విపరీతమైన అంచనాలు మోసుకుని రిలీజైన రోజు కొంత మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ అవతార్ 2 ది వే అఫ్ వాటర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసింది. ఇప్పటిదాకా మన దేశంలో టాప్ 1 గ్రాసర్ గా ఉన్న హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్. 2019లో రిలీజైన ఈ సూపర్ హీరోస్ ఎంటర్ టైనర్ వసూలు చేసిన మొత్తం గ్రాస్ 438 కోట్లు కాగా అన్ని ఖర్చులు పోను నెట్ 367 కోట్లు. ఇప్పుడు అవతార్ 2 దాన్ని పెద్ద మార్జిన్ తో దాటేసింది. జేమ్స్ క్యామరూన్ విజువల్ వండర్ గ్రాస్ రూపంలో 475 కోట్లు తేగా నెట్ 368 కోట్ల 20 లక్షలు దాటేసింది. సో నెంబర్ వన్ స్థానం అఫీషియల్ గా దక్కేసింది.
నెల రోజులు పూర్తయినప్పటికీ అవతార్ 2 చాలా చోట్ల మంచి రన్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా నార్త్ లో అజయ్ దేవగన్ దృశ్యం 2 తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ సినిమా కనీస స్థాయిలో ఆడలేకపోవడంతో ఆ అడ్వాంటేజ్ ని అవతార్ 2 పూర్తిగా వాడుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని దూకుడు ఓ రేంజ్ లో సాగింది. ఇప్పటికీ హైదరాబాద్ మెయిన్ మల్టీప్లెక్సుల్లో హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. బాలకృష్ణ ఏరికోరి మరీ ప్రసాద్ లార్జ్ స్క్రీన్ షో చూశారంటే దీని ఫీవర్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఈ త్రీడి మాయాజాలాన్ని ఎంజాయ్ చేశారు.
పఠాన్ వస్తున్న తరుణంలో స్పీడ్ తగ్గుతుందేమో కానీ అవతార్ 2 ఫైనల్ రన్ మాత్రం ఇంకో రెండు మూడు వారాలు ఖచ్చితంగా ఉంటుంది. ఫిబ్రవరిలో ఓటిటి ప్రీమియర్ ఉండొచ్చనే లీక్ ఆల్రెడీ వచ్చేసింది. అదే జరిగితే అక్కడా వ్యూస్ పరంగా రికార్డుల ఊచకోత ఖాయం. వరల్డ్ వైడ్ ఇప్పటికే 2022 నెంబర్ వన్ గా ఉన్న టాప్ గన్ మావరిక్ ని దాటేసిన అవతార్ రెండు బిలియన్ డాలర్లను ఈ రెండు మూడు రోజుల్లో అనుకోనుంది. మన ఆడియన్స్ ఇంగ్లీష్ సినిమాల పట్ల ఎంత క్రేజీగా ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10న రాబోతున్న టైటానిక్ రీ రిలీజ్ కు ఘనస్వాగతం చెప్పేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు
This post was last modified on January 21, 2023 6:46 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…