ఈ మధ్య కాలంలో దక్షిణాదిన సెన్సేషన్ క్రియేట్ చేసిన చిన్న సినిమా అంటే ‘లవ్ టుడే’ అనే చెప్పాలి. దర్శకుడిగా ఒక సినిమా అనుభవం ఉన్న ప్రదీప్ రంగనాథన్ అనే కుర్రాడు.. తనే హీరోగా నటిస్తూ రూపొందించిన ఈ చిత్రం తమిళనాట సంచలనం రేపింది. పెద్ద సినిమాల రేంజిలో వసూళ్లు కొల్లగొట్టింది.
ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తే.. ఇక్కడా మంచి ఫలితమే అందుకుంది. ప్రేమలో పడి పెళ్లికి సిద్ధమైన ఒక యువ జంట.. అమ్మాయి తండ్రి కండిషన్ మేరకు ఒక రోజు తమ ఇద్దరి ఫోన్లు మార్చుకోవడం.. తత్ఫలితంగా ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో చాలా సరదాగా, ఉత్కంఠభరితంగా సాగిపోయిన చిత్రమిది. ఈ ఐడియాతో ఇప్పటి యువత బాగా రిలేట్ అయ్యారు. తమ జీవితంలోనూ ఇలా జరిగితే ఎలా ఉంటుందనే ఊహ చాలామందికి వచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఐతే తమిళనాట ఒక యువ జంట ‘లవ్ టుడే’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఫోన్లు మార్చుకోవడంతో తీవ్ర పరిణామాలు తలెత్తి.. చివరికి వారి పెళ్లి రద్దయిపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన అరవింద్కు ఒక అమ్మాయితో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది.
పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ‘లవ్ టుడే’ స్ఫూర్తితో ఇద్దరూ ఫోన్లు మార్చుకున్నారు. ఐతే అరవింద్ మొబైల్ను చెక్ చేస్తుండగా.. అందులో నగ్నంగా ఉన్న ఒక బాలిక వీడియో కనిపించడంతో అమ్మాయి షాక్ తింది.
ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న ఆ అమ్మాయి అరవింద్తో పెళ్లినే రద్దు చేసుకుంది. వీడియోలో ఉన్న బాలికకు కూడా ఈ విషయం చెప్పిందట. విషయం పెద్దదిగా మారి పోలీసులు అరవింద్ను అరెస్టు చేసే వరకు పరిస్థితి వెళ్లింది.
This post was last modified on January 21, 2023 3:13 pm
తెలుగులో ఒకప్పుడు ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న తమిళ కథానాయకుడు సూర్య. చాలా ఏళ్ల…
ఉత్తరాదిలో బలంగా పాతుకుపోయిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలని చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో కొంతవరకు సఫలమైనప్పటికీ…
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది కానీ ప్యారడైజ్ మీద క్షేత్ర స్థాయిలో ఎంత బజ్…
గత కొన్ని నెలలుగా తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష చిత్రం ‘ఉరిశిక్ష’పై ఎంత పెద్ద డిబేట్ కు తెరలేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.…
చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా…