Movie News

మహేష్ రాజమౌళి కలయిక ఇప్పటిది కాదు

ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుంచే విపరీతమైన చర్చల్లో ఉన్న మహేష్ రాజమౌళి ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు మొదలవుతుందానే ఆసక్తి అభిమానుల్లో అంతకంతా పెరిగిపోతోంది. ఆర్ఆర్ఆర్ కు పలు అంతర్జాతీయ పురస్కారాలు వచ్చిన సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో జక్కన్న దీని ప్రస్తావన తెస్తున్నారు. ఇది పదేళ్ల నుంచి పెండింగ్ ఉన్న సినిమా అని ఇప్పటికి కుదిరిందని అన్నారు. అంటే బాహుబలి కన్నా ముందే సూపర్ స్టార్ తో చేసే ప్లానింగ్ జరిగిందన్న మాట. కాకపోతే రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు తెరకెక్కనుంది.

పలు అంతర్జాతీయ నిపుణలను బృందాలను దీని కోసం సమీకరిస్తున్న రాజమౌళి ఆస్కార్ ఈవెంట్ అయ్యాక స్క్రిప్ట్ మీద పూర్తి దృష్టి కేంద్రీకరించబోతున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ తన టీమ్ తో ఈ పనిలో ఉండగా ఏప్రిల్ నుంచి జక్కన్న సీరియస్ గా రంగంలోకి దిగుతారు. బయట ఎస్ఎస్ఎంబి 29గా నెంబర్ చెబుతున్నారు కానీ దానికన్నా ముందు మహేష్ మరొక సినిమా చేసే అవకాశం లేకపోలేదు. అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనున్న జక్కన్న కాంబో కోసం ఎంతలేదన్నా రెండు మూడేళ్లు హీనపక్షం అవసరమవుతుంది కాబట్టి మహేష్ నుంచి ఇంకో మూవీ రావొచ్చు.

ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ అడ్వెంచర్ అని ముందు నుంచి ఊరిస్తున్నారు సో జానర్ కు సంబంధించి క్లారిటీ వచ్చేసినట్టే. కీరవాణి స్వరాలు కూర్చే పనిని త్వరలో మొదలు పెట్టబోతున్నారు. అడవి నేపథ్యంలో మహేష్ చేసిన చిత్రం టక్కరి దొంగ ఒకటే. కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా ఫ్యాన్స్ దీని మేకింగ్ స్టైల్ ని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు జక్కన్న తీయబోయే విజువల్ వండర్ కి వాళ్ళే కాదు సగటు మూవీ లవర్స్ సైతం ఉక్కిరిబిక్కిరి కావడం సహజం. హీరోయిన్ ఇతర సాంకేతిక బృందం తదితరాలు ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి లీక్సేమీ రాలేదు.

This post was last modified on January 19, 2023 1:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

5 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

7 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

7 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

8 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

9 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

11 hours ago