ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత్ తరఫున కచ్చితంగా ‘ఆర్ఆర్ఆర్’యే అధికారిక ఎంట్రీగా అవకాశం దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నియమించిన జ్యూరీ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రశంసలు దక్కించుకున్న రాజమౌళి సినిమాను కాదని.. ‘చెల్లే షో’ అనే గుజరాతీ సినిమాను భారత్ తరఫున ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసింది. ఈ విషయమై పరిశ్రమ ప్రముఖులు చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సాధారణ అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు.
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నా ఆ సినిమాను పక్కన పెట్టడం విమర్శలకు దారి తీసింది. ఐతే ఈ సంగతి పట్టించుకోకుండా చిత్ర బృందం మాత్రం స్వతంత్రంగా వివిధ విభాగాలకు సినిమాను పోటీకి నిలిపింది. జ్యూరీ తమ సినిమాను విస్మరించడంపై ఇప్పటిదాకా రాజమౌళి సహా ‘ఆర్ఆర్ఆర్’ టీంలో ఎవ్వరూ స్పందించింది లేదు.
ఐతే తాజాగా రాజమౌళే ఈ విషయమై పెదవి విప్పాడు. దేశం తరఫున ‘ఆర్ఆర్ఆర్’ అధికారిక ఎంట్రీ దక్కించుకోకపోవడంపై తాను బాధపడ్డట్లు రాజమౌళి వెల్లడించాడు.
‘‘దేశం తరఫున అధికారిక ఎంట్రీ సాధించకపోవడం పట్ల నిరాశ చెందాను. ఐతే ఎంట్రీ ఎందుకు సాధించలేకపోయాం అని అదే విషయం గురించి ఆలోచించే వ్యక్తులం కాదు మేము. జరిగిందేదో జరిగిపోయింది. మనం ముందుకు సాగిపోవాలి. మన దేశం నుంచి ‘చెల్లే షో’ ఆస్కార్కు నామినేట్ కావడం, షార్ట్ లిస్ట్ కావడం పట్ల నాకు సంతోషమే. ఆర్ఆర్ఆర్ను ఇండియా తరఫున అధికారికంగా నామినేట్ చేసి ఉంటే బాగుంటుందని విదేశీయులు సైతం అనుకుంటున్నారు. కానీ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎలా ఆలోచిస్తుంది.. దాని నియమ నిబంధనలేంటి అన్నది నాకు తెలియదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు’’ అని జక్కన్న స్పష్టం చేశాడు. ఆస్కార్ అవార్డుల్లో ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులకు నాటు నాటు, రాజమౌళి ఎంపిక కావచ్చన్న అంచనాలున్నాయి.
This post was last modified on January 20, 2023 6:53 pm
పెద్ది కౌంట్ డౌన్ నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టేందుకు రామ్…
దక్షిణాది సినీ రంగంలో ఒక ధృవతార రాలిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆర్.బి.చౌదరి కన్ను…
అది మార్చి.. ఎన్నికలకు 50 రోజులకు పైగానే సమయం ఉంది. సర్వేల సంస్థలు ప్రజలను కలుస్తున్నాయి. మీకు ఏ సీఎం…
తమిళనాడులో విజయ్ జయకేతనం ఎగరేశాక సినిమా తారల రాజకీయ ప్రభావం గురించి మళ్ళీ చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ముగ్గురు లెజెండ్స్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అందరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఒకటే.…
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ఇన్నాళ్లూ జరిగిన ప్రచారంలో అస్సలు నిజం లేదని తేలిపోయింది.…