సోషల్ మీడియా వచ్చాక అందరూ రివ్యూ రైటర్స్ అయిపోయారు. ఎవరికి తోచింది వారు పోస్ట్ చేస్తున్నారు. దీంతో కొంత మంది దర్శకులకు ఇది మింగుడు పడటం లేదు. అలాగే రివ్యూల్లో రాసే కొన్ని పోలికలు కూడా వారు తీసుకోలేకపోతున్నారు. తాజాగా వంశీ పైడిపల్లి తన సినిమాపై వస్తున్న నెగటివిటీ పై సీరియస్ అయ్యాడు. ‘వారిసు’ సినిమాకు సంబందించి సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరిగింది. ట్రైలర్ రిలీజ్ నుండే సినిమా గట్టి ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
దీంతో సినిమా చూడకముందే ఒపీనియన్ చెప్పడం కరెక్ట్ కాదని , సినిమాపై తమకి నమ్మకం ఉందని మేకర్స్ చెప్పుకున్నారు. అయితే రిలీజ్ రోజు వారిసు పై గట్టి ట్రోలింగ్ జరిగింది. ఫ్యామిలీ డ్రామా సీరియల్ లా ఉందని కొందరు కామెంట్స్ చేశారు. చెన్నై మీడియాకి సంబంధించి కొన్ని రివ్యూల్లో ఎక్కువగా అదే రాసుకొచ్చారు. దీంతో వంశీ పైడిపల్లి ఓ ఇంటర్వ్యూలో వారిపై తన కోపాన్ని చూపించాడు.
అందరూ కష్టపడి సినిమా చేస్తామని , ముఖ్యంగా విజయ్ ఎంత కష్టపడ్డారో తనకే తెలుసని , డాన్సుల కోసం ఆయన చేసిన ప్రాక్టీస్ ఇంతా అంతా కాదంటూ పైడిపల్లి తన ఆవేదనను వ్యక్తపరిచాడు. తన సినిమాను సీరియల్ తో పోల్చడం తగదని , సీరియల్ ను తక్కువ చేయడం కరెక్ట్ కాదని , సీరియల్స్ ఇంట్లో ఉండే ఫ్యామిలీస్ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయంటూ చెప్పుకున్నాడు. ఫైనల్ గా రెండూ క్రియేటివ్ జాబ్సే అంటూ సమర్దించుకునే ప్రయత్నం చేశాడు పైడిపల్లి.
మీ అందరికీ సినిమా తీయడం ఎంత కష్టమో తెలుసా ? సినిమా కోసం అందరం ఎన్ని త్యాగాలు చేస్తామో తెలుసా ? అంటూ ఫైనల్ గా తన అక్కసును వెల్లబుచ్చాడు వంశీ. దీంతో వంశీ పడిపల్లి వీడియో కి కౌంటర్ గా మనంఎంత కష్టపడ్డామో ఆడియన్స్ కి అనవసరమని, వాళ్ళ టికెట్ కి న్యాయం జరగడం ముఖ్యమని లోకేష్ కనగరాజ్ చెప్పిన పాత వీడియో పోస్ట్ చేస్తూ పైడిపల్లి పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తున్నారు తమిళ్ ఆడియన్స్.
This post was last modified on January 17, 2023 6:38 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…