‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎవ్వరూ ఊహించని విధంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపింది. ‘బాహుబలి’ని పెద్దగా పట్టించుకోని ఇంటర్నేషనల్ ఆడియన్స్.. ఈ సినిమాకు మామూలుగా కనెక్టవలేదు. ముఖ్యంగా నేటివ్ అమెరికన్స్, హాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ప్రపంచ మేటి ఫిలిం మేకర్స్ రాజమౌళిని ఎలా ఆకాశానికెత్తేస్తున్నారో తెలిసిందే. తర్వాత ఆయన తీసే సినిమా కోసం వాళ్లంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో జక్కన్నకు చాలా పెద్ద మార్కెట్టే క్రియేటైంది. మహేష్ బాబుతో ఆయన చేయబోయే సినిమాకు ఆకాశమే హద్దు అనడంలో సందేహం లేదు. కాబట్టి ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నింటికీ మించి దీనిపై జక్కన్న ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. జక్కన్న ఆ పనిలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది.
గత కొన్ని నెలల నుంచి ఓవైపు మహేష్ సినిమా కోసం స్క్రిప్టు రెడీ చేస్తూనే.. ప్రి ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ కోసం భారీ ప్రణాళికలే వేస్తున్నాడు జక్కన్న. కాస్టింగ్ ఇతర అవసరాల కోసం క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (సీసీఏ)తో రాజమౌళి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ధ్రువీకరించాడు.
మహేష్తో తాను చేయబోయే సినిమాకు అంతర్జాతీయ ఆర్టిస్టుల అవసరం పడుతుందని.. అలాగే గ్రాషిక్స్, ఇతర అవసరాలకు ప్రొఫెషనల్స్ను ఎంచుకునేందుకు గాను ‘సీసీఏ’తో ఒప్పందం జరిగిందని.. ఆ దిశగా ఆ సంస్థతో తన టీం పని చేస్తోందని తెలిపాడు జక్కన్న. దీన్ని బట్టి చూస్తుంటే.. ఇప్పటిదాకా తన సినిమాలకు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ సాయం తీసుకున్నప్పటికీ, మహేష్ సినిమాకు మరింత ప్రొఫెషనల్గా వెళ్లబోతున్నాడని.. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల తోడ్పాటుతూ దీన్ని పక్కా ఇంటర్నేషనల్ మూవీగా తీర్చిదిద్దబోతున్నాడని.. ఇది మరో స్థాయి సినిమా అని పక్కాగా అర్థమవుతోంది. జక్కన్నతో మహేష్ సినిమా ఆలస్యం అయితే అయింది కానీ.. ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టబోతున్నారన్నది స్పష్టం.
This post was last modified on January 20, 2023 5:00 pm
బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…
మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…
"ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల…
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…