నందమూరి బాలకృష్ణ సంక్రాంతి రోజు క్షమాపణ లేఖను మీడియాకు రిలీజ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన దేవ బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు. బాలయ్య కొత్త చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ.. దేవబ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని.. వారి నాయకుడు రావణాసురుడు అని వ్యాఖ్యానించారు.
కానీ బాలయ్య చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడారని.. ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని.. తన వ్యాఖ్యలకు బాలయ్య క్షమాపణలు చెప్పాలని దేవ బ్రాహ్మణుల సంఘం డిమాండ్ చేసింది. వివాదానికి తెరదించుతూ బాలయ్య క్షమాపణ లేఖ రిలీజ్ చేశారు.
‘‘దేవ బ్రాహ్మణ సోదర సోదరీమణులకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మన:పూర్వక మనవి. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణ బ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పని తెలియజేసిన దేవ బ్రాహ్మణ పెద్దలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధ పడ్డాను. నాకు ఎవరినీ బాధ పెటట్ాలన్న ఆలోచన లేదు, ఉండదని తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. పైగా దేవాంగులలో కూడా నా అభిమానులు చాలామంది ఉన్నారు. నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా? అర్థం చేసుకుని పొరబాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను’’ అని బాలయ్య పేర్కొన్నాడు.
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…
అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…