Movie News

సీరియల్ తో పోలిక .. పైడిపల్లి రియాక్షన్  

సోషల్ మీడియా వచ్చాక అందరూ రివ్యూ రైటర్స్ అయిపోయారు. ఎవరికి తోచింది వారు పోస్ట్ చేస్తున్నారు. దీంతో కొంత మంది దర్శకులకు ఇది మింగుడు పడటం లేదు. అలాగే రివ్యూల్లో రాసే కొన్ని పోలికలు కూడా వారు తీసుకోలేకపోతున్నారు. తాజాగా వంశీ పైడిపల్లి తన సినిమాపై వస్తున్న నెగటివిటీ పై సీరియస్ అయ్యాడు. ‘వారిసు’ సినిమాకు సంబందించి సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరిగింది. ట్రైలర్ రిలీజ్ నుండే సినిమా గట్టి ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 

దీంతో సినిమా చూడకముందే ఒపీనియన్ చెప్పడం కరెక్ట్ కాదని , సినిమాపై తమకి నమ్మకం ఉందని మేకర్స్ చెప్పుకున్నారు. అయితే రిలీజ్ రోజు వారిసు పై గట్టి ట్రోలింగ్ జరిగింది. ఫ్యామిలీ డ్రామా సీరియల్ లా ఉందని కొందరు కామెంట్స్ చేశారు. చెన్నై మీడియాకి సంబంధించి కొన్ని రివ్యూల్లో ఎక్కువగా అదే రాసుకొచ్చారు. దీంతో వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో వారిపై తన కోపాన్ని చూపించాడు. 

అందరూ కష్టపడి సినిమా చేస్తామని , ముఖ్యంగా విజయ్ ఎంత కష్టపడ్డారో తనకే తెలుసని , డాన్సుల కోసం ఆయన చేసిన ప్రాక్టీస్ ఇంతా అంతా కాదంటూ పైడిపల్లి తన ఆవేదనను వ్యక్తపరిచాడు. తన సినిమాను సీరియల్ తో పోల్చడం తగదని , సీరియల్ ను తక్కువ చేయడం కరెక్ట్ కాదని , సీరియల్స్ ఇంట్లో ఉండే ఫ్యామిలీస్ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయంటూ చెప్పుకున్నాడు. ఫైనల్ గా రెండూ క్రియేటివ్ జాబ్సే అంటూ సమర్దించుకునే ప్రయత్నం చేశాడు పైడిపల్లి.  

మీ అందరికీ సినిమా తీయడం ఎంత కష్టమో తెలుసా ? సినిమా కోసం అందరం ఎన్ని త్యాగాలు చేస్తామో తెలుసా ? అంటూ ఫైనల్ గా తన అక్కసును వెల్లబుచ్చాడు వంశీ. దీంతో వంశీ పడిపల్లి వీడియో కి కౌంటర్ గా మనంఎంత కష్టపడ్డామో ఆడియన్స్ కి అనవసరమని, వాళ్ళ టికెట్ కి న్యాయం జరగడం ముఖ్యమని లోకేష్ కనగరాజ్ చెప్పిన పాత వీడియో పోస్ట్ చేస్తూ పైడిపల్లి పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు తమిళ్ ఆడియన్స్.

This post was last modified on January 17, 2023 6:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

21 minutes ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

48 minutes ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

2 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago

RC 16 – ఒకట్రెండు ఆటలు కాదు బాసూ

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే టాక్ ఉంది…

3 hours ago