ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుంచే విపరీతమైన చర్చల్లో ఉన్న మహేష్ రాజమౌళి ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు మొదలవుతుందానే ఆసక్తి అభిమానుల్లో అంతకంతా పెరిగిపోతోంది. ఆర్ఆర్ఆర్ కు పలు అంతర్జాతీయ పురస్కారాలు వచ్చిన సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో జక్కన్న దీని ప్రస్తావన తెస్తున్నారు. ఇది పదేళ్ల నుంచి పెండింగ్ ఉన్న సినిమా అని ఇప్పటికి కుదిరిందని అన్నారు. అంటే బాహుబలి కన్నా ముందే సూపర్ స్టార్ తో చేసే ప్లానింగ్ జరిగిందన్న మాట. కాకపోతే రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు తెరకెక్కనుంది.
పలు అంతర్జాతీయ నిపుణలను బృందాలను దీని కోసం సమీకరిస్తున్న రాజమౌళి ఆస్కార్ ఈవెంట్ అయ్యాక స్క్రిప్ట్ మీద పూర్తి దృష్టి కేంద్రీకరించబోతున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ తన టీమ్ తో ఈ పనిలో ఉండగా ఏప్రిల్ నుంచి జక్కన్న సీరియస్ గా రంగంలోకి దిగుతారు. బయట ఎస్ఎస్ఎంబి 29గా నెంబర్ చెబుతున్నారు కానీ దానికన్నా ముందు మహేష్ మరొక సినిమా చేసే అవకాశం లేకపోలేదు. అయిదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనున్న జక్కన్న కాంబో కోసం ఎంతలేదన్నా రెండు మూడేళ్లు హీనపక్షం అవసరమవుతుంది కాబట్టి మహేష్ నుంచి ఇంకో మూవీ రావొచ్చు.
ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ అడ్వెంచర్ అని ముందు నుంచి ఊరిస్తున్నారు సో జానర్ కు సంబంధించి క్లారిటీ వచ్చేసినట్టే. కీరవాణి స్వరాలు కూర్చే పనిని త్వరలో మొదలు పెట్టబోతున్నారు. అడవి నేపథ్యంలో మహేష్ చేసిన చిత్రం టక్కరి దొంగ ఒకటే. కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా ఫ్యాన్స్ దీని మేకింగ్ స్టైల్ ని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు జక్కన్న తీయబోయే విజువల్ వండర్ కి వాళ్ళే కాదు సగటు మూవీ లవర్స్ సైతం ఉక్కిరిబిక్కిరి కావడం సహజం. హీరోయిన్ ఇతర సాంకేతిక బృందం తదితరాలు ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి లీక్సేమీ రాలేదు.
This post was last modified on January 19, 2023 1:38 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…