కొన్ని పెద్ద బ్యానర్లకు స్టార్ హీరోల కాంబోలు బాగా కలిసి వస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ కి మెగా హీరోలతో కలయిక చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ సంస్థ మూడో సినిమా 2018 సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం. ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పరీక్షల సీజన్ మార్చిలో రిలీజై అది నెలకొల్పిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సాయి ధరమ్ తేజ్ వరస ఫ్లాపులో ఉన్నప్పుడు చిత్రలహరి మంచి బ్రేక్ ఇచ్చింది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కమర్షియల్ గానూ దాని బడ్జెట్ కు తగ్గట్టు బాగా పే చేసింది సుప్రీమ్ హీరోని తిరిగి ట్రాక్ లోకి తెచ్చింది.
వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ ఉప్పెన రేపిన సంచలనం తెలిసిందే. కరోనా టైంలో వడ్డీల భారాన్ని తట్టుకుని థియేటర్ రిలీజ్ కోసం ఎదురు చూసిన దానికి తగ్గ గొప్ప రిజల్ట్ దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా వంద కోట్లకు పైగా లాగేసింది. ఇక పుష్ప గురించి చెప్పేదేముంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అనుకుంటారు కానీ మెగా టీమ్ నుంచి అల్లు అర్జున్ పూర్తి విడిగా చేయలేం కాబట్టి దీని బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా ఈ లిస్టులోకి వేయొచ్చు. ఇది ఎంత పెద్ద హిట్ అంటే ఐకాన్ స్టార్ కి రెండో భాగానికి ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో అంచనాలతో పాటు బిజినెస్ రేంజ్ ని పెంచేసింది.
ఇప్పుడు వాల్తేరు వీరయ్య వంతు వచ్చింది. మూడు రోజులకే నూటా ఎనిమిది కోట్ల గ్రాస్ తో పాటు యుఎస్ లో 1.7 మిలియన్ల వసూళ్లతో అక్కడి టాప్ 10 ఛార్ట్ లోకి దూసుకుపోయింది. ఈ మొత్తం జాబితా చూసుకుంటే మైత్రికి డబుల్ హ్యాట్రిక్ పూర్తయిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్ వంతు వచ్చింది. ఇది పైన చెప్పిన వాటి రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తుందని ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకుండానే పవర్ స్టార్ ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు. మొత్తానికి మైత్రికి మెగా సెంటిమెంట్ బాగానే కలిసి వస్తోంది. వీటన్నటికీ దేవిశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడు కావడం క్లైమాక్స్ ట్విస్టు.
This post was last modified on January 17, 2023 9:00 am
తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన…
యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో షాక్ తగిలింది. వైసీపీ…
అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ…
భారత్ మరోసారి టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో…
రానున్న రోజుల్లో కాల్ చేయకుండా డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, ధరల గురించి తెలుసుకోవడం, ఇతర వివరాలు సేకరించడం మరింత…
ఒకవైపు వైసీపీ నుంచి వ్యతిరేక వ్యాఖ్యలు. ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని.. ఇక, చేయదని .. చంద్రబాబు పేదలకు…