బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండు చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచినా.. వాటి అనంతరం రానున్న ‘ఆదిపురుష్’ నెగెటివిటీ బారిన పడ్డా.. ప్రభాస్ మీద అభిమానుల్లో నమ్మకం ఏమీ సడలిపోలేదు. సరైన సినిమా పడితే ప్రభాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ చూస్తుందనే ధీమాతోనే ఉన్నారు. ప్రభాస్ లైనప్ వారి ఆశలను నిలిపి ఉంచుతోంది. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేస్తున్న ‘సలార్’.. ‘మహానటి’ డైరెక్టర్ తీస్తున్న ‘ప్రాజెక్ట్-కే’ చిత్రాలతో ప్రభాస్ బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
వీటితో పాటు ప్రభాస్ కమిట్మెంట్లలో అత్యంత ఎగ్జైట్ చేస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అంటేనే ఎగ్జైట్మెంట్ మరో స్థాయికి చేరుకుంది. కాంబినేషన్ క్రేజ్తోనే ఈ సినిమా హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. తాజాగా ఈ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్.. ప్రభాస్ అభిమానులకు ఉత్సాహాన్నిచ్చే అప్డేట్స్ ఇచ్చాడు.
‘స్పిరిట్’ సినిమా ఈ ఏడాది చివర్లోనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలున్నట్లు భూషణ్ కుమార్ చెప్పడం విశేషం. ప్రస్తుతం సందీప్ ‘యానిమల్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సందీప్.. ఆ సినిమా షూట్ పూర్తి కాగానే ‘స్పిరిట్’ పని మొదలుపెడతాడని.. ఏడాది చివర్లో సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నామని భూషణ్ తెలిపాడు.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తాడనే ప్రచారం నిజమే అని భూషణ్ చెప్పడం విశేషం. ప్రభాస్ ఒక డిఫరెంట్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తాడని తెలిపాడు. మాస్ హీరోల ఇమేజ్ను పెంచే పాత్ర అంటే పోలీస్దే. ప్రతి స్టార్ హీరో కూడా కెరీర్లో ఏదో ఒక దశలో ఖాకీ ధరిస్తుంటాడు. టాలీవుడ్ టాప్ స్టార్లందరూ ఆ ముచ్చట తీర్చుకున్నవాళ్లే. ఖాకీ క్యారెక్టర్లలో ఘనవిజయాలు అందుకున్న వాళ్లే. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటిదాకా ఖాకీ వేయలేదు. అతడి కటౌట్కు సరైన పోలీస్ క్యారెక్టర్ పడితే సినిమా వేరే లెవెల్కు వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on January 17, 2023 8:30 am
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…