ముచ్చటగా మూడోసారి మెగా 2 మిలియన్

వాల్తేరు వీరయ్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యుఎస్ లోనూ విజయకేతనం ఎగరేసింది. రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ఇంకో రోజు బాకీ ఉండగానే సగర్వంగా 2 మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగు పెట్టింది. ఖైదీ నెంబర్ 150తో కంబ్యాక్ ఇచ్చాక మెగాస్టార్ ఈ ఫీట్ మూడోసారి సాధించారు. ఆ మూవీతో సైరా నరసింహారెడ్డి ఈ ఫీట్ అందుకుంది. ఆచార్య విఫలం కాగా గాడ్ ఫాదర్ దూకుడు స్టడీగా ఉండలేకపోయింది. ఇలా మొత్తం మూడు సార్లు టూ మిలియన్ మైలురాయి అందుకున్న ఏకైక సీనియర్ స్టార్ గా చిరంజీవికి మరో రికార్డు దక్కింది. బాలయ్య, నాగ్, వెంకీలకు ఇది సాధ్యం కాలేదు.

ఇంకా రన్ చాలా ఉంది. ఫ్యాన్స్ ట్రిపుల్ బెంచ్ మార్క్ ని ఆశిస్తున్నారు కానీ అదంత సులభమైతే కాదు. అత్యధిక ప్రేక్షకులు వాల్తేరు వీరయ్యని చూసేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాగా విజువల్ ఎఫెక్ట్ కంటెంట్ కాదు కాబట్టి రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా ఉండరు. అలా అని అసాధ్యమూ కాదు. ఒకవేళ సాధించగలిగితే అరుదైన ఘనతగానే చెప్పుకోవాలి. పోటీగా ఉన్న వీరసింహారెడ్డి సైతం 1 మిలియన్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత నెమ్మదించడంతో చిరుని అందుకోవడం జరగని పనే. మైత్రి మూవీ మేకర్స్ వాల్తేరు వీరయ్య ఓవర్సీస్ ఫిగర్ ని అఫీషియల్ గా ప్రకటించేసింది కనక సందేహాలేం లేవు.

తెలుగు రాష్ట్రాల్లోనూ చిరంజీవి దూకుడు స్టడీగానే ఉంది. పండగ సెలవులు అయిపోవడంతో నిన్నటి నుంచి స్పీడ్ తగ్గింది. టికెట్ రేట్ల పెంపుని పది రోజుల దాకా కొనసాగించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకోవడంతో ఈ వీకెండ్ కూడా ఇవే రేట్లే ఉంటాయి. సోమవారం నుంచి సాధారణ స్థితికి వచ్చాక అప్పుడు అక్యుపెన్సీలలో పెరుగుదల చూడొచ్చు. ఫస్ట్ వీక్ నైజాం డామినేషన్ స్పష్టంగా కనిపించగా తర్వాత కృష్ణా, ఆంధ్రా, గోదావరి జిల్లాల వైపు ఆధిపత్యం కనిపిస్తోంది. ఓవరాల్ షేర్ తొంబై కోట్లు దాటేసిన నేపథ్యంలో వంద కోట్ల మార్కు కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు