ఎన్నో మార్పులు వచ్చాయి, ప్రేక్షకులు కొత్తగా ఆలోచిస్తున్నారని ఏదేదో అనుకుంటాం కానీ పండగలకు వచ్చేటప్పటికీ ఈ సూత్రం పూర్తిగా పక్కకెళ్లిపోతుంది. ప్రతి సంక్రాంతి దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. వాల్తేరు వీరయ్యలో విషయం తక్కువన్నారు. కట్ చేస్తే వారం దాటకుండానే ఇండియాలో ఓవర్సీస్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. వీరసింహారెడ్డి గతంలో చూసిందే కదాని కామెంట్ చేశారు. నేనేం తీసిపోలేదన్న రీతిలో వంద కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకుంది. పక్క రాష్ట్రం తమిళనాడులో వరిసు ఏకంగా 150 కోట్లను దాటేసి వామ్మో అనిపించుకుంది. తునివు తేలికగా సెంచరీ కొట్టేసి ఇంకా స్ట్రాంగ్ గా ఉంది.
ఇక్కడో విషయం గమనించాలి. ఇవన్నీ రెగ్యులర్ కంటెంట్ తో రూపొందినవే. గతంలో చూడని కొత్త స్టోరీలు గట్రా ఏమీ ఉండవు. కానీ స్టార్ పవర్ వీటిని కాచుకుంది. దర్శకులు చేసిన తప్పులు లోపాలను కప్పెట్టేసింది. తమ ఇమేజ్ తో జనాన్ని థియేటర్లకు రప్పించగల చిరంజీవి, బాలకృష్ణ, విజయ్, అజిత్ లు ఓ మోస్తరుగా ఉందన్న టాక్ తోనూ కలెక్షన్ల వర్షం కురిపించారు. మరీ డిజాస్టర్ అనిపించుకునే స్థాయిలో ఇవేవీ లేకపోవడం ఆయా భాషల్లో జెండా పాతేలా చేశాయి. వారసుడు, తెగింపులు మన దగ్గరేం అద్భుతాలు చేయలేదు. వాల్తేరు వీరయ్యని అంత పెద్ద రిలీజ్ ఇచ్చినా హిందీలో ఎవరూ పట్టించుకోలేదు.
వీటిని బట్టి అర్థం చేసుకోవాల్సింది సరైన రీతిలో ఈ స్టార్ పవర్ ని వాడుకుంటే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయొచ్చు. ఇప్పుడంతా ఎలివేషన్ల జమానా. కెజిఎఫ్, విక్రమ్, అఖండ లాంటివి అంత బ్రహ్మాండంగా ఆడాయంటే వాటిలో హీరోయిజం చూపించిన తీరు, సంగీత దర్శకులు తమ బిజిఎంతో సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన విధానం జనానికి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు సంక్రాంతి సినిమాలకూ అదే జరిగింది. డీసెంట్ గా అనిపించే కథాకథనాలు ఉంటే చాలు హీరోలు ఈజీగా గట్టెక్కిస్తున్నారు. ఆ విషయంలో దర్శకులు జాగ్రత్త పడాల్సిందే. ఫలితాలు ఆచార్యలా వీరయ్యలా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది.
This post was last modified on January 18, 2023 1:55 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…