ఈ మధ్య కాలంలో దక్షిణాదిన సెన్సేషన్ క్రియేట్ చేసిన చిన్న సినిమా అంటే ‘లవ్ టుడే’ అనే చెప్పాలి. దర్శకుడిగా ఒక సినిమా అనుభవం ఉన్న ప్రదీప్ రంగనాథన్ అనే కుర్రాడు.. తనే హీరోగా నటిస్తూ రూపొందించిన ఈ చిత్రం తమిళనాట సంచలనం రేపింది. పెద్ద సినిమాల రేంజిలో వసూళ్లు కొల్లగొట్టింది.
ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తే.. ఇక్కడా మంచి ఫలితమే అందుకుంది. ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమైన ఒక యువ జంట.. అమ్మాయి తండ్రి కండిషన్ మేరకు ఒక రోజు తమ ఇద్దరి ఫోన్లు మార్చుకోవడం.. తత్ఫలితంగా ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో చాలా సరదాగా, ఉత్కంఠభరితంగా సాగిపోయిన చిత్రమిది. ఈ ఐడియాతో ఇప్పటి యువత బాగా రిలేట్ అయ్యారు. తమ జీవితంలోనూ ఇలా జరిగితే ఎలా ఉంటుందనే ఊహ చాలామందికి వచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఐతే తమిళనాట ఒక యువ జంట ‘లవ్ టుడే’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఫోన్లు మార్చుకోవడంతో తీవ్ర పరిణామాలు తలెత్తి.. చివరికి వారి పెళ్లి రద్దయిపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన అరవింద్కు ఒక అమ్మాయితో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది.
పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ‘లవ్ టుడే’ స్ఫూర్తితో ఇద్దరూ ఫోన్లు మార్చుకున్నారు. ఐతే అరవింద్ మొబైల్ను చెక్ చేస్తుండగా.. అందులో నగ్నంగా ఉన్న ఒక బాలిక వీడియో కనిపించడంతో అమ్మాయి షాక్ తింది.
ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న ఆ అమ్మాయి అరవింద్తో పెళ్లినే రద్దు చేసుకుంది. వీడియోలో ఉన్న బాలికకు కూడా ఈ విషయం చెప్పిందట. విషయం పెద్దదిగా మారి పోలీసులు అరవింద్ను అరెస్టు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…