Movie News

కీర్తి సురేష్.. రివాల్వర్ రీటా

ప్రస్తుతం ఇండియాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న అతి కొద్దిమంది కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. ‘మహానటి’ సినిమాతో ఆమె ఇమేజే మారిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో అరడజను దాకా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస కట్టాయి.

కాకపోతే ‘మహానటి’ తర్వాత ఆమె నుంచి వచ్చిన సినిమాలు ఆ చిత్రానికి దరిదాపుల్లో కూడా నిలవలేకపోయాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి.. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి.

వాటితో పోలిస్తే ‘సాని కాయిదం’ (తెలుగులో చిన్ని) కాస్త పర్వాలేదనిపించినా.. అది కూడా కీర్తి ఆశించిన ఫలితాన్నయితే ఇవ్వలేదు. కానీ కీర్తి దగ్గరికి లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది మలయాళంలో ‘వాసి’ అనే సినిమా చేసిన ఆమె.. తాజాగా ‘రివాల్వర్ రీటా’ పేరుతో కొత్త సినిమా కబురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సంక్రాంతి సందర్భంగా ‘రివాల్వర్ రీటా’ సినిమాను అనౌన్స్ చేశారు. చేతిలో రెండు గన్నులు పట్టుకున్న కీర్తి యానిమేటెడ్ లుక్‌తో పోస్టర్ వదిలారు. తమిళ దర్శకుడు కె.చంద్రు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సుధాన్ సుందరం, జగదీష్ పలణిస్వామి నిర్మాతలు.

సమంత చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం విశేషం. పోస్టర్ మీద ముందే ‘నెట్ ఫ్లిక్స్’ అని వేసేయడం చూస్తే.. ఇది ఆ ఓటీటీ కోసం చేస్తున్న సినిమాలా కనిపిస్తోంది. దీనికి థియేట్రికల్ రిలీజ్ లేకపోవచ్చు.

ఇంతకుముందు కీర్తి సినిమా ‘మిస్ ఇండియా’తో నెట్ ఫ్లిక్స్ వాళ్లు చేతులు కాల్చుకున్నారు. మళ్లీ ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాను అదే సంస్థ ముందే కొనేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఫస్ట్ లుక్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలా కనిపిస్తోంది. మరి ఈ జానర్ అయినా కీర్తికి మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.

This post was last modified on January 15, 2023 6:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

38 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago