తెలుగు సినిమాల వరకు ఈసారి సంక్రాంతి రేసులో ముందు వచ్చింది ‘వీరసింహారెడ్డి’నే. 11న తమిళ అనువాద చిత్రం ‘తెగింపు’ రిలీజ్ కాగా.. మరుసటి రోజు బాలయ్య సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. బాలయ్య చివరి సినిమా ‘అఖండ’తో పోలిస్తే ‘వీరసింహారెడ్డి’ తొలి రోజు రెట్టింపు వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. అది చూసి అందరూ బలుపు అనుకున్నారు కానీ.. తర్వాతే తెలిసింది వాపు అని.
శుక్రవారం ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్తో రెండో రోజు ఒక్కసారిగా థియేటర్లు తగ్గిపోయింది. ప్రేక్షకులకు ఇంకో మంచి ఆప్షన్ దొరికింది. ఇక అంతే.. ‘వీరసింహారెడ్డి’ జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వరకు శుక్రవారం వసూళ్లలో బిగ్ డ్రాప్ కనిపించింది. ‘వీరసింహారెడ్డి’ తొలి రోజు ఎలా జోరు చూపించిందో.. ‘వాల్తేరు వీరయ్య’ కూడా డే-1 అలాగే దూకుడు చూపిస్తోందని.. శనివారానికి రెండు సినిమాలూ సమానం అయిపోతాయని అనుకున్నారు.
కానీ అలా జరగలేదు. వాల్తేరు వీరయ్య ఏ దశలోనూ జోరు తగ్గించలేదు. నిలకడగా వసూళ్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేసింది. కానీ ‘వీరసింహారెడ్డి’ మాత్రం వసూళ్లు ఒకసారి ఒక స్థాయికి డ్రాప్ అయ్యాక అక్కడి నుంచి పుంజుకోలేదు. బి, సి సెంటర్లలో ఈ సినిమా వీకెండ్ తర్వాత కూడా మంచి వసూళ్లే రాబట్టింది కానీ.. ‘వాల్తేరు వీరయ్య’లా అన్ని చోట్లా నిలకడను చూపించలేకపోయింది. బి, సి సెంటర్లలో కూడా ‘వాల్తేరు వీరయ్య’తో పోలిస్తే ‘వీరసింహారెడ్డి’ వసూళ్లు తక్కువే.
థియేటర్లు తగ్గించేయడం, సరైన స్క్రీన్లు ఇవ్వకపోవడం వల్ల బాలయ్య సినిమాకు అన్యాయం జరిగిందన్న అభిమానుల్లో ఆక్రోశంలో కొంత నిజం లేకపోలేదు. కానీ అధిక డిమాండ్ ఉన్న చిరంజీవి సినిమాకు ఎక్కువ స్క్రీన్లు, షోలు నిలవడం మరిచిపోకూడదు. తొలి రోజు వేరే ఆప్షన్ లేక జనాలు ‘వీరసింహారెడ్డి’ని విరగబడి చూడడం.. బాలయ్య కెరీర్లోనే అత్యధిక రిలీజ్ దక్కడం వల్ల ఆ సినిమాకు అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. అది ఓవరాల్ వసూళ్లకు, రిజల్ట్కు కలిసొచ్చింది. అలా కాకుండా శుక్రవారం ‘వాల్తేరు వీరయ్య’తో పాటే రిలీజై ఉంటే మాత్రం సినిమా రిజల్ట్ వేరుగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య ముందొచ్చి మంచి పని చేశాడు.
This post was last modified on January 19, 2023 7:56 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…