కొన్ని పెద్ద బ్యానర్లకు స్టార్ హీరోల కాంబోలు బాగా కలిసి వస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ కి మెగా హీరోలతో కలయిక చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ సంస్థ మూడో సినిమా 2018 సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం. ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పరీక్షల సీజన్ మార్చిలో రిలీజై అది నెలకొల్పిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సాయి ధరమ్ తేజ్ వరస ఫ్లాపులో ఉన్నప్పుడు చిత్రలహరి మంచి బ్రేక్ ఇచ్చింది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కమర్షియల్ గానూ దాని బడ్జెట్ కు తగ్గట్టు బాగా పే చేసింది సుప్రీమ్ హీరోని తిరిగి ట్రాక్ లోకి తెచ్చింది.
వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన రేపిన సంచలనం తెలిసిందే. కరోనా టైంలో వడ్డీల భారాన్ని తట్టుకుని థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూసిన దానికి తగ్గ గొప్ప రిజల్ట్ దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా వంద కోట్లకు పైగా లాగేసింది. ఇక పుష్ప గురించి చెప్పేదేముంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అనుకుంటారు కానీ మెగా టీమ్ నుంచి అల్లు అర్జున్ పూర్తి విడిగా చేయలేం కాబట్టి దీని బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా ఈ లిస్టులోకి వేయొచ్చు. ఇది ఎంత పెద్ద హిట్ అంటే ఐకాన్ స్టార్ కి రెండో భాగానికి ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో అంచనాలతో పాటు బిజినెస్ రేంజ్ ని పెంచేసింది.
ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతు వచ్చింది. మూడు రోజులకే నూటా ఎనిమిది కోట్ల గ్రాస్ తో పాటు యుఎస్ లో 1.7 మిలియన్ల వసూళ్లతో అక్కడి టాప్ 10 ఛార్ట్ లోకి దూసుకుపోయింది. ఈ మొత్తం జాబితా చూసుకుంటే మైత్రికి డబుల్ హ్యాట్రిక్ పూర్తయిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్ వంతు వచ్చింది. ఇది పైన చెప్పిన వాటి రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుందని ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకుండానే పవర్ స్టార్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు. మొత్తానికి మైత్రికి మెగా సెంటిమెంట్ బాగానే కలిసి వస్తోంది. వీటన్నటికీ దేవిశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు కావడం క్లైమాక్స్ ట్విస్టు.
This post was last modified on January 17, 2023 9:00 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…