కొన్ని పెద్ద బ్యానర్లకు స్టార్ హీరోల కాంబోలు బాగా కలిసి వస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ కి మెగా హీరోలతో కలయిక చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ సంస్థ మూడో సినిమా 2018 సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం. ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పరీక్షల సీజన్ మార్చిలో రిలీజై అది నెలకొల్పిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సాయి ధరమ్ తేజ్ వరస ఫ్లాపులో ఉన్నప్పుడు చిత్రలహరి మంచి బ్రేక్ ఇచ్చింది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కమర్షియల్ గానూ దాని బడ్జెట్ కు తగ్గట్టు బాగా పే చేసింది సుప్రీమ్ హీరోని తిరిగి ట్రాక్ లోకి తెచ్చింది.
వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన రేపిన సంచలనం తెలిసిందే. కరోనా టైంలో వడ్డీల భారాన్ని తట్టుకుని థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూసిన దానికి తగ్గ గొప్ప రిజల్ట్ దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా వంద కోట్లకు పైగా లాగేసింది. ఇక పుష్ప గురించి చెప్పేదేముంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అనుకుంటారు కానీ మెగా టీమ్ నుంచి అల్లు అర్జున్ పూర్తి విడిగా చేయలేం కాబట్టి దీని బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా ఈ లిస్టులోకి వేయొచ్చు. ఇది ఎంత పెద్ద హిట్ అంటే ఐకాన్ స్టార్ కి రెండో భాగానికి ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో అంచనాలతో పాటు బిజినెస్ రేంజ్ ని పెంచేసింది.
ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతు వచ్చింది. మూడు రోజులకే నూటా ఎనిమిది కోట్ల గ్రాస్ తో పాటు యుఎస్ లో 1.7 మిలియన్ల వసూళ్లతో అక్కడి టాప్ 10 ఛార్ట్ లోకి దూసుకుపోయింది. ఈ మొత్తం జాబితా చూసుకుంటే మైత్రికి డబుల్ హ్యాట్రిక్ పూర్తయిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్ వంతు వచ్చింది. ఇది పైన చెప్పిన వాటి రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుందని ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకుండానే పవర్ స్టార్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు. మొత్తానికి మైత్రికి మెగా సెంటిమెంట్ బాగానే కలిసి వస్తోంది. వీటన్నటికీ దేవిశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు కావడం క్లైమాక్స్ ట్విస్టు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…