వేణు ఉడుగుల అని ఒక అభిరుచి ఉన్న దర్శకుడు. తొలి సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’తో అతడి ప్రతిభేంటో ఇటు ఇండస్ట్రీ జనాలకు, అటు ప్రేక్షకులకు బాగానే అర్థమైంది. ఆ సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడికి మంచి పేరొచ్చింది.
అతడి టాలెంట్ గుర్తించి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి లాంటి పేరున్న నిర్మాతలు రానా-సాయిపల్లవిల క్రేజీ కాంబినేషన్లో సినిమా తీసే అవకాశం ఇచ్చారు. కానీ దీన్ని వేణు ఉపయోగించుకోలేకపోయాడు. మంచి బడ్జెట్లో, బాగా టైం తీసుకుని అతను తీసిన ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.
ఈసారి ప్రశంసలతో పాటు భారీ నష్టం మిగిలింది నిర్మాతలకు. కమర్షియల్ ఫార్మాట్కు చాలా దూరంగా.. ట్రాజిక్ క్లైమాక్స్తో హార్డ్ హిట్టింగ్గా తీసిన ఈ చిత్రం మెజారిటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో దీని మీద పెట్టుబడి పెట్టిన నిర్మాతలు గట్టి దెబ్బే తిన్నారు.
ఈ దెబ్బతో వేణుకు టాలీవుడ్లో ఇంకో అవకాశం దక్కడం కష్టమే అనుకున్నారు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో వేణు అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. తొలి రెండు సినిమాల్లా సందేశాలు, సామాజికాంశాల జోలికి వెళ్లకుండా ఈసారి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేయడానికి వేణు రెడీ అవుతున్నాడట. ‘భీమ్లా నాయక్’ తరహాలో సితార బేనర్లో అతనో మల్టీస్లారర్ తీయనున్నాడట.
ఇది ఒక నడి వయస్కుడికి, ఒక కుర్రాడికి మధ్య సాగే పోరు నేపథ్యంలో సాగే సినిమా అట. చాలా ఇంటెన్స్గా కథ నడుస్తుందట. అదే సమయంలో కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా చూసుకోనున్నారట. స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు నటులు ఇందులో నటించాల్సి ఉందని.. అందులో ఒకరు తమిళం నుంచి ఉండొచ్చని కూడా అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచన కూడా చేస్తున్నారట. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
This post was last modified on January 21, 2023 7:56 am
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…