Movie News

బాలయ్య అభిమానుల ఆక్రోశం

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘వీరసింహారెడ్డి’ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై తొలి రోజు మామూలు జోరు చూపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ప్రతి థియేటర్లోనూ ఆ సినిమానే ఆడించేశారు గత గురువారం. తెలుగు రాష్ట్రాల అవతల.. యుఎస్‌లో కూడా సినిమా భారీ స్థాయిలోనే రిలీజైంది. ఆ ఒక్క రోజు వసూళ్ల మోత మోగించింది. బాలయ్య చివరి సినిమా ‘అఖండ’తో పోలిస్తే దీనికి తొలి రోజు రెట్టింపు వసూళ్లు రావడం విశేషం. ఇది చూసి నందమూరి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

ఇదే ఊపు కొనసాగిస్తే ఓవరాల్ వసూళ్లలో కూడా బాలయ్య సరికొత్త రికార్డులు నమోదు చేయడం పక్కా అనుకున్నారు. కానీ రెండో రోజు నుంచి ‘వీరసింహారెడ్డి’ ఊపు కనిపించలేదు. ‘వాల్తేరు వీరయ్య’ కోసం ‘వీరసింహారెడ్డి’ కోసం మెజారిటీ స్క్రీన్లలో కోత పడింది. ఆ తర్వాతి రోజు ‘వారసుడు’ కోసం దిల్ రాజు మరిన్ని థియేటర్లు తీసేసుకున్నారు. కొన్ని ‘కళ్యాణం కమనీయం’కు వెళ్లిపోయాయి.

దీంతో ఏపీ, తెలంగాణ మొదలుకుని.. వరల్డ్ వైడ్ రెండో రోజు ‘వీరసింహారెడ్డి’ వసూళ్లలో భారీ కోత పడింది. సినిమా టాక్ కూడా డివైడ్‌గా ఉండడం కూడా మైనస్ అయి.. ‘వీరసింహారెడ్డి’ ఊపు కొంచెం తగ్గింది. దీంతో బాలయ్య అభిమానుల అంచనాలు తలకిందులైపోయాయి. మంచి స్క్రీన్లు ఉన్న చోట సినిమా బాగానే ఆడుతోంది కానీ.. మిగతా చోట్ల అండర్ పెర్ఫామ్ చేస్తోంది.

మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. పండుగ అడ్వాంటేజీని ఆ సినిమా పూర్తిగా ఉపయోగించుకుంటోంది. టాక్ పరంగా రెంటికీ తేడా లేకపోయినా.. చిరు సినిమానే పైచేయి సాధిస్తుండడం బాలయ్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

రెండు సినిమాలనూ నిర్మించింది మైత్రీ సంస్థే అయినా.. థియేటర్ల కేటాయింపు విషయంలో బాలయ్య చిత్రానికి అన్యాయం చేస్తోందని.. ఎక్కువ థియేటర్లు అట్టిపెట్టలేదని, సరైన స్క్రీన్లు ఇవ్వలేదని.. ఈ పక్షపాతం ఏంటని మైత్రీ వాళ్ల మీద మండిపడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. సరిగా ఆడని వారసుడు, కళ్యాణం కమనీయం చిత్రాలకు థియేటర్లు ఇచ్చి.. బాగా ఆడుతున్న ‘వీరసింహారెడ్డి’కి అన్యాయం చేస్తున్నారని కూడా వారు ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.

This post was last modified on January 16, 2023 9:01 am

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

20 minutes ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

20 minutes ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

24 minutes ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

1 hour ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

1 hour ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

1 hour ago