మెగాస్టార్ అతి మంచితనం మీద ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. మామూలుగానే చిరు ఎవరినీ గట్టిగా ఒక మాట అనడు. రాజకీయాల్లో ఇమడలేక బయటికి వచ్చేశాక ఆయన మరింత సున్నితమైన వ్యక్తిగా మారిపోయారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ శత్రువులతోనూ చిరు చాలా మంచిగా ఉండడం పట్ల అభిమానుల్లో అభ్యంతరం వ్యక్తం కావడం తెలిసిందే. సినీ రంగంలో కూడా తనను ఎవరైనా టార్గెట్ చేసినా.. తనపై విమర్శలు గుప్పించినా ఆయన స్పందించరు. ఇలా ఉండడం కరెక్ట్ కాదని అభిమానులు కూడా అంటుంటారు. ఐతే తాను ఎందుకు అలా ఉంటానో చిరు ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సందర్భంగా వివరించే ప్రయత్నం చేశారు.
“అందరితో మంచిగా ఉండడం, సంయమనం పాటించడం కచ్చితంగా అవసరమే. ఏదైనా సంఘటన జరిగినపుడు ఎదురు తిరిగితే నా ఇగో చల్లారుతుందేమో కానీ.. నా సినిమాకు భారీగా నష్టం జరగొచ్చు. దాని వల్ల అభిమానులు నిరాశ చెందుతారు. నా సంయమనం అందరికీ మంచి చేస్తుందంటే నేను వెనక్కి తగ్గుతాను. అంతిమ ఫలితం సానుకూలంగా రావడం ముఖ్యం” అని చిరు చెప్పాడు.
ఇక సంక్రాంతి రేసులో తన సినిమానే చివరగా రావడం గురించి చిరు స్పందిస్తూ.. “సంక్రాంతికి మైత్రీ సంస్థ నుంచే రెండు సినిమాలు రిలీజవుతున్నాయి. మంచి సినిమా ఎప్పుడైనా విజయం సాధిస్తుంది. బయ్యర్లను, ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని అందరికీ మంచి జరిగేలా రిలీజ్ డేట్లు నిర్ణయించాం” అని చిరు అన్నాడు. భవిష్యత్తులో తనకు దర్శకత్వం చేయగలననే నమ్మకం కలిగినపుడు దర్శకుడిగా మారుతానని చిరు ఈ సందర్భంగా చెప్పడం విశేషం.
This post was last modified on January 11, 2023 9:12 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…