Movie News

శ్రుతిహాసన్.. కూరలో కరివేపాకు

ఈసారి సంక్రాంతికి అరుదైన చిత్రం చోటు చేసుకుంది. ఈ పండక్కి రిలీజైన రెండు పెద్ద సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లను నిర్మించింది ఒకే నిర్మాణ సంస్థ కాగా.. ఆ రెండింట్లోనూ మెయిన్ హీరోయిన్ శ్రుతి హాసనే. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణలకు జోడీగా ఆమె నటించింది.

ఒక దశలో కెరీర్ ముగిసిందనుకున్న శ్రుతి.. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ‘క్రాక్’తో ఫాంలోకి రావడం.. ఆ వెంటనే ఇలాంటి రెండు భారీ చిత్రాల్లో నటించడం.. అవి రెండూ ఒకేసారి సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో రిలీజ్ కావడం విశేషమే.

ఈ సినిమాలతో శ్రుతి రేంజే మారిపోతుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ రెండు చిత్రాల్లో శ్రుతిని చూసిన వాళ్లందరూ పెదవి విరుస్తున్నారు. ఈ రెండింట్లోనూ శ్రుతితి కూరలో కరివేపాకు టైపు పాత్రలే కావడమే అందుక్కారణం.

ముందుగా ‘వీరసింహారెడ్డి’లో శ్రుతి పాత్ర విషయానికి వస్తే.. ఆమె యంగ్ బాలయ్య సరసన నటించింది. ఈషా అనే అల్లరి అమ్మాయి పాత్రలో శ్రుతి ఏమాత్రం ప్రత్యేకత చాటుకోలేకపోయింది. యంగ్ బాలయ్య సరసన ఒక హీరోయిన్ని పెట్టాలంటే పెట్టాలి అన్నట్లు ఆమె పాత్రను డిజైన్ చేశారు.

సినిమాలో చాలా బోరింగ్‌గా అనిపించే సీన్లు శ్రుతితో ముడిపడ్డవే. శ్రుతి బాగానే అందాలు ఆరబోసినా.. పాత్ర పరంగా మాత్రం అందులో ఏ విశేషం లేదు. తొలి అరగంట తర్వాత శ్రుతి పాత్ర పూర్తిగా నామమాత్రం అయిపోతుంది. సెకండాఫ్‌లో ఒక పాట కోసం మాత్రమే ఆమె ఉంది. బాలయ్య పక్కన శ్రుతికి జోడీ కూడా సరిగా కుదరలేదు.

ఇక ‘వాల్తేరు వీరయ్య’ విషయానికి వస్తే.. ఆమె అండర్ కవర్ రా ఏజెంట్ పాత్ర చేసింది. రా ఏజెంట్ అంటే అబ్బో అనుకుంటాం కానీ.. తెర మీద ఈ పాత్రను కూడా చాలా సాధారణంగా చూపించారు. రా ఏజెంట్లు ఇలా కూడా ఉంటారా అని నవ్వుకునేలా ఆ పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు బాబీ.

ఈ సినిమాలో శ్రుతి లుక్ కూడా ఎందుకో సరిగా కుదరలేదు. చిరు పక్కన కూడా ఆమె కొంచెం ఆడ్‌గానే కనిపించింది. మొత్తంగా చూస్తే ఒకేసారి రిలీజైన రెండు భారీ చిత్రాల్లో కథానాయికగా నటించిన సంబరమేమో కానీ.. తెర మీద మాత్రం శ్రుతి పాత్రలు తేలిపోయాయి. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

50 minutes ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

2 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

2 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

2 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

2 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

3 hours ago