టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్.. హీరోలు కాకుండా మిగతా ఆర్టిస్టులను ఎక్కువగా రిపీట్ చేయడానికి ఇష్టపడరు. తన ప్రతి సినిమాకూ హీరోయిన్ని మార్చేస్తుంటాడు. అలాగే క్యారెక్టర్ రోల్స్లోనూ ఎప్పటికప్పుడు కొత్త వాళ్లతో పని చేయడానికి ఇష్టపడుతుంటాడు. విలన్ల విషయంలోనూ ఒక దశ వరకు ఇలాగే సాగేది. కానీ ‘నాన్నకు ప్రేమతో’ దగ్గర సుకుమార్ విలన్ విషయంలో స్ట్రక్ అయిపోయాడు. ఆ చిత్రంలో జగపతిబాబును స్టైలిష్ విలన్ పాత్రలో భలేగా ప్రెజెంట్ చేసిన సుకుమార్.. దాని తర్వాత రామ్ చరణ్తో చేసిన ‘రంగస్థలం’లోనూ విలన్గా ఆయన్నే కొనసాగించాడు. ఆ చిత్రంలో కూడా జగపతికి ఒక డిఫరెంట్ రోల్ పడింది. దాన్ని ఆయన బాగానే పండించాడు.
ఐతే ‘పుష్ప’కు వచ్చేసరికి సుక్కు రూటు మార్చినట్లే కనిపించాడు. ఫస్ట్ పార్ట్లో సునీల్ను దాదాపు మెయిన్ విలన్ని చేశాడు. చివర్లో ఫాహద్ ఫాజిల్ పాత్రను ప్రవేశపెట్టి దాన్ని సెకండ్ పార్ట్కు మెయిన్ విలన్గా మార్చనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఆ ప్రకారమే ఫాహద్ ‘పుష్ప: ది రూల్’లో బన్నీని ఢీకొట్టబోతున్నాడు. ఐతే ఇందులో వేరే పెద్ద విలన్ కూడా ఉన్నాడట. ఆ పాత్రకు జగపతిబాబును తీసుకున్నారని సమాచారం.
ఫాహద్కు అండగా నిలుస్తూ, పుష్సకు సపోర్టుగా ఉన్న రావు రమేష్కు ఎదురు నిలిచే రాజకీయ నాయకుడి పాత్రలో జగపతి కనిపించనున్నాడబట. సెకండ్ పార్ట్ కూడా అయితే తప్ప ‘పుష్ప’ సినిమా పూర్తయినట్లు కాదు. ఈ ప్రకారం చూస్తే వరుసగా మూడో సినిమాలోనూ జగపతినే సుక్కు విలన్గా కొనసాగిస్తున్నాడన్నమాట. సుకుమార్ లాంటి మేటి దర్శకుడిని ఇంతగా మెప్పించాడంటే జగపతికి ఇదొక అచీవ్మెంట్ అనే చెప్పాలి. జగపతి లుక్, మేనరిజమ్స్ చాలా డిఫరెంటుగా ఉంటాయట ఈ చిత్రంలో. ఆ పాత్రను చూసి జనాలు షాకవుతారని సమాచారం.
This post was last modified on January 17, 2023 8:47 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…