రాజకీయాల నుంచి నిష్క్రమించాక చిరు చూపిస్తున్న అతి మంచితనం ఈ మధ్య బాగా చర్చనీయాంశం అవుతోంది. అందరితో మంచిగా ఉండాలని.. మంచి అనిపించుకోవాలని.. ఎవరినీ నొప్పించకూడదని భావిస్తూ చిరు చూపించే అతి మంచితనం ఆయన అభిమానులకే నచ్చట్లేదు. ఓవైపు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రత్యర్థులతో బలంగా తలపడుతుంటే.. ఆయన్ని వాళ్లు దారుణంగా టార్గెట్ చేస్తుంటే.. చిరు మాత్రం ఆ ప్రత్యర్థులతో సన్నిహితంగా మెలగడం.. వారిని గౌరవించడం పట్ల మెగా అభిమానుల నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చిరు సాన్నిహిత్యం అభిమానులకు నచ్చట్లేదు. తన తమ్ముణ్ని తిట్టిన వాళ్లు మళ్లీ తనను పెళ్లిళ్లు పేరంటాలకు పిలిస్తే బాధేస్తుందనడం.. ఇటీవల తనను విమర్శించిన రోజాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె విచక్షణకే వదిలేస్తా అనడం చూసి చిరు మరీ ఇంత మర్యాదరామన్నలా వ్యవహరించాలా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.
ఐతే విమర్శలు, వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే.. తాజాగా 2024 ఎన్నికలకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు చిరు ఇచ్చిన జవాబు మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి? మిమ్మల్ని ఇంటికి పిలిచి గౌరవించిన జగన్కా.. మీ తోడబుట్టిన తమ్ముడు పవన్కా అంటూ ఇంటర్వ్యూయర్ అడిగితే.. దానికి సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు చిరు. గతంలో తన మద్దతు తమ్ముడికే.. మెగా అభిమానులందరూ కూడా జనసేన వైపే ఉంటారన్నట్లు మాట్లాడిన చిరు.. ఇదే విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో చెప్పలేకపోయారు.
జగన్ పేరెత్తేసరికి.. పవన్కే తన మద్దతు అంటే ఏపీ సీఎంకు శత్రువును అయిపోతానని అనుకున్నారో ఏమో.. తటస్థంగా ఉండబోతున్నట్లు మాట్లాడారు. తనది ఆంధ్రప్రదేశ్ కాదని, తెలంగాణలో ఉంటున్నానని.. ఏపీ రాజకీయాలను కూడా తాను పెద్దగా ఫాలో కావట్లేదని చిరు వ్యాఖ్యానించడం విడ్డూరం.
కనీసం తమ్ముడికి బహిరంగంగా మద్దతు ప్రకటించడానికి కూడా చిరుకు ఏం అడ్డొచ్చిందని.. మరీ ఇంత డిప్లమాటిగ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముందని మెగా అభిమానులే ప్రశ్నలు సంధిస్తున్నారు. రాజకీయ నాయకుడిగా చిరు వైఫల్యానికి తోడు.. తన రాజకీయ ప్రత్యర్థులతో ఆయన సాన్నిహిత్యం పవన్కు ఇప్పటికే ప్రతిబంధకాలుగా మారగా.. ఇప్పుడు కనీసం మెగా అభిమానులంతా పవన్ వైపే ఉండాలని బహిరంగంగా ప్రకటన కూడా చేయకపోవడం మరింత పెద్ద మైనస్ అనడంలో సందేహం లేదు.
This post was last modified on January 13, 2023 7:19 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…