Movie News

నెట్ ఫ్లిక్స్ ముప్పేటదాడి వెనుక అసలు కథ

ఒకపక్కేమో టాలీవుడ్ నిర్మాతలు థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ తగ్గాలని డిమాండ్ చేస్తారు. షూటింగులు ఆపి మరీ చేసిన నిరసనల్లో ఇకపై డిజిటల్ పార్ట్ నర్స్ ని ఎక్కువ హై లైట్ చేయకుండా ఎనిమిది వారల తర్వాత స్ట్రీమింగ్ ఉండేలా నిర్ణయాలు తీసుకుంటారు.

కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ తాము కొనుగోలు చేసిన కొత్త తెలుగు సినిమాల హక్కుల గురించి ఇచ్చిన వరస ప్రకటనలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇందులో షూటింగ్ సగం అయినవి చివరి దశలో ఉన్నవి అసలు ఇంకా సెట్లకు పైకి వెళ్లనవి కూడా ఉండటం అసలు ట్విస్టు.

చిరంజీవి భోళా శంకర్, మహేష్ బాబు 28, కళ్యాణ్ రామ్ అమిగోస్, నాని దసరా, సిద్దు టిల్లు స్క్వేర్, కిరణ్ అబ్బవరం మీటర్, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, వైష్ణవ్ తేజ్ 8, నిఖిల్ 18 పేజెస్, బుట్టబొమ్మ, బడ్డీ, వరుణ్ తేజ్ 12 ఇలా మొత్తం పదిహేడు అనౌన్స్ మెంట్లతో షాక్ ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ ఇవ్వలేదు.

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న వాటి గురించి యాడ్స్ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్నవాటిని కూడా మేం కొనేసుకున్నాం అని చెప్పడం వల్ల సగటు కామన్ ఆడియన్స్ కి ఇది ఎలాగూ ఓటిటిలో వస్తుంది కదానే అభిప్రాయం కలిగినప్పుడు దాని ప్రభావం థియేటర్ కు వెళ్లే నిర్ణయం మీద ఉంటుంది

కానీ ఇలా చేయడం వెనుక నెట్ ఫ్లిక్స్ ప్లానింగ్ వేరే ఉంది. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రైబర్లు అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే ఇండియాలో తక్కువగా ఉన్నారు. అందులోనూ సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉండే సౌత్ మార్కెట్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే ఉద్దేశంలో ఇలా గంపగుత్తగా వందల కోట్లను పెట్టుబడిగా పెట్టేసి వాటి హక్కులు కొనేస్తోంది.

భారీ రేట్లకు మూడు చిరంజీవి సినిమాలను కొనుగోలు చేయడమే దానికి ఉదాహరణ. నెట్ ఫ్లిక్స్ ఉద్దేశం ఏదైనప్పటికీ ఇది మరో రూపంలో కొత్త సినిమాల ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.అగ్రిమెంట్ల టైంలో ప్రొడ్యూసర్లు ఈ అంశం మీద దృష్టి సారించడం అవసరం

This post was last modified on January 16, 2023 5:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago