టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన సుకుమార్.. హీరోలు కాకుండా మిగతా ఆర్టిస్టులను ఎక్కువగా రిపీట్ చేయడానికి ఇష్టపడరు. తన ప్రతి సినిమాకూ హీరోయిన్ని మార్చేస్తుంటాడు. అలాగే క్యారెక్టర్ రోల్స్లోనూ ఎప్పటికప్పుడు కొత్త వాళ్లతో పని చేయడానికి ఇష్టపడుతుంటాడు. విలన్ల విషయంలోనూ ఒక దశ వరకు ఇలాగే సాగేది. కానీ ‘నాన్నకు ప్రేమతో’ దగ్గర సుకుమార్ విలన్ విషయంలో స్ట్రక్ అయిపోయాడు. ఆ చిత్రంలో జగపతిబాబును స్టైలిష్ విలన్ పాత్రలో భలేగా ప్రెజెంట్ చేసిన సుకుమార్.. దాని తర్వాత రామ్ చరణ్తో చేసిన ‘రంగస్థలం’లోనూ విలన్గా ఆయన్నే కొనసాగించాడు. ఆ చిత్రంలో కూడా జగపతికి ఒక డిఫరెంట్ రోల్ పడింది. దాన్ని ఆయన బాగానే పండించాడు.
ఐతే ‘పుష్ప’కు వచ్చేసరికి సుక్కు రూటు మార్చినట్లే కనిపించాడు. ఫస్ట్ పార్ట్లో సునీల్ను దాదాపు మెయిన్ విలన్ని చేశాడు. చివర్లో ఫాహద్ ఫాజిల్ పాత్రను ప్రవేశపెట్టి దాన్ని సెకండ్ పార్ట్కు మెయిన్ విలన్గా మార్చనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఆ ప్రకారమే ఫాహద్ ‘పుష్ప: ది రూల్’లో బన్నీని ఢీకొట్టబోతున్నాడు. ఐతే ఇందులో వేరే పెద్ద విలన్ కూడా ఉన్నాడట. ఆ పాత్రకు జగపతిబాబును తీసుకున్నారని సమాచారం.
ఫాహద్కు అండగా నిలుస్తూ, పుష్సకు సపోర్టుగా ఉన్న రావు రమేష్కు ఎదురు నిలిచే రాజకీయ నాయకుడి పాత్రలో జగపతి కనిపించనున్నాడబట. సెకండ్ పార్ట్ కూడా అయితే తప్ప ‘పుష్ప’ సినిమా పూర్తయినట్లు కాదు. ఈ ప్రకారం చూస్తే వరుసగా మూడో సినిమాలోనూ జగపతినే సుక్కు విలన్గా కొనసాగిస్తున్నాడన్నమాట. సుకుమార్ లాంటి మేటి దర్శకుడిని ఇంతగా మెప్పించాడంటే జగపతికి ఇదొక అచీవ్మెంట్ అనే చెప్పాలి. జగపతి లుక్, మేనరిజమ్స్ చాలా డిఫరెంటుగా ఉంటాయట ఈ చిత్రంలో. ఆ పాత్రను చూసి జనాలు షాకవుతారని సమాచారం.
This post was last modified on January 17, 2023 8:47 am
మూడేళ్లు కష్టపడితే రామ్ చరణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన ఘనత గేమ్ ఛేంజర్ కే దక్కుతుంది.…
లోకేష్ టీంకు చాలానే పని పడిందా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న స్వల్ప గ్యాప్ ను తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందా?…
వైసీపీ నాయకురాలు..మాజీ మంత్రి విడదల రజనీకి భారీ షాక్ తగిలింది. ఆమె మరిది.. విడదల గోపీని ఏసీబీ పోలీసులు అరెస్టు…
అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట నుంచి వచ్చిన మాటలు నేడు నిజమయ్యాయి. 2016లో…
ఏడాది తర్వాత.. సీఎం చంద్రబాబు సహా.. అధికారులంతా ఎక్కడ నుంచి పనిచేస్తారు? ఎక్కడ ఉంటారు? అంటే.. తాజాగా ప్రభుత్వం చెబుతున్న…
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేయ డమేరాజకీయం అనుకున్నారు. అలానే…