aishwarya lekshmi
వెండితెర మీద మెరిసిపోయే బ్యూటీలు తమ ప్రేమ విషయాల్ని పబ్లిక్ గా చెప్పుకోవటానికి ఇష్టపడరు. నలుగురు నోళ్లలో నానిన తర్వాత చివర్లో ఎప్పుడో చెప్పేస్తుంటారు. అప్పటివరకు తమ లవ్ రిలేషన్ ను గుట్టుగా ఉంచేస్తారు. మరికొందరు బ్యూటీలు తాము ప్రేమ.. పెళ్లి విషయం గురించి ఆలోచించటం లేదంటూనే.. మరొకరితో ప్రేమాయణాన్ని నడిపిస్తుంటారు. అలాంటి ఉదంతాలెన్నో. తాజాగా మలయాళ కుట్టి.. వరుస సినిమాలతో అందరి మనసుల్ని తన అందంతో దోచేసే ఐశ్వర్య లక్ష్మీ లవ్ మ్యాటర్ తో వార్తల్లోకి వచ్చారు.
తాజాగా ఆమె తన సోషల్ ఖాతాలో తన ప్రియుడ్ని పరిచయం చేస్తూ పోస్టు పెట్టారు. అమ్ము.. పొన్నియన్ సెల్వన్ తదితర సినిమాలతో ఫేమ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ నెల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పెళ్లి గురించి ఆలోచించటం లేదని.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదని పేర్కొన్నారు. అలాంటి ఆమె తాజాగా నటుడు అర్జున్ దాస్ తో తానుకలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసి.. కింద లవ్ సింబల్ పెట్టటంతో ఆమె తన లవ్ మ్యాటర్ ను రివీల్ చేసినట్లుగా చెబుతున్నారు.
దీంతో.. ఆమె అభిమానులు పలువురు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె గురించి తెలీదా? ఇదేదో సినిమా పబ్లిసిటీ స్టంట్ తప్పించి.. ఆమె ప్రేమలో పడి ఉండకపోవచ్చన్న వ్యాఖ్య చేస్తున్నారు. ఇరువురు కలిసి కొత్త ప్రాజెక్టులో చేస్తున్న నేపథ్యంలో అలాంటి పోస్టు పెట్టి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఆ వాదనలో నిజం లేదని.. అమ్మడు ప్రేమలో పడి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పెట్టే పోస్టు ఏదో కాస్తంత క్లియర్ పెట్టేసి ఉంటే సరిపోయేది కదా?
This post was last modified on January 12, 2023 11:58 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…