మంచు మనోజ్ ఒకప్పుడు టాలీవుడ్లో బాగా యాక్టివ్గా ఉన్న యువ కథానాయకుల్లో ఒకడు. ‘దొంగ దొంగది’ సినిమాతో హీరోగా పరిచయం అయిన దగ్గర్నుంచి విరామం లేకుండా సినిమాలు చేశాడు. ఒక టైంలో ఏడాదికి రెండు సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. అలాంటి హీరో నుంచి ఐదేళ్లకు పైగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాకపోవడం అనూహ్యం. మనోజ్ చివరి సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ 2017 చివర్లో విడుదలైంది. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాల్లో అతిథి పాత్రలు చేశాడే తప్ప హీరోగా ఒక్క సినిమా కూడా చేయలేదు మనోజ్.
రెండేళ్ల కిందట ఒక సినిమాకు కమిటై.. ఆ తర్వాత ఆ సినిమాను ఘనంగా అనౌన్స్ చేయడం తెలిసిందే. ‘ఎంఎం ఆర్ట్స్’ అంటూ సొంతంగా బేనర్ పెట్టుకుని శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో మనోజ్ మొదలుపెట్టిన ఆ చిత్రమే.. అహం బ్రహ్మాస్మి. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నట్లు ఘనంగా ప్రకటించి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు మనోజ్.
‘అహం బ్రహ్మాస్మి’ ఆగిపోయినట్లు మనోజ్.. ఈ మధ్య వేసిన ఒక ట్వీట్తో అర్థమైంది జనాలకు. కాగా మనోజ్ ఇప్పుడు కొత్తగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ చిత్రమే.. వాట్ ద ఫిష్. దీనికి ‘మనం మనం బరంపురం’ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా పెట్టాడు మనోజ్. ఈ సినిమా టైటిల్, ప్రి లుక్, క్యాప్షన్ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మనోజ్ ఒక క్రేజీ రైడ్కు రెడీ అవుతున్నట్లే అనిపిస్తోంది. ఈ చిత్ర దర్శకుడి అసలు పేరేంటో ఏమో కానీ.. పోస్టర్ మీద మాత్రం జస్ట్ ‘వి’ అని వేశారు. మనోజ్ సొంత బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రి లుక్ పోస్టర్తో మనోజ్ బాగానే జనాల దృష్టిని ఆకర్షించగలిగాడు.
మళ్లీ అతను ‘నేను మీకు తెలుసా’.. ‘మిస్టర్ నూకయ్య’ రోజులకు అభిమానులను తీసుకెళ్లాడనే చెప్పాలి. ఆ సినిమాలు కూడా చాలా క్రేజీగా అనిపిస్తూ జనాల దృష్టిని ఆకర్షించాయి. ఫైనల్ రిజల్ల్ ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. కాకపోతే ఇప్పుడు మనోజ్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతడి సినిమా కోసం జనాలకు థియేటర్లకు రప్పించడం అంత తేలిక కాదు. ముందు ‘అహం బ్రహ్మాస్మి’లాగా ఆరంభ శూరత్వానికి పరిమితం కాకుండా.. సినిమాను ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం. మనోజ్ ఈసారి చేతులెత్తేయడని ఆశిద్దాం.
This post was last modified on January 20, 2023 5:04 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…