నాలుగు వారాల ముందు మాస్ రాజా రవితేజ కెరీర్ ప్రమాదంలో ఉన్నట్లు కనిపించింది. ఆయన భవితవ్యంపై చాలామందికి సందేహాలు నెలకొన్నాయి. అందుక్కారణం గత ఏడాది ఆయన ఎదుర్కొన్న పరాభవాలే. మంచి అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ ఫ్లాప్ కాగా.. దీని తర్వాత పెద్దగా బజ్ లేకుండా రిలీజైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాస్ రాజా కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా రవితేజ మార్కెట్ మీద బాగా ప్రతికూల ప్రభావం చూపింది.
ఇక మాస్ రాజా పనైపోయిందని చాలామంది తీర్మానించేశారు కూడా. వరుస హిట్లు ఇస్తున్న త్రినాథరావు నక్కిన-ప్రసన్నకుమార్ బెజవాడల కలయికలో ‘ధమాకా’ తెరకెక్కినప్పటికీ.. దానికి రిలీజ్ ముంగిట పెద్దగా బజ్ కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా నడిచాయి. సినిమాకు టాక్ అటు ఇటు అయితే 2022లో మూడో డిజాస్టర్ రవితేజ ఖాతాలో చేరడం.. తర్వాతి సినిమాల పరిస్థితి దయనీయంగా మారడం ఖాయం అనుకున్నారు.
కానీ ‘ధమాకా’ అంచనాలకు తగ్గట్లే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ టాక్కు సంబంధం లేకుండా వసూళ్ల మోత మోగించిందీ చిత్రం. క్రిస్మస్ సెలవులను పూర్తిగా ఉపయోగించుకుంటూ రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ అయింది ‘ధమాకా’. 2, 3 వారాల్లో కూడా ఈ సినిమాకు మంచి షేర్ రావడం విశేషం.
ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే సంక్రాంతికి మాస్ రాజా స్పెషల్ రోల్ చేసిన ‘వాల్తేరు వీరయ్య’ రిలీజైంది. ఈ సినిమాకు కూడా డివైడ్ టాకే వచ్చింది. కానీ అది కూడా వసూళ్ల మోత మోగించేస్తోంది. రవితేజ ప్రత్యేక పాత్ర ఈ సినిమాకు ప్లస్ అయింది. మాస్ రాజా లక్ ఫ్యాక్టర్ కొనసాగి ఈ సినిమా కూడా ఘనవిజయం దిశగా అడుగులు వేస్తుండడంతో ఆయన అభిమానుల సంతోషం మామూలుగా లేదు. మూడు వారాల వ్యవధిలో రవితేజ జాతకం మారిపోయిందని.. ఆయన కెరీర్ మళ్లీ పీక్స్ను అందుకుందని.. ఇది ఎవరూ ఊహించని విషయం అని వాళ్లు మురిసిపోతున్నారు.
This post was last modified on January 17, 2023 9:08 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…