Movie News

చేతులు కాలాక కమర్షియల్ సినిమా

వేణు ఉడుగుల అని ఒక అభిరుచి ఉన్న దర్శకుడు. తొలి సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’తో అతడి ప్రతిభేంటో ఇటు ఇండస్ట్రీ జనాలకు, అటు ప్రేక్షకులకు బాగానే అర్థమైంది. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడికి మంచి పేరొచ్చింది.

అతడి టాలెంట్ గుర్తించి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి లాంటి పేరున్న నిర్మాతలు రానా-సాయిపల్లవిల క్రేజీ కాంబినేషన్లో సినిమా తీసే అవకాశం ఇచ్చారు. కానీ దీన్ని వేణు ఉపయోగించుకోలేకపోయాడు. మంచి బడ్జెట్లో, బాగా టైం తీసుకుని అతను తీసిన ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది.

ఈసారి ప్రశంసలతో పాటు భారీ నష్టం మిగిలింది నిర్మాతలకు. కమర్షియల్ ఫార్మాట్‌కు చాలా దూరంగా.. ట్రాజిక్ క్లైమాక్స్‌తో హార్డ్ హిట్టింగ్‌గా తీసిన ఈ చిత్రం మెజారిటీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో దీని మీద పెట్టుబడి పెట్టిన నిర్మాతలు గట్టి దెబ్బే తిన్నారు.

ఈ దెబ్బతో వేణుకు టాలీవుడ్లో ఇంకో అవకాశం దక్కడం కష్టమే అనుకున్నారు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో వేణు అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. తొలి రెండు సినిమాల్లా సందేశాలు, సామాజికాంశాల జోలికి వెళ్లకుండా ఈసారి పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా చేయడానికి వేణు రెడీ అవుతున్నాడట. ‘భీమ్లా నాయక్’ తరహాలో సితార బేనర్లో అతనో మల్టీస్లారర్ తీయనున్నాడట.

ఇది ఒక నడి వయస్కుడికి, ఒక కుర్రాడికి మధ్య సాగే పోరు నేపథ్యంలో సాగే సినిమా అట. చాలా ఇంటెన్స్‌గా కథ నడుస్తుందట. అదే సమయంలో కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా చూసుకోనున్నారట. స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు నటులు ఇందులో నటించాల్సి ఉందని.. అందులో ఒకరు తమిళం నుంచి ఉండొచ్చని కూడా అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచన కూడా చేస్తున్నారట. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

This post was last modified on January 21, 2023 7:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

3 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

4 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

4 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

4 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

5 hours ago