ఏడాదిన్నర కిందట ‘పెళ్ళిసంద-డి’ చిత్రాన్ని చూసిన వాళ్లంతా తలలు పట్టుకున్నారు.. ఇదేం సినిమారా బాబూ అని. 20 ఏళ్ల ముందు వచ్చినా ఔట్ డేటెడ్ అనిపించే సినిమా అది. అయినా సరే.. అది బాగానే ఆడిందంటే అందుక్కారణం హీరో హీరోయిన్లే. ముఖ్యంగా కన్నడ అమ్మాయి అయిన శ్రీలీల.. తన అందం, అభినయంతో కట్టిపడేసింది.
ఆ సినిమాతో వచ్చిన పేరుతోనే తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది. అందులో ఒకటి.. రవితేజ సరసన చేసిన ధమాకా. ఈ సినిమా గత ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. వరుసగా రెండు సక్సెస్లు వస్తే ఇక ఏ హీరోయిన్ అయినా ఆగుతుందా? ఈ ఊపులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసింది. హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమాలో శ్రీ లీల ఓ కథానాయికగా ఎంపికైంది.
ఈ సినిమాలో శ్రీలీల ఉందా లేదా అనే విషయంలో ఇటీవల సందిగ్ధత నెలకొంది. ఐతే ఇప్పుడు స్వయంగా నిర్మాత నాగవంశీనే క్లారిటీ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మీడియాలో అందరూ శ్రీలీలను సెకండ్ హీరోయిన్ అని పేర్కొంటుండడం నాగవంశీకి నచ్చలేదు.
తాము హీరోయిన్లకు నంబరింగ్ అంటూ ఏమీ ఇవ్వలేదని.. శ్రీలీలను సెకండ్ హీరోయిన్ అనడం కరెక్ట్ కాదని.. ఆమె కూడా ఇందులో ఓ హీరోయిన్ మాత్రమే అని నాగవంశీ మీడియాకు క్లారిటీ ఇచ్చాడు. ఎలాగైతేనేం.. ఈ సినిమాలో శ్రీలీల కూడా భాగమే అని అయితే స్పష్టం అయిపోయింది.
మూడో సినిమాకే మహేష్తో, అది కూడా ఇంత క్రేజీ ప్రాజెక్టులో నటించడం అంటే మాటలు కాదు. పైగా నాగవంశీ మాటల్ని బట్టి చూస్తే ఆమెకు కూడా ముఖ్యమైన పాత్రే ఇచ్చినట్లున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా క్లిక్ అయితే శ్రీలీల రేంజ్ ఇంకా పెరగిపోవడం ఖాయం.
This post was last modified on January 16, 2023 8:59 am
భారత పోరుగు దేశం, దేవభూమి నేపాల్లో ఒక్కసారిగా సంభవించిన జల ప్రళయం.. ప్రజలను అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా ఉప్పొంగిన కోశీ…
మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…