సోషల్ మీడియా వచ్చాక అందరూ రివ్యూ రైటర్స్ అయిపోయారు. ఎవరికి తోచింది వారు పోస్ట్ చేస్తున్నారు. దీంతో కొంత మంది దర్శకులకు ఇది మింగుడు పడటం లేదు. అలాగే రివ్యూల్లో రాసే కొన్ని పోలికలు కూడా వారు తీసుకోలేకపోతున్నారు. తాజాగా వంశీ పైడిపల్లి తన సినిమాపై వస్తున్న నెగటివిటీ పై సీరియస్ అయ్యాడు. ‘వారిసు’ సినిమాకు సంబందించి సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరిగింది. ట్రైలర్ రిలీజ్ నుండే సినిమా గట్టి ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
దీంతో సినిమా చూడకముందే ఒపీనియన్ చెప్పడం కరెక్ట్ కాదని , సినిమాపై తమకి నమ్మకం ఉందని మేకర్స్ చెప్పుకున్నారు. అయితే రిలీజ్ రోజు వారిసు పై గట్టి ట్రోలింగ్ జరిగింది. ఫ్యామిలీ డ్రామా సీరియల్ లా ఉందని కొందరు కామెంట్స్ చేశారు. చెన్నై మీడియాకి సంబంధించి కొన్ని రివ్యూల్లో ఎక్కువగా అదే రాసుకొచ్చారు. దీంతో వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో వారిపై తన కోపాన్ని చూపించాడు.
అందరూ కష్టపడి సినిమా చేస్తామని , ముఖ్యంగా విజయ్ ఎంత కష్టపడ్డారో తనకే తెలుసని , డాన్సుల కోసం ఆయన చేసిన ప్రాక్టీస్ ఇంతా అంతా కాదంటూ పైడిపల్లి తన ఆవేదనను వ్యక్తపరిచాడు. తన సినిమాను సీరియల్ తో పోల్చడం తగదని , సీరియల్ ను తక్కువ చేయడం కరెక్ట్ కాదని , సీరియల్స్ ఇంట్లో ఉండే ఫ్యామిలీస్ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయంటూ చెప్పుకున్నాడు. ఫైనల్ గా రెండూ క్రియేటివ్ జాబ్సే అంటూ సమర్దించుకునే ప్రయత్నం చేశాడు పైడిపల్లి.
మీ అందరికీ సినిమా తీయడం ఎంత కష్టమో తెలుసా ? సినిమా కోసం అందరం ఎన్ని త్యాగాలు చేస్తామో తెలుసా ? అంటూ ఫైనల్ గా తన అక్కసును వెల్లబుచ్చాడు వంశీ. దీంతో వంశీ పడిపల్లి వీడియో కి కౌంటర్ గా మనంఎంత కష్టపడ్డామో ఆడియన్స్ కి అనవసరమని, వాళ్ళ టికెట్ కి న్యాయం జరగడం ముఖ్యమని లోకేష్ కనగరాజ్ చెప్పిన పాత వీడియో పోస్ట్ చేస్తూ పైడిపల్లి పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు తమిళ్ ఆడియన్స్.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…