ప్రస్తుతం ఇండియాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న అతి కొద్దిమంది కథానాయికల్లో కీర్తి సురేష్ ఒకరు. ‘మహానటి’ సినిమాతో ఆమె ఇమేజే మారిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో అరడజను దాకా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస కట్టాయి.
కాకపోతే ‘మహానటి’ తర్వాత ఆమె నుంచి వచ్చిన సినిమాలు ఆ చిత్రానికి దరిదాపుల్లో కూడా నిలవలేకపోయాయి. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి.. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి.
వాటితో పోలిస్తే ‘సాని కాయిదం’ (తెలుగులో చిన్ని) కాస్త పర్వాలేదనిపించినా.. అది కూడా కీర్తి ఆశించిన ఫలితాన్నయితే ఇవ్వలేదు. కానీ కీర్తి దగ్గరికి లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్టులు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది మలయాళంలో ‘వాసి’ అనే సినిమా చేసిన ఆమె.. తాజాగా ‘రివాల్వర్ రీటా’ పేరుతో కొత్త సినిమా కబురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంక్రాంతి సందర్భంగా ‘రివాల్వర్ రీటా’ సినిమాను అనౌన్స్ చేశారు. చేతిలో రెండు గన్నులు పట్టుకున్న కీర్తి యానిమేటెడ్ లుక్తో పోస్టర్ వదిలారు. తమిళ దర్శకుడు కె.చంద్రు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సుధాన్ సుందరం, జగదీష్ పలణిస్వామి నిర్మాతలు.
సమంత చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం విశేషం. పోస్టర్ మీద ముందే ‘నెట్ ఫ్లిక్స్’ అని వేసేయడం చూస్తే.. ఇది ఆ ఓటీటీ కోసం చేస్తున్న సినిమాలా కనిపిస్తోంది. దీనికి థియేట్రికల్ రిలీజ్ లేకపోవచ్చు.
ఇంతకుముందు కీర్తి సినిమా ‘మిస్ ఇండియా’తో నెట్ ఫ్లిక్స్ వాళ్లు చేతులు కాల్చుకున్నారు. మళ్లీ ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాను అదే సంస్థ ముందే కొనేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఫస్ట్ లుక్ చూస్తే ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీలా కనిపిస్తోంది. మరి ఈ జానర్ అయినా కీర్తికి మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…