పాత్ర పోషించిన ధ‌క‌డ్ పెద్ద డిజాస్ట‌ర్ అయింది. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ చిత్రం థియేట‌ర్ల నుంచి ప‌దో వంతు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది. అయినా స‌రే.. కంగ‌నా త‌గ్గ‌ట్లేదు. మ‌ళ్లీ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని లైన్లో పెట్టింది. అదే.. ఎమ‌ర్జెన్సీ. ఈ చిత్రానికి ద‌ర్శ‌కురాలు, నిర్మాత కూడా కంగ‌నానే. ఈ సినిమా కోసం త‌న ఆస్తుల‌న్నీ తాక‌ట్టు పెట్టిన‌ట్లుగా కంగ‌నా ఓ ఇంటర్వ్యూలో వెల్ల‌డించ‌డం విశేషం.

అనేక క‌ష్ట న‌ష్టాల‌కు ఓర్చి తాను ఎమ‌ర్జెన్సీ సినిమా తీసిన‌ట్లు కంగ‌నా తెలిపింది. ఎమ‌ర్జెన్సీ సినిమా షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు ఎమ‌ర్జెన్సీ షూట్ పూర్తి చేశాను. నా జీవితంలో అద్భుత ఘ‌ట్టం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా కోసం నేను ఏ క‌ష్టం ప‌డ‌లేద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ వాస్త‌వం వేరు. నాకు సంబంధించిన ఆస్తుల‌న్నీ ఈ సినిమా కోసం తాక‌ట్టు పెట్టాను.

ఇక ఆరోగ్య ప‌రంగా ఈ సినిమా చేస్తూ చాలా ఇబ్బంది ప‌డ్డాను. డెంగీ బారిన ప‌డి ర‌క్త క‌ణాల సంఖ్య భారీగా ప‌డిపోయింది. అయినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాను. షూటింగ్‌కు హాజ‌ర‌య్యాను. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డం చాలా క‌ష్ట‌మైంది. ఇది నాకు పున‌ర్జ‌న్మ అని కంగ‌నా పేర్కొంది. ఐతే ఈ సినిమాకు కంగ‌నా పేరు నిర్మాత‌గా పడ్డ‌ప్ప‌టికీ ఎమ‌ర్జెన్సీ కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకం కాబ‌ట్టి ఈ సినిమాకు బీజేపీ ఫండింగ్ చేస్తున్న‌ట్లు భావిస్తున్నారు.

This post was last modified on January 21, 2023 10:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

47 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago