మంచు మనోజ్ ఒకప్పుడు టాలీవుడ్లో బాగా యాక్టివ్గా ఉన్న యువ కథానాయకుల్లో ఒకడు. ‘దొంగ దొంగది’ సినిమాతో హీరోగా పరిచయం అయిన దగ్గర్నుంచి విరామం లేకుండా సినిమాలు చేశాడు. ఒక టైంలో ఏడాదికి రెండు సినిమాలు కూడా రిలీజ్ చేశాడు. అలాంటి హీరో నుంచి ఐదేళ్లకు పైగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాకపోవడం అనూహ్యం. మనోజ్ చివరి సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ 2017 చివర్లో విడుదలైంది. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాల్లో అతిథి పాత్రలు చేశాడే తప్ప హీరోగా ఒక్క సినిమా కూడా చేయలేదు మనోజ్.
రెండేళ్ల కిందట ఒక సినిమాకు కమిటై.. ఆ తర్వాత ఆ సినిమాను ఘనంగా అనౌన్స్ చేయడం తెలిసిందే. ‘ఎంఎం ఆర్ట్స్’ అంటూ సొంతంగా బేనర్ పెట్టుకుని శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో మనోజ్ మొదలుపెట్టిన ఆ చిత్రమే.. అహం బ్రహ్మాస్మి. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నట్లు ఘనంగా ప్రకటించి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు మనోజ్.
‘అహం బ్రహ్మాస్మి’ ఆగిపోయినట్లు మనోజ్.. ఈ మధ్య వేసిన ఒక ట్వీట్తో అర్థమైంది జనాలకు. కాగా మనోజ్ ఇప్పుడు కొత్తగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ చిత్రమే.. వాట్ ద ఫిష్. దీనికి ‘మనం మనం బరంపురం’ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా పెట్టాడు మనోజ్. ఈ సినిమా టైటిల్, ప్రి లుక్, క్యాప్షన్ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మనోజ్ ఒక క్రేజీ రైడ్కు రెడీ అవుతున్నట్లే అనిపిస్తోంది. ఈ చిత్ర దర్శకుడి అసలు పేరేంటో ఏమో కానీ.. పోస్టర్ మీద మాత్రం జస్ట్ ‘వి’ అని వేశారు. మనోజ్ సొంత బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రి లుక్ పోస్టర్తో మనోజ్ బాగానే జనాల దృష్టిని ఆకర్షించగలిగాడు.
మళ్లీ అతను ‘నేను మీకు తెలుసా’.. ‘మిస్టర్ నూకయ్య’ రోజులకు అభిమానులను తీసుకెళ్లాడనే చెప్పాలి. ఆ సినిమాలు కూడా చాలా క్రేజీగా అనిపిస్తూ జనాల దృష్టిని ఆకర్షించాయి. ఫైనల్ రిజల్ల్ ఎలా ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. కాకపోతే ఇప్పుడు మనోజ్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతడి సినిమా కోసం జనాలకు థియేటర్లకు రప్పించడం అంత తేలిక కాదు. ముందు ‘అహం బ్రహ్మాస్మి’లాగా ఆరంభ శూరత్వానికి పరిమితం కాకుండా.. సినిమాను ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం. మనోజ్ ఈసారి చేతులెత్తేయడని ఆశిద్దాం.
This post was last modified on January 20, 2023 5:04 pm
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…
అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…
టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…
ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…
బంగారంతో పోటీ పడుతున్నట్టుగా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్కడో కాదు. తెలంగాణలోనే !. రాష్ట్ర పారిశ్రామిక,…
హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది.…