Movie News

టికెట్ రేట్లు తగ్గిస్తేనే కలెక్షన్లు పెరిగేది

పండగ అయిపోయినా టికెట్ రేట్లు మాత్రం జీవో ప్రకారం పెంచినవే ఉండటంతో చాలా చోట్ల సంక్రాంతి సినిమాల కలెక్షన్లలో విపరీతమైన డ్రాప్ కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం కాదు. మొదటి నాలుగైదు రోజులంటే క్రేజ్, ఫ్యాన్స్ ఉత్సాహం, సెలవుల సందడి కాబట్టి ఓ నలభై యాభై ఎక్కువైనా జనం తట్టుకుంటారు. ఏపీలో కొంత నయం. పాతిక రూపాయలకే పరిమితం చేశారు. తెలంగాణలో పెరిగిన వంద ఇంకా అలాగే ఉంది. కానీ ఇప్పుడు కూడా కొనసాగించడం లాంగ్ రన్ ని దెబ్బ తీస్తుందని వసూళ్ల తగ్గుదల సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంకో వీకెండ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మౌనంగా ఉన్నారు.

మూవీ లవర్స్ డే పేరిట పివిఆర్ మల్టీప్లెక్స్ యాజమాన్యం జనవరి 20న టికెట్ కేవలం 99 రూపాయలకే అమ్ముతామని ఏ సినిమా అయినా ఇదే ఉంటుందని ప్రకటించింది. తీరా చూస్తే సీన్ ఇంకోలా ఉంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు హైదరాబాద్ కు సంబంధించి అసలు రేపటి బుకింగ్సే పివిఆర్ వి చూపించడం లేదు. కనీసం రెండు రోజుల ముందైనా పెట్టకపోతే ఎలా అనేది సగటు కామన్ పబ్లిక్ ప్రశ్న. మిగిలిన వాటిలో హైక్ ఇచ్చిన 295 చూపిస్తోంది. ఇది ఎప్పటిదాకా ఉంటుందో క్లారిటీ లేదు. పూర్తిగా సినిమా చల్లారేదాకాన లేక ఆర్ఆర్ఆర్ తరహాలో ఫైనల్ డే వరకు ఇదే పెడతారానేది అంతు చిక్కడం లేదు.

అసలే ఓటిటిలు భారీ సినిమాల షూటింగులు జరుగుతున్న టైంలోనే మేము ఫలానా ప్రాజెక్టు హక్కులు కోనేసాం చూడండంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం ఇలా వారాల తరబడి టికెట్ రేట్లను అదుపులో పెట్టలేకపోవడం బడా స్టార్లను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. సగటు మిడిల్ క్లాస్ పర్సుని ఇలా పెద్ద బడ్జెట్ చిత్రాలే భోజనం చేస్తే మీడియం రేంజ్ హీరోలవి వచ్చినప్పుడు ఆడియన్స్ లైట్ తీసుకుంటారు. అలా కాకుండా ఆలస్యంగా చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం వీలైనంత త్వరగా సాధారణ రేట్లు తీసుకురావడం అవసరం.

This post was last modified on January 19, 2023 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

30 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago