సరైన కారణం ఏమీ ఉండదు.. ఏదో ఒక చిన్న కామెంట్ను పట్టుకుని గొడవ చేస్తారు. ఎన్నో ఏళ్ల ముందు చేసిన కామెంట్లను కూడా ఇప్పుడు తెరపైకి తెచ్చి నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తారు. సినిమాతో ఏమాత్రం సంబంధం లేని విషయాలపై కాంట్రవర్శీ రాజేసి సినిమాను బాయ్కాట్ చేద్దాం అంటారు. ఏడాది కాలంగా సోషల్ మీడియాలో ఒక వర్గం సినిమా బాయ్కాట్ పేరుతో చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు.
‘లాల్ సింగ్ చడ్డా’ సహా పలు చిత్రాలను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో రోజుల తరబడి నెగెటివిటీని స్ప్రెడ్ చేసి ఆ సినిమాలను దెబ్బ తీయడం చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా ఒక సినిమాను వీళ్లు కిల్ చేసేస్తారని చెప్పలేం కానీ.. అదే పనిగా నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం ద్వారా కొంత మేర డ్యామేజ్ అయితే చేయగలిగారు. వీళ్లను ఎలా డీల్ చేయాలో తెలియక తలలు పట్టేసుకున్నారు బాలీవుడ్ ప్రముఖులు. వీళ్ల తీరును ఖండించి, విభేదించిన వాళ్ల సినిమాలను సైతం టార్గెట్ చేయడం గమనార్హం.
ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏదో ఒక దశలో మార్పు తప్పదు. ఇప్పుడు అదే జరుగుతోంది. కొన్ని నెలల నుంచి అదే పనిగా షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ను టార్గెట్ చేస్తూ వచ్చిన బాయ్కాట్ బ్యాచ్కు ఇప్పుడు ప్రేక్షకులే బుద్ధి చెబుతున్నారు. హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయ డ్రెస్ వేసుకుని ఎక్స్పోజింగ్ చేసిందనే సిల్లీ రీజన్తో ఆ సినిమాను కొన్ని వారాల పాటు టార్గెట్ చేయడం.. చివరికి ఆ పాటను ఎడిట్ చేసుకోవాల్సిన పరిస్థితిని చిత్ర బృందానికి కల్పించడం సామాన్య ప్రేక్షకుల్లో సానుభూతి పెంచినట్లు కనిపిస్తోంది. అందుకే బాయ్కాట్ బ్యాచ్ పీచమణిగేలా ఈ సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ ఇస్తున్నారు.
రికార్డు స్తాయిలో టికెట్లు తెగుతుండడంతో ‘పఠాన్’కు ఓపెనింగ్స్ మామూలుగా ఉండబోవని అర్థమవుతోంది. సినిమాకు టాక్ బాగుంటే షారుఖ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావడం లాంఛనమే అనిపిస్తోంది. ఈ దెబ్బతో బాయ్కాట్ బ్యాచ్కు దాదాపుగా కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఇక ఏ సినిమాను వాళ్లు టార్గెట్ చేసినా ప్రేక్షకులు ఊరుకునేలా లేరు. కాబట్టి బాలీవుడ్ బెంగ తీరినట్లే భావించవచ్చు.
This post was last modified on January 20, 2023 6:46 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…