ప్రస్తుతం ఇండియాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న అతి కొద్దిమంది కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. ‘మహానటి’ సినిమాతో ఆమె ఇమేజే మారిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో అరడజను దాకా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస కట్టాయి.
కాకపోతే ‘మహానటి’ తర్వాత ఆమె నుంచి వచ్చిన సినిమాలు ఆ చిత్రానికి దరిదాపుల్లో కూడా నిలవలేకపోయాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి.. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి.
వాటితో పోలిస్తే ‘సాని కాయిదం’ (తెలుగులో చిన్ని) కాస్త పర్వాలేదనిపించినా.. అది కూడా కీర్తి ఆశించిన ఫలితాన్నయితే ఇవ్వలేదు. కానీ కీర్తి దగ్గరికి లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది మలయాళంలో ‘వాసి’ అనే సినిమా చేసిన ఆమె.. తాజాగా ‘రివాల్వర్ రీటా’ పేరుతో కొత్త సినిమా కబురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంక్రాంతి సందర్భంగా ‘రివాల్వర్ రీటా’ సినిమాను అనౌన్స్ చేశారు. చేతిలో రెండు గన్నులు పట్టుకున్న కీర్తి యానిమేటెడ్ లుక్తో పోస్టర్ వదిలారు. తమిళ దర్శకుడు కె.చంద్రు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సుధాన్ సుందరం, జగదీష్ పలణిస్వామి నిర్మాతలు.
సమంత చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం విశేషం. పోస్టర్ మీద ముందే ‘నెట్ ఫ్లిక్స్’ అని వేసేయడం చూస్తే.. ఇది ఆ ఓటీటీ కోసం చేస్తున్న సినిమాలా కనిపిస్తోంది. దీనికి థియేట్రికల్ రిలీజ్ లేకపోవచ్చు.
ఇంతకుముందు కీర్తి సినిమా ‘మిస్ ఇండియా’తో నెట్ ఫ్లిక్స్ వాళ్లు చేతులు కాల్చుకున్నారు. మళ్లీ ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాను అదే సంస్థ ముందే కొనేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఫస్ట్ లుక్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలా కనిపిస్తోంది. మరి ఈ జానర్ అయినా కీర్తికి మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.
This post was last modified on January 15, 2023 6:42 pm
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…